ఎటపాక, పెన్ పవర్ ప్రతినిధి : వెంకటేశ్వర్లు
Followers
మానవత్వం చాటిన ఎటపాక విలేకరి రంబాల కార్తీక్
ఎటపాక, పెన్ పవర్ ప్రతినిధి : వెంకటేశ్వర్లు
రెడ్ జోన్ ప్రాంతాలలో చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు సిబ్బంది తనిఖీలు
అన్నదాత స్వచ్ఛంద సేవ
కరోనా నియంత్రణకు పటిష్టంగా నిఘా ఏర్పాట్లు
కరోనా నియంత్రణకు పటిష్టంగా నిఘా ఏర్పాట్లు
ఉద్యాన పంటల మార్కెటింగుకు ఇబ్బందులు లేకుండా చూడాలి
పరిశ్రమలు తెరవడంపై ఆయా యాజమాన్యాలతో చర్చించాలి : మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలతో సర్వే జరిపిస్తున్నామని వారి సర్వేలో వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన వారందరికీ రాపిడ్ టెస్ట్ కిట్లతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యాన పంటలు అరటి, మామిడి ఎగుమతులు, మార్కెటింగ్ కు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నిరోధించడం, లాక్ డౌన్ సడలింపులు, వ్యవసాయ ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం తదితర అంశాలపై మంత్రి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కరోనా కేసులు వున్నా లేకున్నా ఈ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం సిద్దం చేసిన ఆసుపత్రులను పూర్తీ సన్నద్ధంగా ఉంచాలన్నారు.
జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మంత్రికి వివరించారు. ఏప్రిల్ 20 నుండి కేంద్రం గ్రీన్ జోన్ లోని పరిశ్రమలను తెరిచే అంశంపై మంత్రి సమీక్షించారు. పూసపాటి రేగ ప్రాంతంలో వున్న ఔషధ తయారీ పరిశ్రమలను తెరిచే అంశంపై పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించాలని కలెక్టర్ కు సూచించారు. పైడి భీమవరం ప్రాంత పరిశ్రమల్లోకి ఈ జిల్లా నుండి ఉద్యోగుల హాజరు విషయమై అక్కడి కలెక్టర్ తోనూ మాట్లాడాలని సూచించారు. పరిశ్రమలకు విశాఖ నుండి వచ్చే ఉద్యోగుల విషయాన్ని రాష్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. రైతుల అవసరాలకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలు తెరచి ఉంటాయనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో మొక్క జొన్న కేంద్రాలకు సంబంధించి 30 కేంద్రాలు తెరచి ఉంచామని ఈ కేంద్రాల ద్వారా 13 వేల టన్నులు కొనుగోలు చేసామని జాయింట్ కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ఉచిత పంపిణీకి ఉద్దేశించిన మాస్కుల తయారీ విషయమై డి.ఆర్.డి.ఏ., మెప్మా సంస్థల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ నెల 24న గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు వడ్డీలేని రుణాలు అందించడానికి ఈ నెల 24 న ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ.35 కోట్లు స్వయంసక్తి మహిళలకు అందజేయనున్నట్లు డి.ఆర్.డి.ఏ. అధికారులు వివిరించారు.
సమావేశంలో శాసన సబ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, వై.సి.పి.నాయకులు మజ్జి శ్రీనివాస రావు, ట్రైనీ కలెక్టర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్-2 ఆర్.కుర్మనాథ్, డి.ఆర్.ఓ. వెంకట రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లాక్డౌన్ కొనసాగుతుంది
లాక్డౌన్ కొనసాగుతుంది
సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్కు అనుమతి లేదు
సభలు, సమావేశాలు, మతసంబంధమైన వేడుకలు నిషిద్దం
వైద్య, వ్యవసాయ రంగాలకు పూర్తిగా వెసులుబాటు
కొన్నిరకాల చేతివృత్తిదారులకు అనుమతులు
స్వగ్రామాల్లోనే ఉపాధి పనులు
గ్రామాల్లో భవన నిర్మాణ పనులకు పచ్చజెండా
జిల్లాలో ప్రవేశించే డ్రైవర్లకు వైద్య పరీక్షలు
అన్నిటా భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరం
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్
విజయనగరం, పెన్ పవర్ ప్రతినిధి : డేవిడ్ రాజ్
కోవిడ్-19 నివారణకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటివరకూ జిల్లా సురక్షితంగా ఉందని, అయినప్పటికీ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గ్రీన్ జోన్లో ఉన్న కారణంగా కొన్ని కార్యకలాపాలకు పూర్తిగా, మరికొన్నిటికి షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో జీఓ 239పై చర్చించి, కొన్ని రంగాలకు లాక్డౌన్లో వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించినప్పటికీ, ప్రతీచోటా భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, పనిచేసే చోట చేతులు కడుగుకొనేందుకు నీళ్లు, సబ్బు లేదా శానిటైజర్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొన్ని రకాల పరిశ్రమలకు దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతినిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రవేశించే డ్రైవర్లకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరమని చెప్పారు. మద్యం, గుట్కాల విక్రయం చట్టప్రకారం నేరమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతింపబడిన వారి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని జిల్లా ఎస్పి బి.రాజకుమారిని కోరారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణా చట్టం-2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనుమతులు లేనివి ః
రైళ్లు, బస్సులు, ప్రజా రవాణా, అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల రాకపోకలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కార్యక్రమాలు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, సభలు, సమావేశాలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, మత సంబంధ కార్యక్రమాలు నిషిద్దం.
అనుమతించబడినవి ః
ఆయుష్తో సహా అన్ని రకాల ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్లు, టెలి మెడిసిన్ కేంద్రాలు, మందుల షాపులు, లేబ్స్, కలెక్షన్ సెంటర్స్, ఫార్మసి సెంటర్లు, వైద్య పరిశోధనా కేంద్రాలు, పశువుల ఆసుపత్రులు, క్లీనిక్లు, పేథాలజీ లేబ్స్, మందుల తయారీశాలలు, వైద్య పరికరాలు విక్రయించే షాపులు, తయారీ కేంద్రాలు, 108 అంబులెన్స్ తయారీ కేంద్రాలు, ఆరోగ్య సేవా కేంద్రాలు, అత్యవసర సేవలందించే సంస్థలు.
వ్యవసాయ, ఉద్యాన పంటలు మరియు అనుబంధ కార్యకలాపాలు, వ్యవసాయ పనులు, రైతులు, రైతు కూలీల పనులు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కార్యకలాపాలు, మండీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలు, వ్యవసాయ పరికరాల మరమ్మతు, విక్రయించే షాపులు, విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ఉత్పత్తి, విక్రయ కేంద్రాలు, వ్యవసాయ యంత్రాలు తరలింపు. ప్లాంటేషన్ పనులు. 50శాతం కార్మికులతో జీడి పరిశ్రమల్లో ప్రాసెసింగ్, ఉత్పత్తి కి అనుమతి. పిఎసిఎస్ లు, మార్కెట్ కమిటీలు. ఆక్వా పరిశ్రమలు, ఫీడింగ్ తయారీ యూనిట్లు, విక్రయి కేంద్రాలు, హార్వెస్టింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, విక్రయశాలలు, కోల్డ్ స్టోరేజీలు, హేచరీలు, మత్స్య ఉత్పత్తుల తరలింపు. పాలు, పాల ఉత్పత్తులకు సంబంధించి రవాణా, సేకరణ, సరఫరా. పౌల్ట్రీ ఫారాలు, హేచరీలు, లైవ్స్టాక్ ఫార్మింగ్లకు అనుమతి. పశు దానా ఉత్పత్తి, రవాణా, విక్రయ కేంద్రాలు. గోశాలల నిర్వహణ. సాధారణ పనివేళల్లో బ్యాంకులు, ఎటిఎంలు, ఐటి వెండార్స్, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, ఎటిఎం కేష్ ఆపరేషన్స్ ఏజెన్సీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ కార్యకలాపాలు. బాలల సంరక్షణా కేంద్రాలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, అనాధలు, వితంతువులు, మహిళల సంరక్షణా కేంద్రాలు, జువైనల్ హోమ్స్. ఆన్లైన్ టీచింగ్ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు. భౌతిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ఉపాధిహామీ పనులు. ఏ గ్రామంలో వారికి ఆ గ్రామంలోనే పనులు నిర్వహణ. నీటి పరిరక్షణ, చిన్ననీటి పారుదలకు సంబంధించిన పనులు. పనులు జరిగే చోట చేతులు కడుగుకొనేందుకు ఏర్పాట్లు, వ్యక్తుల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించేలా జాగ్రత్తలు.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి పంపిణీ, రవాణా. విద్యుత్ సరఫరా మరియు ఉత్పత్తి.
పోస్టు ఆఫీసులు, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సెంటర్లు. రక్షణా సంస్థలు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎఫ్సిఐ, నెహ్రూ యువ కేంద్రాలు.
నీటి సరఫరా, పారిశుద్యం, చెత్త నిర్వహణ సంస్థలు, వ్యక్తులు, సిబ్బంది.
నిత్యావసరాలు, కూరగాయలు ఉత్పత్తి, రవాణా, విక్రయం, సరఫరా వాహనాలు, సిబ్బంది.
స్థానిక పనివారితో జాతీయ రహదారి నిర్మాణ, నిర్వహణ పనులు. నిబంధనలు పాటిస్తూ రైల్వే నిర్వహణా పనులు.
అనుమతించబడిన వ్యక్తులు, వృత్తిదారులు ః అన్ని రకాల వైద్య సిబ్బంది, సైటింటిస్టులు, పశువైద్యులు, నర్సులు, పేరా మెడికల్ సిబ్బంది, లేబ్ టెక్నీషియన్లు, అంబులెన్స్ సిబ్బంది, ఇతర ఆసుపత్రి సేవలు నిర్వహిస్తున్న సిబ్బంది. అనుమతి పొందిన ఇతర సంస్థల సిబ్బంది. బోరు మెకానిక్లు, మోటార్ మెకానిక్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు తదితర వృత్తిదారులు(ఐడి కార్డు తప్పనిసరి)
ఏపిటిఎఫ్ ఆద్వర్యంలో ఆహార పొట్లాలు సరఫరా
ఏపిటిఎఫ్ ఆద్వర్యంలో ఆహార పొట్లాలను సరఫరా
మాకవరపాలెం, పెన్ పవర్ ప్రతినిధి గోవింద్
కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసు, ఆరోగ్యశాఖకు అభినందన మాకవరపాలెం కరోనా నివారణకు కృషి చేస్తున్న పోలీసుశాఖ, ఆరోగ్యశాఖకు అభినందనలు తెలియజేస్తూ మాకవరపాలం ఏపిటిఎఫ్ మండలశాఖ ఆహార పొట్లాలను సరఫరా చేశారు. ఈ సందర్భంగా మండలశాఖ సెక్రటరీ సిహెచ్.చక్రవర్తి మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుశాఖ, ఆరోగ్యశాఖ వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిఆర్ఎస్ఎన్.రాజు, ఎం.శేషగిరిరావు, కె.సత్యారావు, పి.ఆదినారాయణ, ఆర్ వి.దొర, పి.రంగరాజు, వరహాలబాబు, రమేష్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కరోనా 4వ విడత ఇంటింటా సర్వే నూరుశాతం నిబద్ధతతో చేపట్టాలి
కరోనా 4వ విడత ఇంటింటా సర్వే నూరుశాతం నిబద్ధతతో చేపట్టాలి -జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన
విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్ , పెన్ పవర్ ప్రతినిధి సతీష్ కుమార్
కరోనా వ్యాప్తి నియంత్రణ చేయు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అనుగుణంగా 4వ విడత ఇంటింటా సర్వే జిల్లాలో నిబద్దతో నూరుశాతం పూర్తి చేయాలని జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లాలోగల మండల పరిషత్ అభివృద్ధి అధికారులతోను, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, ప్రత్యేకాధికారులతో మాట్లాడారు. జిల్లాలోగల గ్రామీణ ప్రాంతాలోను మున్సిపల్ ప్రాంతాలలోను కరొనా లక్షణాలు వెలికితీయు నిమిత్తం 4వ విడత ఇంటింటా సర్వే నిర్వహించాలని, ఇందులో అందరు వ్యక్తులను ముఖ్యంగా, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, వైద్యులు పాలనా విభాగంలో పనిచేస్తున్న వార్డు / గ్రామీణ కార్యదర్శులు, గ్రామ/వార్డు వాలంటీర్లు పారిశుద్ధ్య కార్మికులను ప్రాధాన్యం ఇచ్చి సర్వే కాలంలో ప్రభుత్వ నియమ సబంధనలకు అనుగుణంగా కరోనా శాంపిల్స్ తీసి సంబంధిత ఆసుపత్రులకు పంపించాలని ఆదేశించారు. 4వ విడతలో జరుగుచున్న సర్వేలో ఎట్టి పరిస్థితులలో ఏ గృహాములు విడవకుండా, గ్రామీణ ప్రాంతంలో ఎం.పి.డి.ఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు/ జోనల్ కమిషనర్లు శ్రద్ధవహించాలని కోరారు. గ్రామ ప్రాంతాల్లో జరుగుచున్న సర్వేపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారి దృష్టి సారించాలని, జివిఎంసి పరిధిలో అదనపుకమిషనర్, ముఖ్యవైద్యఆరోగ్యాధికారి, జోనల్ కమిషనర్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు. నర్సీపట్నం, యలమంచిలి మున్సిపల్ కమిషనర్లు వారి ప్రాంతాల్లో బాధ్యతతో సర్వే నిర్వహించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలోని అధికారులకు సాంకేతిక సహాయ సహకారములు కావలసి వచ్చినచో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారిని సంప్రదించవలసినదిగా కోరారు. వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో, పాడేరు సబ్ కలెక్టరు వేంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి నాగార్జునసాగర్, జిల్లా పంచాయతీ అధికారి గోవిందరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు, జివిఎంసి అదనపు కమిషనర్ సోమన్నారాయణ, చీఫ్ మెడికల్ ఆపీసర్ డా.కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఎంపిడిఓలు, జోనల్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, పి. హెచ్.సి వైద్యులు, జివిఎంసి జోనల్/ వార్డు ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...