Followers

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు

విజయనగరం,పెన్ పవర్

ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు,ఔత్సాహికులు చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.విపత్తు నివారణ సంస్థ వెల్లడించిన విధంగా ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని కావున ప్రజలకు దాహార్తికి ఇబ్బంది లేకుండా రద్దీగా ఉన్న ప్రాంతాలలో నగరపాలక సంస్థ  చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లయితే తమను సంప్రదించినచో అవసరమైన త్రాగు నీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరాశ్రయులు ఎండవేడిమికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పట్టణ కేంద్రంలో ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. బిచ్చగాళ్ళు, నిరాశ్రయులు, నిరాధారమైన వృద్దులను పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి అప్పజెప్పాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా  ఎండలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పనివేళల్లో మార్పు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి పనిచేసే కార్మికులకు మధ్యాహ్నం 3 నుండి  పనిచేసే విధంగా సమయాన్ని మార్పు చేశామని చెప్పారు. ప్రజలు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎండలో ఎక్కువగా తిరగవద్దని చెప్పారు ఒక వేళ ఎండలో వెళ్లాల్సి వస్తే తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి రక్షించుకునే వారవుతారని తెలిపారు.

కె వి పి ఎస్ నెల్లికుదురు మండల కమిటీ ఎన్నిక

 కె వి పి ఎస్ నెల్లికుదురు మండల కమిటీ ఎన్నిక

నెల్లికుదురు, పెన్ పవర్

మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి మండలనూతన  కమిటీని  ముఖ్య కార్యకర్తల సమావేశంలో బుధవారం ఎన్నుకున్నట్లు కె వి పి ఎస్  జిల్లా కార్యదర్శి కుర్రమహేష్ తెలిపారు. మండల అధ్యక్షులుగా హెచ్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఇస్సంపెల్లి సైదులు ను మండల కమిటీ సభ్యులుగా జెల్ల వీరెంకులు, గణపురం ఎల్లయ్య, ఎర్పుల ఉప్పలయ్య, బాణాల యాకయ్య, వెంకటలక్ష్మి, వెంకటయ్య, ప్రవీణ్ ను ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు..

సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం

 సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానం

విజయనగరం,పెన్ పవర్

మధ్య తరగతి కుటుంబాలకు  సొంతింటి కల నెరవేరే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిందని స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ ప్రణాళిక అధికారులు, వార్డు ప్రణాళికా మరియు వెల్ఫేర్ కార్యదర్శులుతో సమావేశమయ్యారు. ప్రభుత్వం రూపొందించిన సరికొత్త విధానం ప్రకారం మూడు కేటగిరీల లో ఇళ్ల స్థలాలను లే అవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి అందించేందుకు నిర్ణయించిందన్నారు. ఇందుకోసమై వార్డు ప్రణాళిక కార్యదర్శులు లబ్దిదారుల ప్రాధమిక సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

లాభం లేకుండా, నష్టం కలగకుండా ప్రభుత్వమే లేఅవుట్ల రూపంలో మధ్యతరగతి వారికి స్థలాలను అందించే బృహత్తర కార్యక్రమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని బట్టి స్థల విస్తీర్ణం మంజూరు చేయబడుతుందని అన్నారు. 150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీలుగా యం.ఐ.జి. స్థలాలు పంపిణీ ఉంటుందన్నారు.3 లక్షల నుండి 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకం కింద లబ్ధిదారులుగా  గుర్తించనున్నారని తెలిపారు. ఇందుకోసమే  ప్రాథమిక సమాచార సేకరణకు ప్రతి ఇంటికి వచ్చే వార్డు కార్యదర్శులకు ప్రజలు సహకరించి ఖచ్చితమైన సమాచారాన్ని అందివ్వాలన్నారు.అన్ని వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ  ప్లానర్లు వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు, పట్టణ ప్రణాళిక అధికారులు కనకారావు,శ్రీలక్ష్మి ,టీపీఎస్ జనార్ధన్, సర్వేయర్ సింహాచలం, వార్డు ప్రణాళికా కార్యదర్శులు పాల్గొన్నారు.

కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి.

 కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి.

ప్రతి మహిళా తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలి..

మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ 



వేములవాడ, పెన్ పవర్

కరాటే తో ఆత్మ స్థాయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయిని ,ప్రతి మహిళా తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాలని  వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మఆన్నారు.గురువారం బింగి మహేష్  గార్డెన్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ లు మరియు  సర్టిఫికెట్ ల కార్యక్రమానికి ముఖ్యఅతిధి గామధు రాజేందర్ హజరై 50 మంది విద్యార్థిని, విద్యార్థులకు బెల్ట్ ల తోపాటు సర్టిఫికెట్లల ప్రధానం చేశారు. ఈ సందర్బంగా మధురాజేందర్  మాట్లాడుతూ కరాటే అనేది అతి ప్రాచీనమైన యుద్ధ కళ అని ఈ విద్య నేర్చుకోవటం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం అలవడుతుందని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆగాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా  కరాటేనేర్చుకోవాలని అన్నారు.ఆనంతరం చీఫ్ ఎగ్జామినర్ ఎంఏ.మన్నాన్  మాట్లాడుతూ కరాటే అనేది మొన్నటి వరకు ఒక ఆత్మరక్షణ విద్య అని ఇప్పుడు కరాటే ని ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందని ,తద్వారా కరాటే నేర్చుకొని పోటీల్లో పాల్గొన్నట్లయితే 2% రిజర్వేషన్ వర్తిస్తుందని దీనిద్వారా ఉన్నత విద్య , ఉద్యోగ అవకాశం ఉంటుందని అన్నారు. కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్ బింగి మహేష్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్  మహమ్మద్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన శిక్షకులు .మన్నాన్ తో పాటు  కరాటే ఇన్‌క్టర్ల లను ప్రత్యేకంగా అభినందిచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు  శ్రీకాంత్ గౌడ్, రియల్ ఎస్టేట్ బిల్డర్ మాడిశెట్టి   కృపాల్ ,లింగంపేట మహోదయ స్కూల్   కరస్పాండెంట్ కృష్ణ , కరాటే సీనియర్ శిక్షకులు కూరగాయల శ్రీనివాస్, దుండగుల దేవరాజ్  శివరాత్రి రాజు, ఎమ్ తిరుపతి, కనికరపు రాజశేఖర్ పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ పాలక మండలి ప్రత్యేక సమావేశం

 గ్రామ పంచాయతీ పాలక మండలి ప్రత్యేక సమావేశం


చిన్నగూడూరు, పెన్ పవర్

చిన్నగూడూరు  మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనం లో గురువారం పాలక వర్గ సభ్యులతో సర్పంచ్ కొమ్ము మల్లయ్య అద్యక్షతన సమావేశం చేపట్టారు. ముఖ్యంగా తాగునీటి సమస్య  మిషన్ భగీరథ నీళ్ల గురించి సభ్యులు అంశాన్ని సర్పంచ్ దృష్టికి తెచ్చారు.సభలో పాల్గొన్న మిషన్ భగీరథ ఏఈ విష్ణువర్థన్ మాట్లాడుతూ మే చివరి నాటికి పైపులైన్లు బిగించి ప్రతి ఇంటింటికీ భగీరథ నీళ్లందిస్తామని పాలక వర్గ సభ్యులకు తెలిపారు.మండల కేంద్రంలో ఉన్న వర్తక, వ్యాపార సంబంధించిన పన్నుల వసూలుపై పాలక వర్గ సభ్యులతో సర్పంచ్ చర్చించారు.అదే విధంగా మినరల్ వాటర్ గ్రామ పంచాయతీ కీ అప్పచెప్పే విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించవలసిందే నని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సర్పంచ్ రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా వైస్ ఎంపీపీ పిల్లి వీరన్న, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్ పాల్గొనగా..ఈ కార్యక్రమంలోవార్డు ఉప  సర్పంచ్ దుండి ఉపేందర్, సెక్రటరీ అజీమ్, వార్డు సభ్యులు పసునాధి లావణ్యవిజయ్, కొత్త పుష్ప, చిత్తరి విరన్న, వీరాచారి, రవి, సుమన్ గ్రామ పంచాయితీ మల్టీవర్కర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు బుక్స్ పంపిణీ

 లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ పిల్లలకు  బుక్స్ పంపిణీ

సమాజానికి ఆదర్శం లైన్స్ క్లబ్ ,,,సర్పంచ్ గణపారపు సరిత

కేసముద్రం,  పెన్ పవర్

 మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాజానికి ఎంతో ఆదర్శమని ఇంటికన్నె సర్పంచ్ గణపారపు సరిత అన్నారు. కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంటికన్నె జడ్పీ హైస్కూల్ లో గురువారం 24 మంది పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ అంబాల సృజన, క్లబ్ కోశాధికారి చింతా కరుణాకర్, సభ్యులు బోగోజు నాగేశ్వరాచారి, హెచ్ఎం ఎల్.పద్మజ, ఉపాధ్యాయులు కె.నర్సింగరావు, పి.సతీష్ కుమార్, జయకృష్ణ, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా ప్రారంభం

 ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ టీకా ప్రారంభం

కేసముద్రం, పెన్ పవర్

 కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాలకు పైబడిన వారికి కోవిడ్ టీకాను డాక్టర్  అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ సరళిని ఎంపీడీవో రోజారాణి, సర్పంచ్ దార్ల రాంమూర్తి పర్యవేక్షించారు. ఇనుగుర్తి పీ హెచ్ సి పరిదిలో ఉన్న ప్రజలు గమనించి అర్హులైన వారు టీకా వేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి, కనీస పరిశుభ్రతతో పాటు సామాజిక దూరం పాటించాలని, గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...