Followers

ఫోన్ చేస్తే మీ వద్దకే భోజనం అందిస్తాం  


ఫోన్ చేస్తే మీ వద్దకే భోజనం అందిస్తాం  


 
 - గాదరాడ ఓం శివ శక్తి పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ



కోరుకొండ, పెన్ పవర్



 కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటరీలకు, రాజానగరం మండలం, కోరుకొండ  మండల్లలోని పేదలకు, అనాథలకు, లారీ డ్రైవర్లకు గాదరాడ ఓం శివ పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ, జక్కంపూడి ఫౌండేషన్, 
 ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకొండ మండలం గాదరాడ ఓం శివ శక్తి పీఠం ఆలయ ధర్మకర్త బత్తుల బలరామ కృష్ణ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదేశాల మేరకు ప్రతిరోజు
  వెయ్యి మందికి సమీప గ్రామాలకు వెళ్లి భోజన ప్యాకెట్లు అందజేస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ అమలుచేస్తున్న నేపథ్యంలోనే గత నెల 31 నుండి రాజానగరం, కోరుకొండ మండలాల్లో నిత్యం భోజన సదుపాయం కల్పిస్తున్నమని అన్నారు. అదే విధంగా సామాజిక మాధ్యమాలు ద్వారా శివ శక్తి పీఠం చరవాని నంబర్లను అందరికీ తెలియజేసి, ఆకలితో ఉన్న వారి వివరాలు తెలియజేస్తే, క్షణాల వ్యవధిలో భోజన ప్యాకెట్లు అందిస్తున్నామని అన్నారు.
ఏదేమైనా కరోనా వ్యాప్తి తో  ఇళ్లకే పరిమితం అయి, ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి, ఇతర రాష్ట్రాల నుండి వివిధ  పనుల నిమిత్తం రాజానగరం పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న వాహనదారులకు గాదరాడ శివ శక్తి పీఠం ఆకలి తీరుస్తుంది అని అన్నారు. గాదరాడ ఓం శివశక్తి పీఠం సేవలను నియోజకవర్గంలోని ప్రజలు కొనియాడుతున్నారు.


చిన్నారి  దాతృత్వం


"" చిన్నారి  దాతృత్వం ""


విజయనగరం, పెన్ పవర్
   


 మనవసేవే... మాధవ సేవ...స్ఫూర్తి తో  విజయనగరానికి చెందిన  "పైల నీతూ " అనే చిన్నారి కరోనా  మహమ్మారి  కారణంగా..  తన  కిడ్డీ  బ్యాంకు  లో  దాచుకున్న  2, 500/- తో     "కేసలి  స్వచ్ఛంద  సేవా సంస్థ  " ఆధ్వర్యంలో   విజయనగరం  లొ ఉన్న    చిన్నారుల కు.. విధి  నిర్వహణలో  ఉన్న  పోలీస్ అధికారులు / పోలీస్  సిబ్బంది కి..  రైల్వే సిబ్బంది.. పారిశుధ్య కార్మికులు కు.. పాదాచారులు కి. సెక్యూరిటీ సిబ్బంది కి.. చిరు  వర్తకులు కు.  నిరాశ్రుయులు కు.. భిక్షాటన  చేయు వారికి.. మతి  స్తిమితము  లేని  వారికి 


 " ఫ్రూటీలు .. గ్లూకోజ్  బాటిల్స్.. మజ్జిక పాకెట్స్ "


పంపిణీ చేశారు


ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరులు, ధన్వంతరీ ఆశీస్సులు


విజయనగరం, పెన్ పవర్


 


కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు, ధన్వంతరీ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. మంగళవారం నాడు పట్టణంలోని కొత్తగ్రహారం లో వేంచేసి ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన చండీయాగం లో ఎమ్మెల్యే కోలగట్ల పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమగుండంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో కూడిన వస్తువులను ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఋత్విక్కులు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలమై ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అని అన్నారు. కనపడే క్రిములు, కనపడని క్రిములు కూడా నాశనం చేసే శక్తి మంత్రానికి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి అన్నారు. పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి ఎదురుగా చండీ హోమం చేయడం వల్ల ప్రజలకు అంతా మంచే జరుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ న్యాయవాది టీవీ శ్రీనివాస రావు దంపతులు చండీ హోమం కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్తలు ఉడతా కాశీ విశ్వనాథం, బలభద్రుని నానాజీ, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఆలయ ఈవో కె.వి.రమణ, ఋత్విక్కులు భమిడిపాటి రామ్ కుమార్ శర్మ, భమిడిపాటి రమేష్, కప్పగంతుల ప్రసాద్ తదితరులు ఉన్నారు...


నిండు గర్భిణికిి ఆదుకున్న ఫ్రెండ్లీ పోలీస్


నిండు గర్భిణికిి ఆదుకున్న ఫ్రెండ్లీ పోలీస్


మాడుగుల, పెన్ పవర్



అర్ధరాత్రి వేళ పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న ఓ నిండు గర్భిణికిి ఆదుకుని, మాడుగుల హాస్పిటల్ కు తరలించి, ప్రజల పట్ల పోలీసులు చూపించే ఆప్యాయతను మరో మారు రుజువు చేసి..  ఫ్రెండ్లీ పోలీస్ అనిపించుకున్నారు. 
వివరాల్లోకి వెలితే...
మాడుగుల మండలం సాగరం కాలనీకి చెందిన ఉండా భాను అనే నిండు గర్భిణీ, ఈ నెల 6వ తేది సోమవారం రాత్రి 12గంటల సమయంలో పురిటి నొప్పులతో అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో, 108 వాహనం అందుబాటులో లేక, బాధిత కుటుంబ సభ్యులకు ఏమి చెయ్యాలో అర్ధం కాక ఏఎన్ఎం ని ఆశ్రయించారు. వేరే మార్గం లేక ఏ ఎన్ ఎం వెంటనే మాడుగుల ఎస్సై పి రామారావుకు సమాచారం అందించారు. స్పందించిన ఆయన 7వ తేది మంగళవారం తెల్లవారి 2 గంటలకు  హుటాహుటిన సిబ్బందితో గ్రామానికి చేరుకుని, పురిటి నొప్పులతో బాధపడుతున్న ఉండా భాను ని మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ వాహనంపై తరలించారు.  ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. గర్భిణీ ఆరోగ్యం బాగానే ఉందని, మధ్యాహ్నం 2, 3 గంటలకు ప్రసవం అయ్యే అవకాశాలు ఉందని డాక్టర్ సుజాత తెలిపారు. పోలీసులు చేసిన సేవలను ఆ గ్రామస్తులు అభినందించారు..


సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందజేత





సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందజేత

 

గోకవరం పెన్ పవర్

 

గోకవరం మండలం గుమ్మల్ల దొడ్డి గ్రామంలో శ్రీ లలిత మెమోరియల్ ఫౌండేషన్ మరియు కోరుకొండ గొకవరం ఏజెన్సీ మండలాల పి.యం.పి అసోసియేషన్ ఆధ్వర్యంలో  బడుగు ప్రసాద్  ఆర్థిక సహాయం తో గుమ్మళ్ళదొడి గ్రామ సచివాలయం ఉద్యోగుల సమక్షంలో సచివాలయం సిబ్బందికి గ్రామ ప్రజలకు మాస్కుల అందచేశారు సచివాలయం ఉద్యోగులు శ్రీ లలిత మెమోరియల్ ఫౌండేషన్ మరియు పి.యం.పి అసోసియేషన్ అధ్యక్షులు పి చిన్ని ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి జి.వెంకటేష్ ఉపాధ్యక్షులు టి.వెంకటేష్ జాయింట్ సెక్రెటరీ బి.శ్రీనివాసు  సభ్యులు జాజుల శివాజీ, యమ్. బాపిరాజు గ్రామ నాయకులు పెనికేటి అబ్బాయి , పి.యం.పి అసోసియేషన్ కార్యదర్శి ఎం. నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు వై .పవన్ కుమార్,  వై. ప్రేమ్ కుమార్, పి.కృష్ణ, బి సేతు , డి. దుర్గాప్రసాద్  మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


 

 



 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

గోకవరం, పెన్ పవర్

 

గోకవరం సొసైటీ  కార్యాలయం వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభత్వం వారు   ఏర్పాటు చేసినట్లు సొసైటీ చైర్మన్ మంగరౌతు దుర్గా శ్రీనివాసరావు  మరియు సంఘ సి.యి. ఒ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రియల్7వ తేదీ నుండి ఈ సౌకర్యం అందబాటులోకి వస్తుందని కాబట్టి మండలంలోని రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.రైతులందరూ వివరాలు కొరకు గోకవరం సొసైటీ లోని ఈ నెంబర్స్  యన్.రమాదేవి 8331846488 , యస్. దుర్గారావు9989123507  సంప్రదించాలని కోరారు.

నిత్యావసరాలు పంపిణీ





 

 

సీతానగరం పెన్ పవర్.

 

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దానితో ఉపాధి అవకాశాలు కోల్పోయిన సింగవరం బీసీ , ఎస్సీ , ఎస్టీ మైనార్టీల ఆరువందల కుటుంబాలకు సంగన. చిన్న పోశియ్య 70 వేల రూపాయల వ్యయంతో బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దొండకాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగన.చిన్న పోశియ్య మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్న పోలీసువారికి, వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ కి సహకరిస్తూ కోవిడ్-19 కట్టడికి స్వీయ సంరక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. మన గ్రామానికి ఆర్థిక సాయం చేద్దాం - మన గ్రామాన్ని మనమే కాపాడుకుందాం అనే నినాదంతో నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో జరిగిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు తమ వంతు పలువురు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెందుర్తి అచ్యుత రామారావు పాల్గొన్నారు. సహకారంగా జ్ఞానం పోసియ్య, మర్రే.కృష్ణమూర్తి, ముత్యం రామారావు, ముత్యం వెంకన్న, గంగిశెట్టి సూర్య భాస్కర్ రావు, దయానంద్ పాల్గొన్నారు.


 

 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...