Followers

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

 

అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు


శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు


పట్టించుకోని పలు విభాగాల పోలీసులు


పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు


యువకుల నుంచి బడా వ్యాపారులవరకు బెట్టింగ్


గ్రామీణ ప్రాంతాలకు పాకిన బెట్టింగులు 



పీసీపల్లి పెన్ పవర్ ఏప్రిల్ 1


ఐపీఎల్ సీజన్ కొందరి జీవితాల్లో వెలుగు నింపుతుండగా మెజార్టీ వారి జీవితాలు బుగ్గిపాలు చేస్తోంది. బెట్టింగ్ కు పాల్పడుతూ లక్షలరూపాయలు నష్టపోతున్నారు.. తమతమ ఆర్థిక స్థోమతను బట్టి బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ వంటి  నగరాల్లో పరిమితమైన బెట్టింగ్ నేడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాగానే బెట్టింగ్ జోరు కొనసాగుతోంది.  ప్రతిరోజూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మరుతున్నాయి. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ  ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే - పరిమితంగా ఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.. 

 వేసవిలో వస్తున్న  ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ప్రతిరోజు లక్షల్లో బెట్టింగులు నడుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్ అభమానులు. యువత బెట్టింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఇందుకోసం ఒక గ్రూపుగా ఏర్పడి లక్షల్లో బెట్టింగ్ లు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేక గదుల్లో టీవీలతో సెటప్ చేసుకుని, బెట్టింగ్లు నిర్వహిస్తుంటారు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్ లలో లక్షలు పెడుతుంటారు. బెట్టింగ్ ల దందాను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పెద్దగా నిఘా పెట్టడం లేదు.. బెట్టింగ్ ముఠాలు ప్రతిరోజు పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తూ.సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో కొంతమంది బెట్టింగ్ లలో నష్టపోతున్నారు.  యూత్ నుంచి మొదలు బడా వ్యక్తుల వరకు అందరూ బెట్టింగ్ లో పాల్గొంటూ, లక్షలు పొగొట్టుకుంటున్నారు. చాలా మంది  ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. పోలీసులకు ఏమాత్రం దొరకకుండా, గుట్టుచప్పుడు కాకుండా అంతా కోడ్ పద్దతిలో బెట్టింగ్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తున్నారు. పోలీసులు ఈసారి ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ లపై సరైన నిఘా పెట్టకపోవడంతో, మరింత యథచ్చేగా బెట్టింగ్ దందాను సాగిస్తున్నారు.


అంతా కోడ్ బాష లోనే

బెట్టింగ్ లో పాల్గొనే వారికి నిర్వహకులు అంతా కోడ్ భాషలోనే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఏమాత్రం పోలీసులకు అనుమానం రాకుండా, తెలిసిన వారిని మాత్రమే బెట్టింగ్ లోకి తీసుకుంటారు. కొత్తవారిని ఏమాత్రం తీసుకోరు.


అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు

 గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దందాలు పందెంలో గెలిచినా ఓడినా సరే డబ్బు కూడా ఆన్లైన్లోనే బదిలీ అవుతోంది. ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్లు అయిన గూగుల్పే, పేటీఎం, ఫోన్ పే యాప్ల నుంచి నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండడంతో ఎక్కడ ఏ చిన్న అనుమానం రాకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగుతోంది.


బెట్టింగ్లో దొరికితే చిక్కులే.


బెట్టింగ్ మాయలో పడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. పోలీసులు ఎఫ్ఎఆర్ నమోదు చేస్తారు. పోలీసులరికార్డుల్లో పేరు, చిరునామా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. బెట్టింగ్ఆడుతూ లేదా నిర్వహిస్తూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవు. యువత సన్మార్గంలో నడవాలి. ఈజీ మనీకి అలవాటు పడి చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు. ప్రభుత్వం ఉద్యోగాలకునోటిఫికేషన్ ఫికేషన్ వేస్తోంది ఉంది. ఉద్యోగా ఉద్యోగాలు సాధించేలా చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉద్యోగాలు సంపాదించాలి. ఇలాంటి వ్యవహారాల్లో తల దూర్చకూడదు. 



రోజురోజుకు విస్తరిస్తున్న బెట్టింగ్


ఐపీఎల్ పేరిట బెట్టింగ్ దందా చాపకింద నీరులా వ్యాపి స్తోంది. బెట్టింగ్ కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. మరీ ముఖ్యంగా యువత బెట్టింగ్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నది. కొందరు ఈజీ మనీకి అలవాటు పడి సర్వం కోల్పోతున్నారు. క్రికెట్ ప్రేమికుల వ్యసనాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ చివరికి తమను తామే కాపాడుకోలేనంత ఉచ్చులోకి వెళ్లిపోతున్నారు.. అప్పులు ఇచ్చిన వ్యక్తులు వేధిస్తున్న క్రమంలో డిప్రెషనకు లోనవుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆస్తులు అమ్ముకున్న వారు కొందరుంటే ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్న వారు పోలేదు. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ లో సాగిపోతున్న ఈ నయా జూదానికి పోలీసులు సైతం ముక్కుతాడు వేయలేకపోతున్నారు.రికార్డు స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నాయి.. పోలీసులు నిఘా పెట్టినా అడ్డాలను మార్చుతూ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితంగాఉండే బెట్టింగ్ వ్యవహారం నేడు గ్రామీణ ప్రాంతాల్లో యువకులు కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా యువత బెట్టింగ్ జాడ్యాలకు తమ నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్లకు పాల్పడటం అప్పులు కావడం వాటిని తీర్చేందుకు నానాతంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం.

నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్.

 ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైకిళ్ళు

 ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు  నష్టం.

పెన్ పవర్ బ్యూరో, విశాఖపట్నం

ఒకే పార్టీ నాయకుల మధ్య తలెత్తిన వర్గపోరు ప్రభుత్వ లక్ష్యాన్ని సైతం నీరుగార్చింది. పేద వికలాంగులకు ఉపయోగపడే మూడు చక్రాల సైకిలు అందించాలని ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి వీల్చైర్ లను సమకూరిస్తే ఆదిపత్య పోరుతో  అవి కాస్త పంపిణీకి నోచుకోలేదు. పది నెలలుగా ఎండలో ఎండి వానలో తడవడం వల్ల మూడు చక్రాల సైకిళ్ళు తుప్పు పట్టి పోయాయి. వాటిని వికలాంగులకు అందించిన వాటిని స్క్రాప్ కింద  కిలోల లెక్కన అమ్ముకోవాల్సిందే.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ళు ను  2020 ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా  మండల పరిషత్ కార్యాలయాలకు చేరాయి. అధికారులు వాటిని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదగా పంపిణీ జరగాల్సి ఉంది. కానీ జిల్లాలో పాయకరావుపేట  నియోజకవర్గం  ఎస్ రాయవరం మండలం లో వికలాంగులు సైకిళ్ళు   పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఉచితంగా మూడు చక్రాల సైకిలు  ఇస్తుందని  వికలాంగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పది నెలలు అవుతున్న వీల్చైర్ ల పంపిణీ కి  నోచుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే  అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీల మధ్య తలెత్తినా వర్గ వివాదం  సంక్షేమ పథకాలను మూలకు చేరుతున్నాయి. మండలంలో గుర్తించిన వికలాంగులకు అవసరమైన  80  వికలాంగు సైకిళ్లను ఆగస్టులో పరికరాలు తెచ్చి బిగించారు. నేతల మధ్య పోరు మూడు చక్రాల సైకిల్ పంపిణీకి గ్రహణం పట్టింది.

వాటిని పంపిణీ చేయడానికి  స్థానిక ఎంపిడిఓ  చొరవ చూపకపోవడంతో  మూడు చక్రాల సైకిలు మూలకు చేరాయి. వాటిని మండల కేంద్రంలో రెల్లి వీధి ఆర్ బి కె   వద్ద పడేశారు. ఆగస్టు తర్వాత కురిసిన వర్షాలు  ఆతర్వాత ఎండలకు వికలాంగులు సైకిల్ లు పూర్తిగా పాడైపోయాయి. వాటిని చూస్తే  కాలం చెల్లిన మూడు చక్రాల సైకిలు  అనుకోక తప్పదు. తుప్పు పట్టి పోయి సీట్లు  కూలిపోయి గుట్టలుగా పడి ఉన్న స్క్రాప్ ల  దర్శనమిస్తుంది. వికలాంగుల కోసం  ప్రభుత్వం లక్షలు వెచ్చిస్తే  ఇరువురు నేతల వర్గ పోరు తో  అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరు అయింది. వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్నాయి అని ఆశిస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పార్టీ నాయకుల్లో  తలెత్తిన అవాంతరాల కారణంగా  పధకాలు పేదలకు చేరడం లేదన్న నగ్నసత్యం  పెరుమాళ్ళకెరుక. మూడు చక్రాల సైకిల్ నష్టాన్ని ఎవరు పూడుస్తారు. ఈ నాయకులా? లేక సంబంధిత అధికారులా?..

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

జాతీయ రహదారుల భూసేకరణపై సమీక్ష

 అభివృద్ధిలో పచ్చదనానికి ప్రాధాన్యత 

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్

విజయనగరం, పెన్ పవర్

అభివృద్ధి కార్యక్రమాల్లో పచ్చదనానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం, భూ సేకరణ, ఇతర అంశాలపై శుక్రవారం తన చాంబర్లో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి, విజయనగరం బైపాస్ రోడ్డు, సాలూరు బైపాస్, మానాపురం ఆర్వోబి, పంచాయితీరాజ్ శాఖ పరిధిలోని 12 రోడ్ల నిర్మాణం, వాటి ప్రస్తుత స్థితి పై ఆరాతీశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ,  రహదారుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి నిర్మాణంలో మొక్కలు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని ఆదేశించారు.  విజయనగరం బైపాస్ రోడ్డులో మొక్కలు నాటే పనులను వెంటనే ప్రారంభించలన్నారు. ఈ నెలాఖరు నాటికి డివైడర్ లో మట్టిని నింపి, ఇరువైపులా మొక్కలను నాటేందుకు గోతులు సిద్ధం చేయాలన్నారు. జూన్1 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ ఎక్కువై, కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. దీనిని అరికట్టాలంటే  మొక్కలను నాటడమే ఏకైక మార్గమన్నారు. అందువల్ల ఒకవైపు రహదారిని పూర్తి చేస్తూనే, మరోవైపు మొక్కలు నాటడం మొదలు పెట్టాలని సూచించారు. రోడ్డు పూర్తి అయ్యేటప్పటికి, మొక్కలుకుడా బాగా పెరుగుతాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్డీసి హెచ్వి జయరాం, ట్రాన్స్ కో  ఎస్ఈ వై.విష్ణు, ఆర్అండ్బి ఎస్ఈ విజయశ్రీ, పిఆర్ ఎస్సీ గుప్త,. ఉద్యానశాఖ డిడి శ్రీనివాస్, నేషనల్ హైవేస్ ఏఇ ఈ సురేష్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం

 గుమ్మలక్ష్మీపురం లో సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం


లాక్డౌన్ కి మద్దతు ఇచ్చిన వర్తకులకు కృతజ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు సహకరించాలి

సర్పంచ్ బొత్తాడ. గౌరీశంకర్రావు

గుమ్మలక్ష్మీపురం, పెన్ పవర్

గుమ్మలక్ష్మీపురం పంచాయతీలో శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ కి శ్రీకారం పడింది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది.మధ్యాన్నం 12 నుండి ఉదయం 6గంటల వరకు పోలీసులు సహకారంతో ప్రభుత్వం కర్ఫ్యూ నిర్వహిస్తుంది. అయినప్పటికీ పంచాయతీ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్న తరుణంలో గ్రామ సర్పంచ్ గౌరీశంకర్రావు పిలుపు మేరకు వ్యాపార వర్గాలు శని,ఆదివారాలు సంపూర్ణ లాక్డౌన్ చేయడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చాయి. కరోనా వ్యాప్తిని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో వ్యాపార సముదాయాలను మూసివేయడానికి ముందుకు వచ్చిన వర్తకులకు సర్పంచ్ గౌరీశంకర్రావు కృతజ్ఞతలు తెలియచేసారు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

గ్రామాల్లో కరోనా నివారణ చర్యలు.

సంతబొమ్మాలి, పెన్ పవర్

మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. మర్రిపాడు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువకులు, వీధుల్లో , మురికి కాలువలలో బ్లీచింగ్ వెదజల్లారు. పరిసరాల పరిశుభ్రత తో ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చునని ప్రజలకు అవగాహన కల్పించారు. సంతబొమ్మాలి లో  సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి ప్రతినిధి కళింగపట్నం అప్పారావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.వీరితో పాటుగా అంగన్వాడి ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ మార్పు అశోక చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శులు పీ రామకృష్ణ , సిద్ధార్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అన్ని వీధుల్లోను బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మార్పు నాగభూషణ్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

మే 15 తర్వాత మొదటి డోస్ టీకా

 మే 15 తర్వాత మొదటి డోస్ టీకా 

మెంటాడ, పెన్ పవర్ 

మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శృతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 15  తేదీ వరకు మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి డోసు టీకా వేసుకున్న వారు చాలామంది ఉన్నారని వారికి  మే 15వ తేదీ లోపు రెండో డోసు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రస్తుతము మొదటి డోస్ టీకా ను నిలిపివేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రెండవ డోసు పూర్తి చేసిన తరువాత మే15 తరువాత మరల మొదటి డోసు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు.ఈవిషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రస్తుతము మొదటి డోసు టీకా  వేసుకున్న వారిని గుర్తిస్తున్నాం అని అన్నారు. వారికి పూర్తి కాగానే మొదటి డోసు టీకా మళ్లీ వేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ వి పద్మలత, సూపర్వైజర్  వెంకటాద్రి, హెల్త్ అసిస్టెంట్ రవి, ఏఎన్ఎంలు జయశీల, లతా, పార్వతి, ఆశా కార్యకర్తలు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

 అర్హులైన అందరికీ వ్యాక్సిన్.

సంతబొమ్మాళి, పెన్ పవర్. 

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ కరోనా మొదటి మరియు రెండో డోస్ వ్యాక్సిన్ వేస్తున్నామని సంతబొమ్మాళి మండలం నౌపడ ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ కోదండ రావు తెలియజేశారు. గురువారం 176 మందికి మరియు  శుక్రవారం 69 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. గురువారం మొదటి డోస్ వేయించుకోవడానికి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి జెడ్పిటిసి అభ్యర్థి పాల వసంత రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన విలేఖర్ల బృందానికి వేశారు. ఈ సందర్భంగా వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1800 వ్యాక్సిన్ కేంద్రానికి రాగా వచ్చిన వ్యాక్సిన్ పూర్తిగా వెయడం జరిగిందని ఆయన తెలిపారు. ఫీవర్ సర్వే విస్తృతస్థాయిలో డోర్ టు డోర్ చేయిస్తున్నామని  ఇప్పటి వరకు జరిగిన కరోనా టెస్టుల్లో 51 మంది హాంఐసోలేషన్ లో ఉండగా 36 మంది పూర్తిగా కోలుకున్నారని తెలుపుతూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలు భయపడకుండా ముందుకు వస్తున్నారని వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తిచేసి వ్యాక్సినేషన్ వేస్తున్నామని  ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన వరకు టీకా వేస్తున్నామని, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటేషన్ వినియోగిస్తూ భౌతిక దూరం పాటిస్తూ ఇంటి వద్ద ఉండి భద్రతా చర్యలు చేపట్టినట్లు అయితే కరోనాను  పూర్తిగా జయించొచ్చు అని, బలమైన ఆహారం తీసుకొని, అవసరం ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ, పలు ఆరోగ్య సూత్రాలను పాటించటం వలన కరోనా దరిచేరదని ప్రజలు భయపడవద్దని ఆయన తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...