Followers

కరోనాపై రావులపాలెం పోలీసులు విన్నూత్న ప్రచారం


 


 






ఇంట్లో ఉండండి దేశాన్ని కాపాడండి

 

కరోనాపై రావులపాలెం పోలీసులు విన్నూత్న ప్రచారం

 

రావులపాలెం, పెన్ పవర్ : కోణాల వెంకటరావు 

 

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణకు కేంద్రం పిలుపుమేరకు అన్ని వర్గాల ప్రజలు లాక్ డౌన్ పాటిస్తుండగా దీని అమలుకు పోలీసులు చేస్తున్న కృషి అందరి మన్ననలు పొందుతుంది. గత నెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కార్యక్రమాన్ని రావులపాలెం మండలంలో విజయవంతం చేసేందుకు స్థానిక పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి రహదారులపై తనిఖీలు నిర్వహిస్తూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రజలకు స్నేహపూర్వకంగా కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్ డౌన్ కార్యక్రమం అవసరాన్ని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్లో 16 వ, నెంబరు జాతీయ రహదారిపై అక్షర రూపంలో స్టే హోమ్ నినాదాలతో అవగాహన కల్పించారు. అంతేకాకుండా స్టే హోమ్.. సేవ్ ఇండియా.. ఇంట్లో ఉండండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదాలతో ఏర్పాటు చేసిన భారీ బెలూన్లు ఆకట్టుకుంటున్నాయి. సి.ఐ వి.కృష్ణ ఆదేశాలతో ఎస్సై పి.బుజ్జిబాబు, అదనపు ఎస్సై హరికోటి శాస్త్రి తదితరుల పర్యవేక్షణలో వీటిని రావులపాలెం సెంటర్లో ఉన్న భవనాలపై ఏర్పాటు చేశారు.



 

 




 

2 Attachments


పేదలకు కూరగాయల పంపిణీ


 


 


అనకాపల్లి, పెన్ పవర్ :  బోస్


 


అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయితీ లో గల బి ఆర్ టి కాలనీ లో కురకాయలు 600 కుటుంబాలకు పంచిపెట్టడం జరిగింది.వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన యల్లపు వెంకట రమేష్ మానవసేవ మాధవ సేవ అని వారం రోజులుగా పిసినికడ చుట్టు పక్కల ఉన్న గ్రామాలకు కూరగాయలు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టారు.ఇప్పుడు వరకు 3000 కుటుంబాలకు కూరగాయలు పంచిపెట్టారని ఇంకా సాధ్యమైనంత వరకు పేదలను ఆదుకుంటామని ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటించాలని మేమున్నము మీకు ఏమి ఇబ్బంది పడకండి అనే ధైర్యాన్ని పిసినికడ పంచాయితీ ప్రజలకు చెప్పారు


90ల లీటర్ల నాటు సారా తో ఇద్దరి అరెస్ట్. 


 






90ల లీటర్ల నాటు సారా తో ఇద్దరి అరెస్ట్.                   

 

 ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్ 

 

ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్ల పూడి గ్రామం నుండి ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి పుంతదారిలో మోటార్ సైకిల్ పై తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఏలేశ్వరం ఎస్ ఐ కె. సుధాకర్ వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద శంకర్ల పూడి కి చెందిన నెర్ల సురేష్, కాపారపు మురళి అనే యువకులు తమ హీరో హోండా మోటార్ సైకిల్ పై అనుమానాస్పదంగా గోనెసంచి తో రావడం గమనించి వారిని సోద చేశామన్నారు. గోనెసంచిలో పాలిథిన్ కవర్లతో కట్టి ఉన్న 9 సారా ప్యాకెట్లను వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు. ఆ ప్యాకెట్లలో 90 లీటర్ల వరకు నాటుసారా ఉన్నట్టు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న సారా తో పాటు నిందితులను ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపడుతున్నాం అని ఎస్ఐ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి ప్రతిపాడు కోర్టుకు తరలిస్తామని ఆయన అన్నారు.

 

 




 

Attachments area

 


 



 



 ప్రజా సేవలో జనసేన 100 సోల్జర్స్


 ప్రజా సేవలో జనసేన 100 సోల్జర్స్


 పెన్ పవర్, ఆత్రేయపురం : చిరంజీవి 


 


 


 


 కేంద్ర ప్రభుత్వం 21 రోజులు  లాకుడౌన్ విధించడంతో   ఇంటిలో నుండి ప్రజలు బయటకు వెళ్లరాదని ప్రభుత్వం చెప్పడం వలన ఎవరు బయటకు రాని పరిస్థితి లో మండలంలోని ర్యాలీ  గ్రామం వారికి జనసేన 100 సోల్జర్స్ . రెండు రోజులుగా  ప్రజలకు అందుబాటులోఉంటు, వారికి కావల్సిన  నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేసారు . అలాగే   ప్రజలుకు కరోనా గూర్చి అవగాహన కలిపిస్తూ మనుసుల  మధ్య దూరం పాటించాలని  చెపుతూనే  ఆదివారం  బీసీ .ఓ సి య సి  కాలనిలో  కూరగాయలు పంపిణీ చేశారు. జన సేన అనుబంధ సంస్థ అయిన 100 సోల్జర్స్ సంస్థ సభ్యులు కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా గ్రామ ప్రజలు బయటకి రాకుండా ఇంటింటికి 3 రోజులకు సరిపడ కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


ఏలేశ్వరం వశిష్ట బార్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు


 






ఏలేశ్వరం వశిష్ట బార్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు.   

 

          
 ఏలేశ్వరం, పెన్ పవర్ : మాధవ్ 

 

మండల కేంద్రమైన ఏలేశ్వరం నగర పంచాయతీలోని వశిష్ట బార్ అండ్ రెస్టారెంట్ ను ఎక్సైజ్ ప్రత్యేక అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిపిన దాడుల్లో ఎక్సైజ్ మొబైల్ పార్టీ సి ఐ జె.వి.భవాని (నీలపల్లిమొబైల్ పార్టీ 3&4), ప్రత్తిపాడు ఎస్సై లు ఎం రామ శేషయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రామ శేషయ్య మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో వైన్ షాప్ లను బార్లను గతంలో సీల్ చేశామన్నారు. అయితే సీల్ చేసినప్పటికీ, ఇప్పటికీ సరుకు ఉందో లేదో అని జిల్లా కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం సీల్ చేయబడి ఉన్న బార్లో లిక్కర్ 180 ఎం.యల్  253, బాటిల్స్ , 950 ఎం.యల్ 20 బాటిల్స్,650 ఎం.యల్ బీర్ బాటిల్స్ 271 ఉన్నాయన్నారు. సీల్ చేసే సమయానికి ఇప్పటికే ఉన్న స్టాక్ లో వ్యత్యాసం లేకపోవడంతో యధావిధిగా తిరిగి బార్ ను సీల్ చేయడం జరిగిందని  తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు బార్ ను ఎవరు తెరువ రాదని ఆదేశించారు. ఆమె వెంట ప్రత్తిపాడు ఎక్సైజ్ ఎస్ఐ లు ఎస్ వి ప్రకాష్ కుమార్,  సిబ్బంది ఉన్నారు.


 

 




 

 


 



 



దాతల సహకారంతో ఉచిత భోజన ఏర్పాట్లు


 





దాతల సహకారంతో ఉచిత భోజన ఏర్పాట్లు

 

రావులపాలెం, పెన్ పవర్ : కోణాల వెంకటరావు 

 

 

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో  నిరాశ్రయులు,నిరు పేదలు భోజనం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపద్యంలో వారి కష్టాలను గుర్తించిన మండలంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని మారుతీనగర్ యూత్ సభ్యులు ఉచితంగా భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు.  అంకితభావంతో విశేష సేవలందిస్తున్న పలువురు   అభయాంజనేయ స్వామి గుడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నార్తులను ఆదుకోవడంలో ముందు ఉంటున్నారు. మండలంలోని పెద్ద ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 16 రోజుల నుంచి దాతల సహకారంతో నిరుపేదలకు ఆహారం  ప్రతిరోజు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మావంతు సహకారాన్ని అందిస్తామని ఆదివారం దాతలు కర్రి అశోక్ రెడ్డి ఫ్రెండ్స్ , బోయిడి వెంకన్నబాబు ( బద్రి) కుటుంభ సభ్యులు ఆదివారం భోజన  ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెంకన్నబాబు  మాట్లాడుతూ రహదారి చెంతనే ఉండి భోజన వసతులు లేక ఇబ్బందులు పడే వారి కోసం ప్రతీ రోజు దాతల సహకారంతో  వంటకాలు సిద్ధం చేసి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అవసరం అయిన వారికి నగదు,బియ్యం,నిత్యావసరవస్తువులు  పంపిణీ  చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  ఆలయంలో బద్రి    కుటుంభ సభ్యులు పూజలు నిర్వహించారు.  ప్రతీరోజు అన్నదానం చేసే దాతలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కంబాల సూరిబాబు, సాధనాల శ్రీను, బోయిడి సతీష్,దాలిశెట్టి నాయనరావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


 

 



 

నూతిగూడెం గ్రామానికి అధికారులు చేయూత


నూతిగూడెం గ్రామానికి అధికారులు చేయూత


అనారోగ్యంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం.


వి ఆర్ పురం,  పెన్ పవర్ :  ముత్యాల సాయి బాబు 


 


ప్రపంచాన్ని వణికిస్తున్న కారోన వైరస్ నిర్ములనలో భాగంగా లాక్ డౌన్ విధించటంతో రోజువారీ పనులు చేసుకుని జీవించే కూలీలు ఇంటికి పరిమితం కావటంతో వారు పడుతూన్న ఇబ్బందులు గుర్తించి అధికారులు ఆగ్రామనికి నిత్యావసర వస్తువులు, 74 కుటుంబలకు అధికారుల సొంత ఖర్చుతో కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపినిచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతు      మృతి చెందిన సోడి వెంకటేష్ కుటుంబనికి నిత్యావసర వస్తువులు బియ్యం బట్టలు కొంత నగదు అందించారు.గ్రామస్తులు ఆ కుటుంబానికి సహకారం గా ఉండాలని చుచించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్, ఎన్ శ్రీధర్,యం పి డి ఓ శ్రీనివాస్ ,డా,,సుందర్ ప్రసాద్,నాగార్జున, వి ఆర్ పురం ఎస్సై వెంకట్, చంటి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...