Followers

హైట్రో డ్రగ్స్  రసాయన ట్యాంకు లో   ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు


హైట్రో డ్రగ్స్  రసాయన ట్యాంకు లో   ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు..
  ఒకరు మృతి  మరొకరికి ఆసుపత్రిలో  చికిత్స.


 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)


 


హెటోరో  ఔషధ  పరిశ్రమలో  మంగళవారం జరిగిన  ప్రమాదంలో  ఒక ఉద్యోగి  మృతిచెందగా  రెండో వ్యక్తి  ప్రాణాపాయ స్థితిలో  ఆస్పత్రిలో  వైద్యం అందిస్తున్నారు. జిల్లాలోని  నక్కపల్లి  మండలంలోని హెటోరొ   ఔషధ కర్మాగారంలో  రసాయన ట్యాంకు  శుద్ధి చేస్తుండగా జూనియర్ కెమిస్ట్రీ  గాడి శ్రీను 29  షిఫ్టు ఇంచార్జ్  యు ఎన్ అప్పారావు నైట్రోజన్   ప్రభావం వల్ల  అపస్మారక స్థితిలో   ట్యాంకులో పడిపోయారు.  వీరిని   విశాఖ  ఆస్పత్రికి తరలిస్తుండగా  శ్రీను మార్గమధ్యంలో మృతిచెందాడు. నక్కపల్లి ఎస్ ఐ  శివరామకృష్ణ  అందిన సమాచారం మేరకు  తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం  కెఏ మల్లవరం  గ్రామానికి చెందిన  గాడి శ్రీను  హెటిరో డ్రగ్స్ కంపెనీలో  జూనియర్ కెమిస్ట్రీ గా  పని చేస్తున్నాడు. యధావిధిగా  విధులకు హాజరైన  శ్రీను  యూనిట్ 3 హెచ్   బ్లాకులో రసాయన  ట్యాంకు  శుభ్రం చేస్తుండగా  ప్రమాదం  చోటు చేసుకుంది. ట్యాంకు  హెడ్  శుభ్రం చేసి  ట్యాంకులో  దిగిన  శ్రీను నైట్రోజన్  ప్రభావానికి  గురై  ట్యాంకులో  పడిపోయాడు.  అతన్ని రక్షించేందుకు  ప్రయత్నించిన  షిఫ్ట్ ఇంచార్జ్  యు ఎం అప్పారావు  కూడా  ట్యాంకు లొ  పడిపోయాడు. గమనించిన  సీనియర్  కెమిస్ట్రీ  సిబ్బంది సహాయంతో  ఇద్దరిని   బయటకు తీసి  ఆస్పత్రికి తరలించారు. శ్రీను మార్గమధ్యలో  మృతిచెందగా  అప్పారావు వైద్యం అందుకుంటున్నాడు. మృతుడు శ్రీనుకు  రోలుగుంట మండలం  లింగాపురం కు చెందిన  రోహిణి కుమారితో  డిసెంబర్ 11న  వివాహమైంది. విధులు నిర్వహించే ఫ్యాక్టరీ   దగ్గరలో   ఉన్నందున   శ్రీను  అత్తారింట్లో  మకాం పెట్టాడు.  పెళ్లై నాలుగు నెలలు  గడవక ముందే తన భర్త    కాన రాని లోకాలకు  తరలి పోయాడు అని  భార్య రోహిణి విలపించింది.


బైకును ఢీకొన్న లారీ. మహిళ మృతి

 



బైకును ఢీకొన్న లారీ. మహిళ మృతి



 స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)


 


 నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. బిర్లా జంక్షన్ నుండి  ఎన్ఏడి  జంక్షన్ వైపు  బైక్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. ఆ సమయంలో ఎన్ఏడి వైపునుంచి తౌడు  లోడుతో నగరంలో కి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అప్పల నరసమ్మ 23 లారీ కింద పడి మృతి చెందింది. బైకు లారీ ఢీకొట్టడంతో ఆమె లారీ టైరు కింద పడిపోయింది. లారీ కొంత దూరం ఆమెను ఈడ్చుకు పోయింది. ఈ సంఘటనలో  తల నుజ్జునుజ్జయింది.  కళ్ళముందే  కట్టుకున్న భార్య  లారీ కింద పడి చనిపోయిన సంఘటన భర్త జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుని విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని  వివరాలు సేకరించి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


నిబంధనలు అతిక్రమించిన వారిపై 1772 కేసులు నమోదు.  ఎస్పి   అట్టాడ  బాబూజీ.

 నిబంధనలు అతిక్రమించిన వారిపై 1772 కేసులు నమోదు.  ఎస్పి   అట్టాడ  బాబూజీ.
 


స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)


 


జిల్లాలో  నిబంధనలు అతిక్రమించిన  వారిపై  1772 కేసులు నమోదు చేశామని జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అట్టాడ బాబూజీ  తెలిపారు. కరోనా లాక్ డౌన్ సందర్భంగా కట్టు  దిట్టమైన  చర్యలు అమ్మలు జరుగుతుంటే  కొందరు   నిర్లక్ష్యంగా  కోవిడ్  19 నిబంధనలను  పాటించకుండా ఇష్టానుసారంగా  రోడ్లపై సంచరిస్తున్నారు అని  ఆయన విచారం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని దీనిని  పాటించాల్సిన ప్రజలు  అధికారులకు తలనొప్పిగా మారారని  అన్నారు.  ప్రభుత్వ నిబంధనలను  కట్టడి చేయటానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడమే కాకుండా 138 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 19వాహనాలను స్వాధీనం చేసుకొని  ఉంచమన్నారు. అపరాధ రుసుము ఎంత 11 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగిందని  ఇకపై ఎవరు  చట్టాన్ని ఉల్లంఘించిన సహించేది లేదని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ బాబూజీ ఒక ప్రకటన విడుదల చేశారు


 


విశాఖ ఏజెన్సీలో మాటలకే పరిమితం అయిన గ్యాస్ హోమ్ డెలివరీ


విశాఖ ఏజెన్సీలో మాటలకే పరిమితం అయిన గ్యాస్ హోమ్ డెలివరీ....


పాడేరు (పెన్ పవర్)


 


విశాఖ జిల్లా.పాడేరులో కరోనా.ప్రభావంతో ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు అమలు విషయంలో చోద్యం చూస్తున్నారు. ఐటిడిఎ గ్యాస్ సిబ్బంది ఇదే అవకాశంగా చేసుకొని గ్యాస్ బండ 800 రూపాయలుగా అంగట్లో అమ్ముకుంటున్నారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 11 మండలాలో ప్రతి ఒక్క పౌరుడు బయటకు రావద్దని... అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రతి ఇంటికి ఇంటికి గ్యాస్ సరఫరా చేస్తామని గతంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డి.కె.బాలాజీ ప్రకటన రూపంలో హామీ ఇచ్చారు. ఇప్పటివరకు గ్యాస్ సరఫరా కాదు కదా ఆ ప్రస్తావనే లేదు. ఏజెన్సీ ప్రాంతంలో పాలు నీళ్లు కూరగాయలు గ్యాస్ నిత్యవసర సరుకులు ప్రతి పేదవాడికి ఇంటికి చేరాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి గ్యాస్ డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఏజెన్సీ వాసులు వినియోగదారులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రకటనలు హామీలు తప్ప అమలు చేయటం లేదని పాడేరు ప్రజలు అంటున్నారు. పాడేరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం6 గంటలు నుండి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే డెలివరీ ఛార్జ్ పేరుతో 30 రూపాయలు అదనంగా వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. మొత్తంగా 800 రూపాయలు ముక్కుపిండి నిర్భయంగా వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసే ఈవిధంగా జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.


ఆక‌లివేళ ఆప‌న్న హ‌స్తం


ఆక‌లివేళ ఆప‌న్న హ‌స్తం
నిరాశ్ర‌యుల‌ను ఆదుకుంటున్న ఉప‌శ‌మ‌న‌ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 35 రిలీఫ్ సెంట‌ర్ల ఏర్పాటు


విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్


ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా మ‌హమ్మారి, పేద‌ల ఉపాధికి గండికొట్టింది.  రెక్కాడితే గాని డొక్కాడ‌ని బ‌డుగు జీవులు లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నుల్లేక అల్లాడాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితి వారికి రాకూడ‌ద‌ని భావించిన రాష్ట్ర‌ప్ర‌భుత్వం,  వారిని ఆదుకొనేందుకు ఎన్నో చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. ఇలాంటి వారికోసం ఉచితంగా భోజ‌న స‌దుపాయాన్న, ఆవాశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 35 ఉప‌శ‌మ‌న‌ కేంద్రాల‌ద్వారా అన్నార్తుల‌కు నిత్యం భోజ‌నం పెట్టి ఆదుకుంటున్నారు.


            విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఉప‌శ‌మ‌న‌ కేంద్రాలు ఇప్పుడు పేద‌ల పాలిట వ‌రంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా నిత్యం పేద‌ల‌కు ఉచితంగా రుచిక‌ర‌మైన‌ భోజ‌నాన్ని ప్ర‌భుత్వం అంద‌జేస్తోంది. వ‌ల‌స జీవులు, లాక్‌డౌన్ కార‌ణంగా జిల్లాలో చిక్కుకుపోయిన‌వారు, నిరుపేద‌లు, సంచార తెగ‌లు, నిరాశ్ర‌యులు, బిక్ష‌గాళ్లు త‌దిత‌రులంతా ఇప్ప‌డు ఈ కేంద్రాల్లో చేరి సంతృప్తిగా భోజ‌నం చేస్తున్నారు. ఇలాంటి వారికోసం ప్ర‌భుత్వం స్వ‌యంగా 18 రిలీఫ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. వీటిలో ఆరు చోట్ల ఆశ్ర‌యాన్ని కూడా క‌ల్పించి మూడు పూట‌లా భోజ‌నం పెడుతున్నారు. మిగిలిన 12 చోట్ల మాత్రం రెండు పూట‌లా కేంద్రాల‌కు వ‌చ్చి భోజ‌నం చేసి వెళ్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 17 స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా ఆశ్ర‌యం, భోజ‌న స‌దుపాయాన్ని క‌ల్పించారు. ఇలా ఇప్పుడు జిల్లాలో మొత్తం 554 మంది ఈ  కేంద్రాల్లో ఆశ్ర‌యాన్ని పొందారు. వీరికి భోజ‌న స‌దుపాయంతోబాటు ఉండ‌టానికి వ‌స‌తి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించారు.  ఇవి కాకుండా మిగిలిన ఉప‌వ‌మ‌న‌ కేంద్రాల ద్వారా సుమారు 3,170 మందికి రెండు పూట‌లా భోజ‌నాన్ని పెడుతున్నారు. ఇత‌ర రాష్ట్రాల‌నుంచి వ‌చ్చిన కొంద‌రు వ‌ల‌స జీవులు, సంచార తెగ‌లు నిత్యం ఏదో ఒక ప‌నిచేసుకుంటూ జీవితాల‌ను వెళ్ల‌దీస్తుంటారు. ఇలాంటి వారంతా ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా పూర్తిగా ఉపాధి కోల్పోయారు. వీరికి ఆదుకొనేందుకు వారున్న‌చోటే తాత్కాలికంగా స‌హాయ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, రెండు పూట‌లా భోజ‌నాన్ని అంద‌జేస్తోంది.  ఇలా శృంగవ‌ర‌పుకోట మండ‌ల‌కేంద్రంలోని ఆకుల‌క‌ట్ట‌వ‌ద్ద‌, కోరుకొండ త‌దిత‌ర చోట్ల ఇత‌ర రాష్టాల‌నుంచి వ‌చ్చిన‌వారికి భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు. ఈ స‌హాయ కేంద్రాల‌కు నోడ‌ల్ ఆఫీస‌ర్‌గా జిల్లా అట‌వీశాఖాధికారి (సామాజిక వ‌న విభాగం) జి.ల‌క్ష్మ‌ణ్‌ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నఉప‌శ‌మ‌న‌ కేంద్రాల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా వంద‌లాదిమంది వ్య‌క్తిగ‌తంగా, సంస్థా ప‌రంగా కూడా నిత్యం ఆహారాన్ని అందిస్తూ ఆక‌లిగొన్న వేళ అన్నార్తుల‌ను ఆదుకుంటున్నారు. 


 


ఐదవ వార్డు ప్రజలకు అండగా నేనుంటా! మొల్లి లక్ష్మణరావు


ఐదవ వార్డు ప్రజలకు అండగా నేనుంటా! మొల్లి లక్ష్మణరావు


 విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్


 మదురవాడ 5వ వార్డు ప్రజలకు మొల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని శివశక్తి నగర్ లో ప్రారంభించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్ డౌన్ సందర్బంగా ఈ ప్రాంత ప్రజానీకం ఇళ్లకే పరిమితం కావడంతో పేద ప్రజలకు జీవనోపాధి కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో తన వంతు సహాయంగా 5 వార్డు ప్రజలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం శివశక్తినగర్ నుండి ప్రారంభించారు, ఈ సందర్భంగా కరోనా వైరస్ నివారణ చేయుట లో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జివిఎంసి సిబ్బందికి, డాక్టర్లకు, పత్రిక విలేకరులకు లక్ష్మణరావు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వాండ్రాసి అప్పలరాజు, మన్యల సోంబాబు, బోయి శీను, ఈగల రవి, నాగోతి సత్యనారాయణ జపాన్, నాయుడు సూరిబాబు, వి బాబులు, యువ నాయకుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు..


మీ బాధ్యత మాది  అంటున్న జేనసేన నాయకులు


మీ బాధ్యత మాది  అంటున్న జేనసేన నాయకులు


 


విశాఖపట్నం/మధురవాడ, పెన్ పవర్


మధురవాడ జోన్ వన్ ఆరవవార్డు బక్కనపాలెం గ్రామం జనసైనికులను జనసేన భీమిలీ నియోజకవర్గపు ఇంచార్జ్ పంచకర్ల సందీప్ పరామర్శించారు.జనసేన కార్యకర్తలు రాయిన రామారావు,సత్యాల పూర్ణ చంద్రరావు లాక్ డౌన్ ప్రకటించక వారం రోజుల ముందు యధావిధిగా జీవన మనుగడ కోసం చేసే మార్బుల్ వర్క్ కి వెళ్ళగా పని చేస్తుండగా మార్బుల్ ఒకటి చేయి జారి కాళ్ళ పై పడటం జరిగింది.రెండు కాళ్ళు తీవ్రంగా గాయపడ్డాయి.పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వం ప్రకటించిన తరువాత కదలలేని పరిస్థితి ఏర్పడింది.వీరిని పంచకర్ల సందీప్,బివి కృష్ణయ్య,పోతిన నానజీ పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితులు కాళ్లకు తగిలిన గాయాల విషయమై అడిగి తెలుసుకున్నారు.జనసేన నాయకులు పోతిన నానాజీ జనసేన సీనియర్ నాయకులు బి.వి కృష్ణయ్య,పంచకర్ల సందీప్,జనసేన ఆరవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పోతిన అనురాధ జనసేన కార్యకర్తలతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.నెలరోజులకి సరిపడే నిత్యావసరాలు,చేతిఖర్చులకు గాను కొంత రుసుమును జనసేన ఆరవవార్డు కార్పొరేటర్ అభ్యర్థిని పోతిన అనురాధ,పోతిన నానాజీ చేతుల మీదుగా అందజేశారు.జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ పార్టి తరుపున వారిని అన్ని విధాలా ఆదుకుంటాం అని భరోసా ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన ఆరవవార్డు అధ్యక్షులు సంతోష్ నాయుడు,పోతిన నానజీ, నాగోతి ప్రకాష్,అప్పలరాజు,సాయి, సింగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...