మధురవాడ, పెన్ పవర్: సునీల్
కోవిద్ 19 లాక్ డౌన్ కారణంగా, విశాఖ జిల్లా పాడేరు కు చెందిన కొంతమంది యువకులు ఇంజనీరింగ్ పూర్తి చేసి మారికవలస కాలనీలో ఉంటూ బ్యాంక్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఇక్కడ ఉండి పోవడం వల్ల వారి గురించి జనసేన పార్టీ అరకు పార్లమెంటరీ ఇంచార్జ్ వి. గంగులయ్య సూచన మేరకు, భీమిలి నియోజకవర్గo ఐదవ వార్డు జనసేన పార్టీ నాయకురాలు యడ్ల లక్ష్మీ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకుల మరియు ఆర్థిక సహాయము చేయడం జరిగింది., ఈ కార్యక్రమంలో ఐదవ వార్డ్ జనసేన సైనికులు యడ్ల గణేష్ యాదవ్ నరేష్ పి ఎస్ పి కెె., శశి పాల్గొన్నారు, ఓట్లు కోసం చేసే సేవ కాదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బాటలో నాడుస్తాం, అరుకు వారికి ఇక్కడ ఓట్లు లేవు అని ఎవ్వరు వాళ్ళకి అదుకోలేదు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడంలో జనసేన ముందు ఉంటుందని అన్నారు.