Followers

ఆల‌యాల‌పై దాడుల‌కు పరాకాష్ఠ రామ‌తీర్థం ఘ‌ట‌న‌: తిరుమ‌ల‌లో చిన‌జీయ‌ర్ స్వామి

ఆల‌యాల‌పై దాడుల‌కు పరాకాష్ఠ రామ‌తీర్థం ఘ‌ట‌న‌: తిరుమ‌ల‌లో చిన‌జీయ‌ర్ స్వామి

ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాలు

దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయి

ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సూచ‌న‌లు చేస్తాం

తిరుమల, పెన్ పవర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులపై త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆల‌యాల‌పై దాడుల‌కు ప‌రాకాష్ఠ రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హ ధ్వంసం అని చెప్పారు. ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న  అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ... ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాల‌ని చెప్పారు. దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. కాగా, క‌రోనా నుంచి విముక్తి క‌ల‌గాలని తాను శ్రీవారిని ప్రార్థించాన‌ని చెప్పారు. కాగా, తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిన్న చిన‌జీయ‌ర్ స్వామి తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి తాము నివేదిక అందించనున్నామని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

బాలాకోట్​పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 బాలాకోట్​ పై భారత్ వైమానిక దాడులకు రెండేళ్లు

 పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రస్థావరాలపై దాడి

వందలాది మంది ఉగ్రవాదుల హతం..

బలగాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నరాజ్ నాథ్

ఉగ్రవాదంపై భారత్ దృక్పథానికి నిదర్శనమన్న అమిత్ షా

 న్యూస్ డెస్క్, పెన్ పవర్

అందరూ హాయిగా నిద్రపోతున్న టైం అది. నిశీధి పరిచేసిన గగన వీధుల్లో ఝమ్మంటూ దూసుకెళ్తున్న యుద్ధ విమానాల నుంచి జారిన జ్వాలా క్షిపణులు.. క్షణాల్లో ఉగ్ర స్థావరాలను అగ్ని కీలల్లో ముంచెత్తాయి. వందలాది మంది ఉగ్రమూకలను ఆహుతి చేశాయి.2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులను బలిగొన్న ఉగ్రదాడులకు ప్రతీకారంగా.. వారం రోజులు తిరగకముందే ఫిబ్రవరి 26న పాక్ ఆక్రమిత భూభాగంలో ఉన్న బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడులివి. గుండెల్లో నివురుగప్పిన ఆ ప్రతీకారాన్ని తీర్చుకుని నేటికి రెండేళ్లు.ఈ సందర్భంగా వైమానిక దళ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడుతూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా బాలాకోట్ దాడులను గుర్తు చేసుకున్నారు. ‘‘బాలాకోట్ పై వైమానిక దాడులకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భారత వైమానిక దళ ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నా. ఉగ్రవాదంపై తమ పోరాటం సాగుతుందని చెప్పడానికి ఈ దాడులే నిదర్శనం. దేశాన్ని ఎల్లప్పుడూ భద్రంగా, సురక్షితంగా ఉంచుతున్న సాయుధ బలగాలు మాకు గర్వకారణం’’ అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.బాలాకోట్ పై దాడులతో ఉగ్రవాదంపై భారత్ దృక్పథం ఏంటో మరోసారి రుజువు చేసిందని అమిత్ షా అన్నారు. ‘‘పుల్వామాలో అమరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. బాలాకోట్ దాడుల సందర్భంగా వైమానిక దళాలు చూపించిన తెగువకు సెల్యూట్ చేస్తున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ, సైనికుల భద్రతే మాకు ప్రధానం’’ అని ట్వీట్ చేశారు.
కాగా, బాలాకోట్ ఎయిర్ స్ట్రయిక్స్ తర్వాత జరిగిన ఘర్షణల్లో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఎఫ్16 విమానాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పాక్ భూభాగంలో ఆయన విమానం కూలిపోయింది. అక్కడి వారికీ అభినందన్ బందీగా చిక్కాడు. పాక్ సైనికులు ఆయన్ను అదుపులోకి తీసుకుని, కొన్ని రోజులు విచారించిన తర్వాత, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు తిరిగి భారత్ కు అప్పగించారు.

కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

 కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల మాఫియాను అరికట్టాలి ఎస్ ఎఫ్ ఐ

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ..

 



కుత్బుల్లాపూర్/పెన్ పవర్;

 కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా అరికట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణ లో భాగంగా శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్పొరేట్ విద్యాసంస్థల దగ్గర  విద్యార్థులు ,విద్యార్థుల తల్లదండ్రుల తో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి పరమేశ్వరి పాల్గొని మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా విపరీతంగా పెరిగిపోయిందని ఈ ఫీజులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని అన్నారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని, ఫీజుల విషయంలో ద్వంద వైఖరి అవలంబిస్తోందని అన్నారు, కార్పొరేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజుల విషయమై ఎన్నిసార్లు పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందని విద్యార్థులను ప్రజలను రైతులను పట్టించుకోవడం పూర్తిగా విఫలమైందని అన్నారు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉపయోగపడే విధంగా జీవోలు విడుదల చేసి పూర్తిస్థాయిలో కార్పొరేట్ వ్యవస్థకు లాభంచేకూర్చేవిధంగా ఈనాడు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. కరోనా కారణంగా సంవత్సరం నుంచి పాఠశాలల్లో మూతబడితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది, ఫీజులు చెల్లించకుంటే అడ్మిషన్ రద్దు పేరుతో సర్టిఫికెట్ల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూ మరి ఫీజులు గుంజుతున్న పరిస్థితి కార్పొరేట్ విద్యాసంస్థలలో నెలకొన్నది, మరి ఇంత  విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల మాఫియా కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడకుండా కార్పొరేట్ వ్యవస్థకు మద్దతు పలుకుతూ ప్రజా వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసే విధంగా ఈనాడు కెసిఆర్ ప్రభుత్వం పూనుకుంటుంది. ప్రతి ఒక్క పేద మధ్య తరగతి విద్యార్థికి 50 శాతం ఫీజును ప్రభుత్వమే భరించాలని ఎస్ఎఫ్ఐ గా  ప్రభుత్వాన్ని కోరుతున్నాము, విద్యా సంస్థలలో  పుస్తకాల దందా విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదు, ఈ పుస్తకాల దందా విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రతి ఒక్క విద్యా సంస్థను  తనిఖీ చేసి ఇష్టానుసారంగా అధిక రేటుకు పుస్తకాలు అమ్ముతున్న విద్యాసంస్థలను రద్దు చేయాలని అదేవిధంగా అధిక ఫీజుల పేరుతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పై వెంటనే చర్యలు తీసుకోవాలని జీవో 46 ను అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ గా కోరుతున్నాము ఫీజుల విషయంలో ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  భవిష్యత్తులో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ప్రభుత్వ వ్యతిరేక  ప్రజా విద్యార్థి ఉద్యమాలను చేపడతామని అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల మాఫియాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి ఎం చంద్రకాంత్ ,పరమేశ్వరి ,నాయకులు గణేష్ ,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

సామాన్యుడికి మ‌రిన్ని క‌ష్టాలు..

పాల ధ‌ర‌లూ భారీగా పెంచాల‌ని నిర్ణ‌యం

 ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్వంటగ్యాస్, ఉల్లి ధరల పెంపు

మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరుగుద‌ల‌

మార్చి 1 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం

దేశ వ్యాప్తంగా ప్ర‌భావం

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

 సామాన్యుడి మీద పాల ధ‌ర‌ల పెరుగుద‌ల రూపంలో మ‌రో పిడుగు ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, ఉల్లి ధరల‌తో పాటు ప‌లు వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్యులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని రాట్లం సిటీలో పాల ధరల పెరగనున్న నేపథ్యంలో దాని ప్ర‌భావంతో  దేశంలో కూడా  పాల ధరలు భారీగా పెర‌గ‌నున్నాయి. జాతీయ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం..  రాట్లంలో పాల ధరలు పెంచాల‌ని అక్క‌డి ప‌లు సంఘాలు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ నెల 23న ఆయా సంఘాలు స‌మావేశం నిర్వహించి పాలు లీటరుపై రూ.12 పెంచాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు అధికారుల అనుమతితో వ‌చ్చేనెల 1 నుంచే ఈ ధరల‌ పెంపును అమలు చేయనున్నారు. ఇప్ప‌టికే అధికంగా ఉన్న పాల దొర కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తే లీటరుకు రూ .55కు చేర‌నుంది.  ప్రస్తుతం లీటర్ పాల ధర రూ.43గా ఉంది. నిజానికి గత ఏడాదిలోనే పాల ధరలు పెంచాల‌ని ఉత్పత్తిదారులు డిమాండ్ చేసిన‌ప్ప‌టికీ, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వారి నిర్ణ‌యం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ర‌వాణాకూ అధిక ఖ‌ర్చు అవుతోంది. దీంతో పాల‌ ధరలను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు అక్క‌డి ఉత్పత్తిదారుల అసోసియేషన్ ప్ర‌క‌టించింది.

సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 సరిహద్దు సమస్యల పరిష్కారానికి హాట్​ లైన్​ - భారత్​ కు చైనా ప్రతిపాదన

 దాని ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగిద్దామని సూచన

బలగాల ఉపసంహరణపై సంతృప్తి వ్యక్తం చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ

మాస్కో ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్

హింస ద్వారా శాంతికి భంగం కలిగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక

చైనా దుందుడుకు వైఖరితోనే రెండు దేశాల బంధాలు దెబ్బతిన్నాయని స్పష్టీకరణ

75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్న ఇరు దేశాల మంత్రులు

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

తూర్పు లడఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలి ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చైనాకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లోనూ ఇరుపక్షాలూ బలగాలను తగ్గించుకోవాలని, శాంతి సామరస్యాల పునరుద్ధరణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ.. సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ఓ హాట్ లైన్ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. గురువారం రెండు దేశాల విదేశాంగ మంత్రులు దాదాపు 75 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. చర్చలకు సంబంధించిన వివరాలను శుక్రవారం విదేశాంగ శాఖ వెల్లడించింది.మాస్కో ఒప్పందానికి కట్టుబడాలి : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ సదస్సు సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ లో ఇరు దేశాల మధ్య కుదిరిన (మాస్కో) ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందిగా చైనాకు జైశంకర్ తేల్చి చెప్పారు. సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు వైఖరి వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సరిహద్దు సమస్య తీరేందుకు సమయం పట్టొచ్చని, కానీ, దాని కోసం హింస ద్వారా శాంతి సామరస్యాలను పాడు చేస్తే ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకోవాలన్న మాస్కో ఒప్పందాన్ని ఆయన గుర్తు చేశారు. చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని సూచించారు. కాగా, ప్రస్తుతం బలగాల ఉపసంహరణపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి సామరస్య పునరుద్ధరణలో ఇది ముఖ్యమైన అడుగు అని ఆయన చెప్పారు. ప్రస్తుత ఫలితాలను ఇరుపక్షాలూ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దు నిర్వహణ, నియంత్రణను మరింత మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు. అప్పట్లో భారత్ మూడు పరస్పర సహకార సూత్రాలను ప్రతిపాదించిందని గుర్తు చేశారు. పరస్పర గౌరవం, పరస్సర ప్రయోజనాలు, పరస్పర సున్నితాంశాలకు రెండు దేశాలూ కట్టుబడాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని, సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు చర్చల కోసం ఓ ‘హాట్ లైన్’ను ఏర్పాటు చేసుకుందామని చెప్పారు.


గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

గర్భిణిని దహనం చేసిన బూడిదలోని నగల అవశేషాలను దొంగిలించటానికి ప్రయత్నించి నలుగురు అడ్డంగా బుక్కయ్యారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగావెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోలాపూర్‌ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్‌ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మరణించిన ఓ గర్భిణి అంత్యక్రియలు బంగారు నగలు మృతదేహంపై ఉంచి చేస్తారని వారికి తెలిసింది.  గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు నిశ్చయించుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతకుతూ.. గ్రామస్తుల కంట బడ్డారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



జర్నలిస్ట్​ ఖషోగీ హత్యలో సౌదీ యువరాజు హస్తం: అమెరికా నిఘా నివేదిక!

 జర్నలిస్ట్​ ఖషోగీ హత్యలో సౌదీ యువరాజు హస్తం: అమెరికా నిఘా నివేదిక!

నేడు ఆ నివేదికను విడుదల చేయనున్న అమెరికా

సీఐఏ, ఇతర నిఘా సంస్థల సమాచారం ఆధారంగా రిపోర్ట్

ఖషోగిని చంపిన వారిపై వేరే మార్గాల్లో చర్యలు తీసుకుంటామన్న విదేశాంగ శాఖ

సౌదీపై ఆంక్షలు, ఆయుధ విక్రయాల నిషేధంపై యోచిస్తున్నామని వెల్లడి

 న్యూస్ డెస్క్ , పెన్ పవర్ 

సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్యలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందా? అంటే అవుననే అంటోంది అమెరికా నిఘా నివేదిక. సల్మాన్ సూచనల మేరకే ఖషోగిని హత్య చేశారని నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఆ నివేదికను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 2018 అక్టోబర్ లో ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ లో ఖషోగి హత్య జరిగింది. అప్పటి నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇతర నిఘా సంస్థల సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్టు చెబుతున్నారు. హత్యకు సౌదీ యువరాజు సల్మాన్ పాత్ర ఎంతమేరకుంది? ఆయన ఎలా సహకరించారు? వంటి వివరాలను మాత్రం వాళ్లు వెల్లడించలేదు. అయితే, నివేదికపై స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ నిరాకరించారు. హత్యలకు కారకులైన వారిని శిక్షించేందుకు వేరే మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామన్నారు. సౌదీకి ఆయుధ విక్రయాలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటి చర్యలపై ఆలోచిస్తున్నామన్నారు. జవాబుదారీతనానికి పారదర్శకతే ముఖ్యమని, అయితే, వారికి ఆ జవాబుదారీతనం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత నివేదిక విడుదల కాకుండా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపారన్నారు.హత్యపై అప్పట్లో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో విమర్శలు వచ్చాయి. సల్మాన్ పాత్ర ఉందన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అయితే, హత్యతో తనకే సంబంధమూ లేదని సల్మాన్ చెబుతూ వచ్చారు. అయితే, దేశ యువరాజుగా ఖషోగి హత్యకు బాధ్యత వహిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం హత్య కేసులో అరెస్టైన నిందితులపై విచారణ జరుగుతోంది. కాగా, నివేదిక విడుదలకు ముందే గురువారం సల్మాన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, యెమన్ లో యుద్ధాన్ని ఆపడంలో ప్రయత్నాలు, మానవ హక్కులు, శాంతి భద్రతలు కాపాడడం వంటి విషయాలపై చర్చించారు.



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...