Followers

పునరావస కేంద్రాల్లో నిరాశ్రయులకు, ఆహార పదార్ధములు పంపిణీ

 



 


 


 


 


 


 జివిఎంసి కమిషనరు విన్నపానికి స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు , పునరావస కేంద్రాల్లో నిరాశ్రయులకు, ఆహార పదార్ధములు పంపిణీ చేపట్టిన దాతలు


 


విశాఖపట్నం/ పూర్ణా మార్కెట్ , పెన్ పవర్ ప్రతినిధి సతీష్ కుమార్ 


జివిఎంసి పరిధిలో కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు చేపట్టిన ప్రభుత్వాదేశాలు ప్రకారం లాక్ డౌన్ కార్యక్రమం అమలవుచున్నది. లాక్ డౌన్ కాలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పునారావాస కేంద్రాల్లో గల నిర్వాసితులకు తగు సహాయ సహకారాలు అందించాలని కమిషనర్ గారు పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని కార్పోరేషన్ పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు నగరంలో ప్రముఖ సంస్థల యాజమాన్యాలను, ముఖ్య వ్యక్తులను సంప్రదించి, పునారావాస కేంద్రాలలోని నిర్వాసితులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహారం అందించాలని విన్నవించారు. కమిషనర్‌ గారు ఇచ్చిన పిలుపుమేరకు స్వచ్చభారత్ అంబాసిడర్లు అయిన ఓ.నరేష్ కుమార్ గారు మరియు కాశీ విశ్వనాధరాజుగారు కలసి నగరంలో గల సుమారు 5700 మంది పారిశుధ్య కార్మికులకు భోజన సదుపాయాలు అందించడానికి అంగీకరించారు మరియు పునరావాస కేంద్రాలలో గల సుమారు 2000 మంది నిర్వాసితులకు దైనందిన జీవనంలో వాడుకొనే సబ్బు, పేస్టు, బ్రష్ మొదలగు వస్తువులుగల కిట్ ను ఒక్కొక్కరికి అందించడానికి ముందుకు వచ్చి 2000 కిట్లను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకు ఆయన ఛాంబర్ లో అందించారు. మరియు వారి ఆధ్వర్యంలో ప్రస్తుతం నగరంలోగల పునారావాస కేంద్రాలలో ప్రతి రోజు సుమారు 1900 మంది వరకు భోజనసదుపాయాలు అందిస్తున్నారు. నరేష్ కుమార్ మరియు కాశీ విశ్వనాధ్ రాజు గార్లు చేస్తున్న ఇటువంటి మంచి సామాజిక కార్యక్రమాలకు కమిషనర్ గారు వారివురికి కృతజ్ఞతలును పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు.


లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీని సందర్శించిన విజయ సాయిరెడ్డి


 


లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీని సందర్శించిన విజయ సాయిరెడ్డి


          పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ లోని లారస్ ల్యాబ్ ఫార్మా కంపెనీ ని సందర్శించిన వైఎస్ ఆర్ సిపి అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి. సోమవారం నాడు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తో పాటు మంత్రి అవoతి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి,పెదుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధీప్ రాజు లతో కలిసి లారస్ కంపెనీ ని సందర్శిచారు.అనంతరం విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ కరోనా నియత్రణకు లారస్ ల్యాబ్ చేస్తున్న కృషికి అభినందించారు.కరోనా నియంత్రణలో భాగంగా లారస్ ల్యాబ్ యాజమాన్యం సామాజిక బాధ్యతతో    ముఖ్యమంత్రి సహాయనిధికి,జిల్లా కలెక్టర్ సహాయనిధికి,సీపీ సహాయనిధికి కంపెనీ ప్రతినిధి నరిసింహారావు విరాళాలు ఇచ్చారు అని ప్రశంసించారు.అంతే కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి స్వీయ నిర్బంధ వలన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను అదుకోవాలి అని ఇచ్చిన పిలుపు మేరకు లారస్ కంపెనీ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలలోని 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు అని అన్నారు.ఫార్మా సిటీలో ఉన్న మిగతా కంపెల వాళ్లు కూడా లారస్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వచ్చి సామాజిక భాద్యతలో పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు.అనంతరం లారస్ ల్యాబ్ తరుపున చావా నరసింహరావు జివిఎంసి పారిశుధ్య కార్మికుల సహాయార్ధం కమిషనర్ పేరుతో 10 లక్షల చెక్ ను విజయ సాయిరెడ్డి కి అందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, జిల్లా వైసిపి కార్యదర్శి చుక్క రామునాయుడు,వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు,కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

టిడిపి అధినేత చంద్రబాబు 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని కూరగాయలను పంపిణీ చేసిన రౌతు


 


 


 


టిడిపి అధినేత చంద్రబాబు జన్మదినo


 సందర్భంగా కూరగాయలను పంపిణీ చేసిన రౌతు

 

            పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినo సందర్భంగా దేశపాత్రుని పాలెం లో కూరగాయలను పంపిణీ చేసిన రౌతు శ్రీనివాస్.సోమవారం నాడు దేశపాత్రుని పాలెం పరిధిలోని అశోక్ నగర్,ఆదిత్య నగర్,ఉప్పర కాలనీ,ఎస్సి కాలనీ ల లో ఉన్న కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దేశపాత్రుని పాలెం తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

కుళాయికి కాoక్రీట్ ఫ్లాట్ ఫారం నిర్మాణం


 




బోoకుల దిబ్భ యూత్ సహకారంతో కుళాయికి కాoక్రీట్ ఫ్లాట్ ఫారం నిర్మాణం


 

             పరవాడ, పెన్ పవర్ ప్రతినిధి చింతమనేని అనిల్ కుమార్ 

 

పరవాడ మండలం:బోoకుల దిబ్భ వీధిలో ఉన్న నీటి కుళాయికి కాంక్రీట్ తో నిర్మించిన ప్లాట్ ఫారం లేనందున మహిళలకు నీరు పట్టుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు అని గమనించిన బొంకుల దిబ్భ యూత్ సభ్యులు వారి వ్యక్తిగత నిధులతో కుళాయికి కాంక్రీట్ ఫ్లాట్ ఫారాన్ని నిర్మాణం చేసి సోమవారం నాడు సీఈసీ సభ్యుడు పయిల శ్రీనివాసరావు చేత ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు శిరిపురపు అప్పలనాయుడు,పి.ఎమ్.సి చైర్మన్ పయిల హరీష్,పయిల నరేష్,లాలం సన్యాసి నాయుడు,గెడ్డం రమణ,రెడ్డి రామారావు,లాలం రవీంద్ర,పయిల ఉమ మరియ యూత్ సభ్యులు పాల్గొన్నారు.


 

 



 

తప్పెవరిది..


 


 


 


 


తప్పెవరిది..


 


చోడవరంలో మద్యం అక్రమ అమ్మకాల కేసులో ట్విస్టు పై అధికారుల తప్పిదమేనంటూ ఫిర్యాదులు 


 


చోడవరం, పెన్ పవర్  ప్రతినిధి మజ్జి శ్రీనివాస మూర్తి 


 


  చోడవరం మద్యం అక్రమ అమ్మకాల కేసులో నిందితులెవరన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిందస్థాయి సిబ్బంది ముగ్గురూ కలిసి అక్రమ విక్రయాలకు పాల్పడ్డారని స్వయంగా ఎక్సైజ్ పోలీసులే తెలిపారు కానీ తమకేమీ తెలియదని, బలవంతంగా తమను లాగుతున్నారంటూ నిందుతులుగా పేర్కొంటున్నవారు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. ఫిర్యాదుదారులు చెప్పిన వివరాల ప్రకారం.. చోడవరం పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ముఖద్వారం ఎదురుగా ఉన్న మద్యం షాపులో మద్యం అక్రమ అమ్మకాలు జరిగాయని, ఈ కేసులో సూపర్‌వైజర్ బి.కరుణ, సేల్స్ మేన్ మజ్జినాగేంద్రకుమార్, అల్లాడి శివకృష్ణలను నిందితులుగా పేర్కొంటూ.. వారి నుంచి 7.76 లక్షలు రికవరీ చేసినట్టుగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. అయితే ఇది వాస్తవం కాదంటూ మజ్జి నాగేంద్రకుమార్ పోలీస్ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా తెలిపారు. అంతేకాదు.. ఆ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాము 2020 మార్చి 21 తేదీన ఎప్పటిలాగే షాపులో పని చేసి దుకాణం మూసివేసిన ఇంటికెళ్లిపోయామని తెలిపారు. మార్చి 22న జనతా ఖర్వ్యూ సందర్భంగా సెలవని, ఆ తర్వాత రోజు నుంచి వరుసగా లాక్ డౌన్ జరుగుతున్న విషయం తెలిసిందేనని పేర్కొన్నారు. కానీ ఏప్రిల్ 24న సూపర్‌వైజర్ రమ్మని ఫోన్ చేస్తే వెళ్లామని, వెళ్లిన తర్వాత అప్పటికే 7 లక్షల రూపాయల పైచిలుకు స్టాకు తక్కువగా ఉన్నట్లు తెలిపారన్నారు. ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్న తమను ఎక్సైజ్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఏఈఎస్ లాఠీలతో దారుణాతి దారుణంగా చితకబాదారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంత నగదు వాడుకున్నట్టుగా తెల్లకాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వరకూ నిర్బంధించి.. నానా దుర్భాషలాడుతూ.. ఇష్టమొచ్చినొట్టు కొట్టడంతో ప్రాణభయం, దెబ్బలను తట్టుకోలేక వారు పెట్టమన్నచోట సంతకాలు చేసి ఇచ్చాను తప్ప.. తామెలాంటి నగదు వాడుకోలేదని వాపోయారు. తాము ఏది చెబితే అది చేస్తే మీకే మంచిదని.. లేదంటే గంజాయి, నాటు సారా లాంటి మీకు సంబంధం లేని కేసులను రుద్దతామని హెచ్చరించారంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత రోజు నా చేతికి రూ.80 వేలు ఇచ్చి స్టేట్ బేవరేజ్ అకౌంట్ కు డిపాజిట్ చేయించారని వివరించారు. ఎక్సైజ్ సీఐపై ఆరోపణలు ఈ కేసులో ఎక్సైజ్ సీఐపై ప్రధానంగా ఆరోపణలున్నట్టుగా నాగేంద్రకుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి నెలా ఐదో తేదీన సీఐ వచ్చి ఆడిట్ ను తనికీ చేయాల్సి ఉందని, కానీ ఆరు నెలలుగా సీఐ వచ్చి తనికీ చేసింది లేదన్నారు. అందుకు సంబంధించిన రిజిస్టర్‌ను సీఐ కార్యాలయానికి సూపర్వైజర్ కార్యాలయానికి తీసుకెళ్తే ఆ ఆడిట్ ఫైలుపై సంతకం మాత్రమే చేసేవారని ఆరోపించారు. అలాగే మార్చి 5 వరకూ ఆడిట్ సరిపోయిందని సీఐ సంతకం చేశారని, కానీ 16 రోజుల వ్యవధిలో ఏడు లక్షల పైబడి నగదు ఎలా తేడా వచ్చిందో పరిశీలించాలని నాగేంద్రకుమార్ పేర్కొన్నారు. దీనిపై సీఐ పైనే అనుమానాలున్నాయంటూ తెలిపారు.


ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం


 


ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

 

అందరి సహకారంతో కరోనాని జయిద్దాం 

 

పల్స్ స్ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి సామగ్రి పంపిణీ.

 

స్టాఫ్ రిపోర్టర్‌ మజ్జి శ్రీనివాస మూర్తి, విశాఖపట్నం, పెన్ పవర్

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యులు వి.. విజయసాయి రెడ్డి అన్నారు.. సోమవారం ఇక్కడ పల్స్ స్  కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సామాగ్రి అందచేసే కార్యక్రమంలో.విజయ్ సాయిరెడ్డి.. మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు చేతులు మీదుగా . పోలీసులు ..జీవీఎంసీ పారిశుధ్య  సిబ్బంది.. కార్మికులకు.... అవసరం ఐన సామగ్రి అందజేశారు.. సుమారు 5000 మంది కి సరిపోయే విధంగా కరోనా డ్రెస్స్ లు.. మాస్క్ లు... సానిటైజర్లు.. పేస్ మాస్క్ లు... ఎన్ 95 మాస్క్ లు..  భద్రతకు సంబంధించిన సామాగ్రి అంతా   వీరు  అందించారు.ఈ సందర్బంగా విజయ్ సాయి రెడ్డి ... మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రభుత్వం అన్ని  జాగ్రత్తలు తీసుకుంటు0దన్నారు ..కరోనా  పరీక్షలకు సంబంధించిన రాపిడ్ కిట్ లు కూడా  కూడా నగరానికి చేరుకున్నాయి అన్నారు.. ఈ విపత్కర సమయం లో కూడా పలు ... స్వచ్ఛంద సంస్థలు కొన్ని పరిశ్రమలు  అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా  నేపథ్యంలో అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమంలు  నిర్వహిస్తున్నారన్నారు.. ... మరోవైపు ప్రభుత్వం కూడా అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందన్నారు,... ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే,. కరోనా  అదుపులో ఉందన్నారు. విశాఖ ఎంపీ ఎంవివి  సత్యనారాయణ.. నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తదితరులు మాట్లాడుతూ పల్స్ స్ సంస్థ  సేవలను  అభినందించారు.... ఈ సమయం లో  స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున సామగ్రి అందజేయడం ప్రశంసనీయమన్నారు... పల్స్ స్  సీఈవో గేదెల శ్రీనుబాబు పర్యవేక్షణలో ఆ కంపెనీ డైరెక్టర్  గేదెల  శంకర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు సంభవించిన ప్రతీ సారి తాము అనేక  సామాజిక సేవలు అందించేందుకు ముందువరుసలో ఉంటామన్నారు... గతంలో కూడా అనేక సార్లు తమ కంపెనీ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఏ ఆధారం లేని పేదవారికి నిత్యవసరాలు వితరణ 


ఏ ఆధారం లేని పేదవారికి నిత్యవసరాలు వితరణ 

 

గాజువాక, పెన్ పవర్ ప్రతినిధి ఫీరోజ్ : 

 

గాజువాక 66 వార్డ్ వైఎస్.ఆర్.సి.పి అభ్యర్థి వార్డు అధ్యక్షుడు షౌకత్ అలి పలు సేవా కార్యక్రమంలో భాగంగా కరొన వ్యాధి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగినది ఈ నేపథ్యంలో ఎటువంటి ఆధారం లేకుండా తెల్లరేషన్ కార్డు కూడా లేని  వారు వార్డు అధ్యక్షుడైన షౌకత్ అలి దృష్టికి తీసుకు వెళ్ళడంతో వెంటనే స్పందించి వారికి నిత్యవసర వస్తువులను బియ్యం కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కుప్పిలి సత్యనారాయణ, వార్డు మైనార్టీ ప్రెసిడెంట్ ఫజులు రెహమాన్ ,అజయ్ కుమార్, మున్వర్ ఆస్సిం,మదినావలి,హస్సన్, ఆరీఫ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


 

 

 

 



 

 

 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...