Followers
విలేకరులకు నిత్యావసర వస్తువుల పంపిణీ..
61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం
61 రోజుల పాటు సముద్ర చేపల వేట నిషేధం
మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత
విజయనగరం, పెన్ పవర్
సముద్రంలో చేపల వేటను ఈనెల 15 నుండి జూన్ 14వ తేది వరకు 61 రోజులపాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ (జిఓఆర్టి నెం .80, పశు సంవర్దక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ, తేది 26.3.2020) జారీచేసిందని మత్స్య శాఖ ఉప సంచాలకులు టి. సుమలత తెలిపారు. సాంప్రదాయ బోటులకు (ఇంజను లేని పడవలకు) ఈ నిషేద కాలము వర్తించదన్నారు.
చేపలు, రొయ్యలు సంతానోత్పత్తి కాలములో తల్లి చేపలు, రొయ్యలను సంరంక్షించుట, వాటి ఉత్పత్తిని పెంచుట తద్వారా మత్స్య సంపద అభివృద్ది సాధించుట ముఖ్య ఉద్దేశ్యంగా ప్రతి సంవత్సరం ఈ వేట నిషేద కాలాన్ని పాటించడం జరుగుతుందన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి మెకనైజడ్, మోటరైజడ్ బోట్లు వినియోగించి సముద్ర జలాలలో చేపల వేట చేయరాదన్నారు. వేట నిషేద ఉత్తర్వులు ఉల్లంఘించిన బోటు యజమానులపై ఎపిఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్య తీసుకోబడుతుందన్నారు. బోటు యజమానులందరూ ఈ నిషేద ఉత్తర్వులు పాటించాలని ఆమె కోరారు.
కొత్తవారు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వండి : జిల్లా కలెక్టర్
విజయనగరం, పెన్ పవర్
గ్రామాలు, పట్టణాల్లోకి ఇతర ప్రాంతాల నుండి కొత్తవారు ఎవరైనా వచ్చినట్లయితే సంబంధిత సమాచారాన్ని గ్రామ సచివాలయానికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కరోనా నిరోధించడంలో అందరి సహకారం అవసరమని, ఈ సమాచారం యంత్రాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారి వివరాలు దాచి ఉంచకుండా తెలియజేస్తే వారికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించి వారి కారణంగా వారి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి కరోనా ముప్పు లేకుండా చూసేందుకే ఈ విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,
సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రసాయనాలు జోడిస్తున్న జివిఎంసి పారిశుద్ధ్య అధికారులు,
విశాఖపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు గుర్తించిన వారి నివాసం ఉండే ప్రాంతాల నుండి 5 కి.మీ పరిధి వరకు కంటికి రెప్పలా పారిశుద్ధ్య పనులు, రసాయనాలు చల్లడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కమిషనర్ డా.జి.సృజన ముఖ్యవైద్య ఆరోగ్యశాఖాధికారి, బయాలజిస్టును మరియు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లును ఆదేశించారు. ప్రస్తుతం చాలా కఠినమైన గడియలు నడుస్తున్నందువలన, ప్రజలు కరోనా బారీ నుండి రక్షించుకొనే నిమిత్తం, జివిఎంసి తరపున తగినంత సేవచేయాలని, నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు పారిశుద్ధ్య కార్మికుడు నుండి పై స్థాయి ఆరోగ్య అధికారులు వరకు సమస్యాత్మక ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. కమిషనర్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా, కరోనా సమస్యాత్మక ప్రాంతాలైన నాలుగవ జోన్లోని తాటి చెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో, గాజువాకలోని ఉడాకాలనీ, కుంచమాంబకాలనీ పరిసర ప్రాంతాల్లో, రెండవజోన్లోని అక్కయ్యపాలెం మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాల్లోను వాహాన యంత్రాల ద్వారా రసాయనాలు జివిఎంసి బయాలజిస్టు, ఆయా జోన్ల అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో విస్తృతంగా జల్లించారు. రసాయనాలు విరివిగా జల్లించడం పై ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.
వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ
వేకాటాపరం గ్రామంలో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేసిన వైసిపి నాయకులు
లాక్ డౌన్ అమల్లో పోలీసుల పనితీరు బాగుంది
విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ
విలేకరులకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేసిన జనసేన సైనికులు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...