Followers

సీఎం కు కృతజ్ఞతలు తెలుపిన అర్చక సంఘం.


 

 

     స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)

 

 

 ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు మేరకు దేవాదాయశాఖ ద్వారా 5000రూపాయలు ఆర్ధిక సహాయం ఇవ్వనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించటం పట్ల, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణా సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,వైసిపి నాయకులు  వడ్డాది ఉదయకుమార్ గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న అర్చకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్, దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణులకు, ఆ ప్రకటనలో ఉదయకుమార్ కృతజ్ఞతలు తెలియచేసారు.
 

 


నాటు సారా బట్టీలు పై ఎక్సైజ్ అధికారులు దాడులు



   5000 లీటర్ల బెల్లం ధ్వంసం

  స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 


 


జిల్లాలో  ఎక్సైజ్  అధికారులు    నాటు సారా తయారీ కేంద్రాలపై ముమ్మరంగా  దాడులు నిర్వహిస్తున్నారు. పొదల్లో తోటల్లో  రహస్యంగా  సారా బట్టీలు నిర్వహిస్తున్నట్లు  సమాచారం అందడంతో   ఎక్సైజ్ అధికారులు  ఆయా ప్రదేశాల పై   దాడులు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా  మద్యం షాపులు  మూసివేయడంతో  నాటు సారా తయారీ అమ్మకాలు  జోరందుకున్నాయి. నాటుసారా  నియంత్రణలో భాగంగా  ఎక్సైజ్ అధికారులు  దాడులు  నిర్వహిస్తున్నారు. మాడుగుల  ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల జగదీశ్వరరావు  గురువారం  స్టేషన్ పరిధిలో  పలుచోట్ల  దాడులు చేపట్టారు  ఈ దాడుల్లో  సుమారు 5000 లీటర్ల  బెల్లం పులుపు  ధ్వంసం చేశారు. పొంగలిపాక  జాలం పల్లి   గదబూరు  పొన్నవొలు  గురు వాడ తదితర గ్రామాల్లో నాటు సారా తయారీ కి  ఉపయోగించే  బెల్లం పులుపు  ధ్వంసం చేశారు. గ్రామ వాలంటీర్ల సహకారంతో నాటుసారా నిర్మూలనకు  ఎక్సైజ్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ జగదీశ్వర రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రావణి సిబ్బంది పాల్గొన్నారు.


సచివాలయ సిబ్బందికి 200 మాస్కుల  వితరణ


 





పెన్ పవర్;జమ్మలమడుగు

 

కడప జిల్లా యర్రగుంట్ల పట్టణంలోని రైల్వే గేటు దగ్గర గల 2&3 వ వీధుల్లో ఉన్న  సచివాలయంలో   ప్రజా సేవ కోసం,నిరంతరం ప్రజల లో తిరుగుతున్న వాలంటీర్లకు,పంచాయతీ అధికారులకు కరోనా వైరస్ భారిన పడకుండా   వైసీపీ యువ నాయకులు అయిన  కరుణ,రఘు రాముడు నిర్వహించిన కార్యక్రమంలో  రాష్రకార్యదర్శి & మున్సిపల్ ఇంచార్జ్ మూలె.హర్షవర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన సచివాలయ సిబ్బందికి మాస్కులను  అందచేశారు.  ఈ కార్యక్రమంలో మల్లు గోపాల్ రెడ్డి,జయరామ కృష్ణా రెడ్డి గారు,తుంగా. వెంకట రామి రెడ్డి గారు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

 



 

మానవత్వంలొ రారాజు రామచంద్ర రాజు



 


 

ఎన్ పవర్... ఎస్‌. రాయవరం.

 

కరోనా లాక్ డౌన్ వల్ల అవస్దలు ఎదుర్కొంటున్న  జర్నలిస్టులు, గ్రామస్తులకు నిత్యావసర సరుకులు,కూరగాయలు పంపిణీ చేసి రామ చంద్ర రాజు మానవత్వం చాటుకున్నారు. కోరుప్రోలుకి చెందిన సాధారణ రైతు రామ చంద్ర రాజు గురువారం ప్రజలు విలేకరుల కు బియ్యం పప్పులు కూరగాయలు అందచేశారు. ఎస్ రాాాయవరం మండలం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కు10 కేజీల బియ్యం, 4 రకాల పప్పు దినుసులు,పామాయిల్ నూని,చింతపండు,బెల్లం తదితర సరుకులు పంపిణీ చేశారు.

అంతకు ముందు గ్రామంలో  టన్ను కూరగాయలు పంపిణీ చేశారు.గ్రామంలో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు ఈ కూరగాయలు అందే టట్లు ఏర్పాట్లు చేశారు.ప్రతీ ఇంటికి 5 కేజీల కూరగాయలు అందజేశారు.ఈ పంపిణీ చేసేందుకు గ్రామంలో నున్న యువకులు స్వచ్చందంగా వచ్చారు.ఈ యువకుల సాయంతో 10 ఆటోలలో ఈ కూరగాయలను ప్రతి వార్డు, అయితే రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకూడదని పోలీసులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందరికీ సామాజిక దూరం పాటించాలని రామ చంద్ర రాజు తెలిపారు.

మొల్లి హేమలత ఆధ్వర్యంలో ప్రజలఅందరికీ కూరగాయలు పంపిణీ....


జీవీఎంసీ 5 వార్డులో టిడిపి నాయకురాలు మొల్లి హేమలత ఆధ్వర్యంలో ప్రజలఅందరికీ కూరగాయలు పంపిణీ....


మధురవాడ, పెన్ పవర్


 


మధురవాడ: జీవీఎంసీ మధురవాడ 5 వార్డు టిడిపి సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు  కుమార్తె 5వ వార్డు అభ్యర్థి మొల్లి హేమలత, ఆధ్వర్యంలో కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ సందర్భంగా నిత్యావసరాలు కొనుగోలు కు సతమతమవుతున్న 5 వార్డు ప్రజలందరికీ తనవంతు సహాయంగా  కూరగాయలు పంపిణీ కార్యక్రమ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిల్లా,నరసింహారావు, పిల్లా, వెంకట్రావు హాజరయ్యారు, వారి చేతుల మీదుగా  ప్రజలకు కూరగాయల ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లా నర్సింగరావు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమని,వార్డ్ ప్రజలందరికీ ఇటువంటి సందర్భాల్లో  సేవాదృక్పథంతో ముందుకు వచ్చి నటువంటి మొల్లి హేమలత ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనిఅభినందించారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రభుత్వాలు, పోలీసులు ఇస్తున్న సూచనల ప్రకారం గుంపులు గుంపులుగా వీధుల్లో తిరగవద్దుఅని, నిత్యావసరాలకు ఒక ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని, ఉదయం తొమ్మిది గంటల తర్వాత బయటకు ఎవరు రావద్దని చేయి,చేయి కలిపి లాక్ డౌన్ ను విజయవంతం చేద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మొల్లి లక్ష్మణరావు, వి.అప్పలరాజు, మల్యాల సోంబాబు, నమ్మి శ్రీను, ఈగల రవి, వార్డ్ అధ్యక్షులు నాగోతి సత్యనారాయణ (జపాన్), నాగోతి శివాజీ, నాయుడుసూరిబాబు, వి. బాబులు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.


హెండ్స్2హెల్ప్ ఆధ్వర్యంలో ఆహారం పొట్లాలు పంపిణీ


 


 


విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్


"కరోనా" మహామ్మారి నివారణలో భాగంగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కారణంగా పనులు లేక ఇబ్బందులుపడుతున్న  నిరుపేదకార్మికులకు,వృద్ధులకు, జనసంచారం లేకపోవడంతో  భీక్షాటన చేసుకునేవారి ఆకలి తీర్చడానికి మరియు విధినిర్వహాణలో  సమయానికి  భోజనం లేక ఇబ్బందులు పడుతున్న  పోలీస్ సిబ్బందికి, జి.వి.యం.సి సిబ్బందికి   తమ వంతు సామాజిక భాధ్యతగా హెండ్స్2హెల్ప్(9000064322) ద్వారా వరుసగా 14వ రోజు కొంమ్మాది వాస్తవ్యులు పిళ్ల  రామారావు గారి కుమారులు పిళ్ల  అప్పలరాజు ,పిళ్ల  బంగార్రాజు గారి  ఆర్ధిక సహకారంతో సుమారు 200 మందికి భోజనం మరియు మంచినీరు  ఏర్పాటు చేయడం  జరిగింది. కార్యక్రమంలో   హ్యండ్స్2హెల్ప్ వ్యవస్థాపకుడు  చిన్ని వెంకట్,బైపిల్లి వరప్రసాద్,  పిల్ల అప్పలరాజు ,పిల్ల  బంగార్రాజు ,దినేష్, ప్రతాప్,సంపత్,  రాజగిరి రామోజీ,సత్యాల కార్తీక్ ,బేవర రాజ్ కుమార్,బెవర నవీన్ కుమార్, ఆర్డివి బాబు,పోతిన  అనిల్,కోర్రాయి శ్రీనువాసు, కొర్రాయి జయేంద్ర ,దుక్క సతీష్,పోతిన అనురాధ,పోతిన వెంకటేష్,   హ్యాండ్స్2హెల్ప్ సభ్యులు పాల్గొన్నారు.వారికి,వారి కుటుంబ సభ్యులకు హెండ్స్2హెల్ప్,వుయ్ కేర్ యు తరుపున ప్రత్యేక ధన్యవాదాలు......


లాక్ డౌన్ సమయం లో అందరూ పేదలకు సహాయం చేయాలి

 


లాక్ డౌన్ సమయం లో అందరూ పేదలకు సహాయం చేయాలి


 


అడ్డతీగెల, పెన్ పవర్ 


 


లాక్ డౌన్ సమయంలో ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని అందరూ తమ వంతున పేదలకు సహాయం చేస్తున్నారు. స్థానిక జుడిష్యల్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు  బుధవారం  పేదలకు సరుకులను పంపిణీ చేశారు.  ప్రతిఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ , సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కోర్టు లాయర్లు శ్రీధర్, రమణ , ఎస్సైలు నాగేశ్వరరావు,బాబురావు  పోలీసు సిబ్బంది , గ్రామస్థులు పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...