కరోనా సహాయం గా కూరగాయలను పంపిణీ చేసిన
Followers
కూరగాయలను పంపిణీ చేసిన సహాయం స్వచ్ఛంద సంస్థ
అధికారులు ప్రజల్లో భయాందోళనలు దూరం చేయాలి
ప్రజలకు పోలీస్ హెచ్చరికలు
కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం
కరోనా కట్టడికి పూర్తి సన్నద్ధం
విశాఖ నుండి రక పోకల్ని కట్టుదిట్టం చేసాం
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్
బ్యూరో రిపోర్ట్ విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్
జిల్లాలో కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్ తెలిపారు . ఆదివారం ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా. జవహర్ రెడ్డి కరోనా ఏర్పాట్ల పై, ప్రస్తుత పరిస్థితుల పై జిల్లా కల్లెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి జిల్లా లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి అన్ని వసతులను ఏర్పాటు చేసి, వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 22 వెంటిలేటర్లను 66 ఐ.సి.యు, 959 నాన్ ఐ.సి.యు బెడ్స్ ను, సిద్ధం చేయడం జరిగిందన్నారు. 382 మంది వైద్యుల్ని, 1186 మంది నర్స్ లను,పారా మెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రబ్బుత్వ ఆసుపత్రులతో పాటు నాలుగు ప్రైవేటు ఆసుపత్రులను కూడా అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో 4507 బెడ్స్ కెపాసిటీ తో 32 క్వరెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జే.ఎన్.టి.యు లో ప్రస్తుతం 120 మంది క్వరెంటైన్ లో ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల నుండి నమూనాలను సేకరిస్తున్నామని, జిల్లా నుండి ఇప్పటి వరకు కరోనా పరీక్షల కోసం 306 నమూనాలు పంపగా 216 నెగటివ్ వచ్చాయని ఇంకను 90 పరీక్షల ఫలితం రావలసి ఉందని పేర్కొన్నారు. అయతే విశాఖపట్నం నుండి వ్యాధి నిర్ధారిత పరీక్షల ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయని, కాకినాడ పంపడానికి అవకాసం కల్పిస్తే త్వరగా ఫలితాలు వచ్చే వీలుంటుందని కలెక్టర్ కోరగా, విశాఖ పట్నంలోనే అదనపు వనరులను సమకూర్చడం ద్వారా త్వరగా వచ్చేలా చూడడం జరుగుతుందని డా.జవహర్ రెడ్డి గారు తెలిపారు.
విశాఖ నుండి వచ్చే రహదారులన్నీ మూసివేత :
విశాఖపట్నంలో పాజిటివ్ కేసు లున్నందున, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకుండా జిల్లా సరిహదుల్లో ఉన్న రహదారులన్నిటిని మూసి వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రధాన మార్గాల వద్దే కాకుండా లింక్ రోడ్ల వద్ద కూడా చెక్ పోస్ట్ లను పెట్టి నిఘా పెంచడం జరిగిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారుల అనుమతి తోనే ఎవరైనా కదిలేలా కట్టుదిట్ట మైన ఏర్పాట్లను చేశామన్నారు.
కరోనా నియంత్రణ సామాగ్రి సిద్ధం:
వైద్యుల కోసం 667 పి పి ఎక్విప్మెంట్ ను, 1600 ఎన్-95 మాస్క్లను, 31,425 గ్లోవ్స్ ను, 69 వేల సర్జికల్ మాస్క్ లను , 9 వేల లీటర్ల సానిటైసర్ తదితర సామగ్రిని సిద్ధంగా ఉంచమని, స్టాక్ రిజిస్టర్ ద్వార వినియోగించిన, వచ్చిన వాటి వివరాలను నమోదు చేయడం జరుగుతోందని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సహాయ కలెక్టర్ కేతన్ గార్గ్ , జే.సి-2 కుర్మనాద్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట రావు, జిల్లా వైద్య అధికారి డా. రమణ కుమారి, ఆసుపత్రుల సమన్వధికారి డా. నాగభూషణ రావు, సూపరింటెండెంట్ డా. సీతారామరాజు, తదితరులు పాల్గొన్నారు.
కరోనా పై పోరులో మేము సైతం
కరోనా పై పోరులో మేము సైతం..! స్వతంత్ర నగర్ (ఆర్.ఎస్.ఎ) యువకులు .....
మధురవాడ, పెన్ పవర్: సునీల్
మధురవాడ: జీవీఎంసీ మధురవాడ స్వతంత్ర నగర్ (ఆర్.ఎస్.ఎ) యువకుల ఆధ్వర్యంలో స్వతంత్ర నగర్ గ్రామంలో నివసించే నీరుపేద మరియు వికలాంగుల కుటుంబాలకు సుమారు 250 మందికి నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సిఐ ఎ. రవి కుమార్ హాజరయ్యారు. సిఐ రవికుమార్ చేతులమీదుగా సామాజిక దూరం పాటిస్తూ నిత్యవసర వస్తువులు, బియ్యం పంపిణీ ప్రారంభించారు. అనంతరం సిఐ ఎ.రవికుమార్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మానవాళి నుండి తరిమికొట్టాలంటే సామాజిక దూరం తప్పక పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత తో ఎంతటి వైరస్ నైనా తరిమి కొట్టవచ్చునని, ఈ విపత్కర సమయంలో పేదవారికి సహాయం చేస్తూ,సమాజ శ్రేయస్సుకు నడుం బిగించిన స్వతంత్రనగర్ యువకులకు అభినందనలు తెలిపారు. సమాజం నైతిక అభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమం తరువాత స్వతంత్ర నగర్ యువత సామాజిక దూరం పాటిస్తూ ఇంటింటికి వెళ్లి సరుకులను అందించారు, పేద వారి మన్ననలు పొందారు.
మూసి ఉన్న మద్యం షాపుల్లో మిస్ అవుతున్న లిక్కర్
మూసి ఉన్న మద్యం షాపుల్లో మిస్ అవుతున్న లిక్కర్
వరంగల్/హుస్నాబాద్, పెన్ పవర్ :దాసు
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూసి ఉన్న మద్యం షాపుల్లో లిక్కర్ మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు రోజు ఉన్న లెక్క కి ఇపుడున్న మద్యం కి భారీ తేడా గమనించారు అధికారులు. అయితే తాళం వేసి ఉన్న లిక్కర్ షాపుల్లో నుంచి లిక్కర్ ఎలా మాయం అవుతుందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లిక్కర్ లెక్కను ఎక్సైజ్ శాఖ రాసి పెట్టుకుందట. ఆ లెక్కకి ఈ లెక్కకి భారీ తేడాలు ఉన్నట్టు గమనించారు అధికారులు. లోకల్ లీడర్ల హామీతోనే లిక్కర్ మాయామయినట్టు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు షాపులపై కేసులు నమోదు అవుతున్నాయి
అలాగే వరంగల్ అర్బన్ జిల్లా లో ప్రముఖ వైన్స్ నుంచి హోటల్స్,బార్లకు వరకు తాళాలు వేసి ఉన్న షాపులో నుంచి లిక్కర్ మాయం అవుతోంది. లాకుడౌన్ తరువాత లిక్కర్ గోడాన్ , షాపుల్లో లెక్క ఎక్సైజ్ శాఖ తెలుస్తోంది. లెక్క తప్పితే కేసులు నమోదు చేస్తోండ్ది ఎక్సైజ్ శాఖ.పెద్ద ఎత్తున లిక్కర్ బ్లాక్ దందా కొనసాగుతుoది.పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు అధికంగా ఆదాయం వస్తుండడంతో మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతున్న లిక్కర్ దందా. కొన్ని ప్రాంతాల్లో
ఇక లిక్కర్ లేకపోవడంతో చాలా మంది నాటుసార,కళ్లు వైపు మార్లుతున్నారు.కరోనా వల్లన అటు ప్రభుత్వనికి ఆదాయం కోల్పోయిన ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద సాహసమే చేసింది. కాని మద్యం వ్యాపారులకు మాత్రం పెట్టిన పెట్టుబడి, ఖర్చులకు బోను నాలుగు రూపాయలు వెనుక వేసుకుంది
పోలీసుల ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నిరోధక ద్వారం
విజయనగరం జిల్లా వై జంక్షన్ వద్ద పోలీసు యంత్రాంగం కరోనా వ్యాధి నిరోధక ద్వారం.
విజయనగరం, పెన్ పవర్ : డేవిడ్ రాజ్
ఏర్పాటు చేశారు, ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వచ్చి వెళ్లే వాహనదారులను ఆపి, వైరస్ సోకకుండా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా బ్యాక్టీరియాను, వైరస్లను, అరికట్టవచ్చని కరోనా వ్యాధి నిరోధక ద్వారం ద్వారా వాహనదారులను పంపిస్తామని తేలియజేశారు..
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...