Followers

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎన్టీపీసి


వలస కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎన్టీపీసి



        పరవాడ పెన్ పవర్



సింహాద్రి ధర్మల్ పవర్(ఎన్టీపీసి) ప్లాంట్ వారు కరోనా వలన ప్రభుత్వం విధించిన స్వీయ నిర్బంధం(లాక్ డవున్) వలన రోజువారీ పనిచేసుకునే వలస కూలీలు పనులు లేక ఆదాయం రాక నిత్యావసర సరుకులు కొనలేని ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే చూసి వారికి నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు.ఎన్టీపీసి మెయిన్ గెట్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్లలో 54 కుటుంబాలు నివాస ముంటున్నారు ప్రస్తుత కరోనా కారణంగా వారికి పనులకు వెళ్లే అవకాశం లేక సంపాదన లేని కష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఎన్టీపీసి వారు వారికి నిత్యావసర సరుకులు బియ్యము, నూనె,పప్పు,కారము,పంచదార లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జీఎం(ఓ&ఎమ్)హెచ్ సి వర్మ,మెయింటినెన్స్ జీఎం శివం శ్రీవాస్తవ,ఎజీఎం హెచ్ఆర్ ప్రేమ్ చంద్,యూనియన్ మరియు అసోసోషియేట్ సభ్యులు పాల్గొన్నారు.


కూరగాయలను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు


నాయుడు పాలెం గ్రామంలో 1200 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు



             పరవాడ పెన్ పవర్



కరోనా కారణంగా కష్టాలను చవిచూస్తున్న నాయుడు పాలెం ప్రజలకు మీకు నేనున్నా అంటూ మాజీ ఎంపిటిసి కూoడ్రపు శ్రీరామమూర్తి ఏర్పాటు చేసిన కూరగాయలను ముఖ్య అతిధిగా పాల్గొని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చేతుల మీదగా పంపిణీ చేశారు.అనంతరం సత్యన్నారాయణ మూర్తి మాట్లాడుతూ గత 16 రోజులుగా కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉన్న ప్రజలకు ఉపాధి లేక ఆర్ధిక ఇబ్బందులు పడతుండటమే కాక నిత్యావసర వస్తులకు బయటకు భయపడుతూ వెళ్ళవలసి పరిస్తుల్లో ఎదుర్కొంటున్నారు అని అన్నారు.ప్రభుత్వాలు చేసే సహాయం ఎటూ చాలక ఎమ్ చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నపుడు వారి ఇబ్బందులను గమనించి ఆదుకున్న వాడే నిజమైన నాయకుడు అని ఆ కోవకు చెందిన నాయకుడే శ్రీరామమ్మూర్తి అని బండారు ప్రశంసించారు.మూర్తి తన వ్యక్తిగత నిధులు వెచ్చించి 1200 వదల కుటుంభాలకు రకానికి కేజీ చొప్పున 7 రకాల కూరగాయలను ఈ రోజు పంపిణీ చేయడం జరుగు తోంది అని తెలిపారు.నిత్యావసర వస్తులకోసం కూడా ప్రజలను బయటికి వెళ్లకుండా చేయగలిగితే ప్రజలను కరోనా భారిన పడకుండా కాపాడ వచ్చు అనే సదుద్దేశం తో మూర్తి ఈ కార్యక్రమం చేపట్టారు అని బండారు తెలిపారు.ప్రజలు కూడా కరోనా వ్యాప్తి నివారణ కొరకు వారి ఇళ్లలోనే ఉండి ప్రభుత్వాలకు,పోలీసు అధికారులకు,అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్ల కు సహకరించాలి అని కోరారు.ఎవరికి అయినా జలుబు,దగ్గు,జ్వరం లాంటివి ఉంటే వెంటనే వారు స్వయంగా ఆరోగ్య సిబ్బందికి తెలియ చేసి తగిన పరిక్షలు చేయించుకోవాలి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూండ్రపు సన్యాసినాయుడు,సినియర్ టిడిపి నాయకులు పయిల అప్పలనాయుడు,కూండ్రపు ప్రసాద రావు,కూండ్రపు కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.


గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారీ : ఎన్టీపీసి



నిర్వాసిత గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేయించిన : ఎన్టీపీసి



పరవాడ, పెన్ పవర్



పరవాడ:మండలం లోని రావాడ సోమునాయుడు పాలెం గ్రామం లో ఎన్టీపీసి వారి సహాయంతో వియ్యపు చిన్నా, మోటూరి సన్యాసిరావు ల అద్వర్యం లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకాన్ని గ్రామంలో అన్ని వీధులలో ను పిచికారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూoడ్రపు అప్పలనాయుడు,సిరిపురపు అప్పలనాయుడు,కూoడ్రపు శ్రీను,అయ్యబాబు,నాయుడు పాల్గొన్నారు.


పంచాయతీ లో నిత్యావసర వస్తువుల వితరణ



భరిణికం పంచాయతీ లో నిత్యావసర వస్తువుల వితరణ



             పరవాడ, పెన్ పవర్



పరవాడ మండలం లోని భరణికం గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామాల్లో జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ వియ్యపు చిన్నా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల వితరణ చేశారు.బరణికం, బాపడు పాలెం,ఎస్సి కాలనీ,కట్టవాని పాలెం గ్రామాల్లో లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వియ్యపు చిన్నా,బోండా తాతారావు,దాట్ల బంగారు మణి వీరి అందరి వ్యక్తి గత నిధులతో గ్రామం లోని 600 కుటుంబాలకు కేజీ ఉల్లిపాయలు,కేజీ బంగాళాదుంపలు,అర లీటర్ నూనె పేకెట్,6 గ్రుడ్లు లను పంపిణీ చేశారు.కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం స్వీయ నిర్బంధ ఆక్షలు విధించిన తరుణం లో ప్రజలు గత 15 రోజులుగా గృహ నిర్బంధంలో వుంటూ రోజువారీ ఆదాయం లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజల ఆర్ధిక ఇబ్బందులను గమనించి వారిని ఆదుకోవాలి అనే సామాజిక స్పృహతో నిత్యావసర వస్తులకు ప్రభుత్వం కల్పించిన నిర్ణిత సమయం వెసులుబాటు కు ప్రజలు అధిక సంఖ్యలో వెళుతుడటం తో స్థానిక నాయకులు సాధ్యమైనంత వరకు ప్రజలను ఇళ్లలోనే ఉంచాలి అని సదుద్దేశం తో చేస్తున్న ఈ కార్యక్రమాలను చూసి గ్రామస్థులు అభినoదిస్తున్నారు.నాయకులు ప్రతింటికి వెళ్లి నిత్యావసర వస్తువుల తోపాటు ప్రతి వక్కరు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రతి వక్కరు బహుతిక దూరం పాటించాలి అని ఇళ్లనుండి బయటకు రావద్దు అని అందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ మనమందరం కరోనాని రాష్ట్ర నుంచి దేశం నుంచి ప్రాలదొరడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వానికి,పోలీసులకు,ఆరోగ్య సిబ్బందికి,పారిశుధ్య కార్మికులు సహకరిద్దాము అని కోరారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు బోండా సన్ని దేముడు,జనసేన నాయకుడు మాజీ ఎంపిటిసి మోటూరు సన్యాసినాయుడు,మాజీ ఎంపిటిసి సారిపల్లి జోవినాయుడు,దాట్ల గణేష్ రాజు,పెట్టిశెట్టి సత్యారావు,గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు వడిసిల పైడి రాజు(రాఖీ)ఇందల వరలక్ష్మి,దొడ్డి పైడి రాజు,మంగాల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ


పవర్ గ్రిడ్ వారి ఆర్థిక సహాయం తో వలస కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ



              పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం లో కంపెనీలలో పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులకు కరోనా వైరస్ వాక్యాప్తిని అరికట్టేందు ప్రభుత్వాలు విధించిన స్వీయ నిర్బంధం వలన కూలీలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో ఇలా ఇబ్బందులు పడుతున్న కూలీలకు స్టీల్ ప్లాంట్ పవర్ గ్రిడ్ వారి ఆర్ధిక సహాయం తో 2 లీ వoటనూనె,1 కేజీ ఉప్పు,1కేజీ చింతపండు,1 కేజీ పంచదార,200 గ్రా కారం,2 సబ్బులు చొప్పున 800 కుటుంబాలకు తహశీల్దార్ గంగాధర్ చేతులమీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఏవిఎల్ నరసింహారావు,మాధవ్ ఆనంద్,పవర్ గ్రిడ్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది, వలస కూలీలు పాల్గొన్నారు.


ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో బిర్యాని పంపిణీ





ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో బిర్యాని పంపిణీ

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

అనకాపల్లి పరిసర ప్రాంతంలో  నిరుపేదలకు  ఆమ్  ఆద్మీ   ఆధ్వర్యంలో  బిర్యాని ప్యాకెట్లు పంపిణీ  చేశారు . కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొణతాల హరినాద్ బాబు, హీరా ప్రసాద్, బొగ్గరపు రమణాజి,  బిళ్ళ పాటి,గణేష్, టి. రవి, లలిత , పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.  ఉచిత వెజిటబుల్ బిర్యాని పొట్లాలను పేదలకు పంపిణీ చేశారు.

 

 



 

ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్ అందజేత


ప్రగతి భారత్ ఫౌండేషన్..
కోవిడ్..19 రిలీఫ్ మెజర్స్


మేనేజంగ్ ట్రస్టీ, ఎంపీ పి విజయ సాయి రెడ్డి చేతుల మీదుగా విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయితీ ల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్ లు, శాని టైజర్, గ్రాసరీ వస్తువులను అందచేశారు. మంగళవారం సాయంత్రం ఆనంద గజపతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..ప్రగతి భారతీ ట్రస్ట్ తరుపున కరోనా నియంత్రణ లో సేవలు అందిస్తున్న వారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. జిల్లా లో 1400 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ గ్రాసరీ కిట్ లను అంద చేయడం సంతోషం గా ఉంది. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన సోషల్ దూరంను ప్రజలు పాటించాలని కోరుతున్నాం..ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం యంత్రాంగం శ్రమిస్తోంది. పైడితల్లి అమ్మ వారి దయ వల్ల జిల్లాలో పాజిటివ్ కేస్ లు రాకపోవడం జిల్లా ప్రజల అదృష్టం.  ఇదే సమన్వయం తో లాక్ డౌన్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్ పాటించి వచ్చే వారం రోజులు అత్యంత జాగ్రత్త గా ఉండాలని మనవి చేస్తున్నాం..ఎంతటి విపత్కర పతిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం దశల వారీ చర్యలు తీసుకుంది. ప్రజలు అపోహలు, పుకార్లను నమ్మ వద్దు.. ప్రజల క్షేమం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం..ప్రగతి ఫౌండేసన్ ద్వారా విజయ సాయి రెడ్డి అందిస్తున్న సాయం అభినందనీయం..జిల్లాలో 700 వరకు హోమ్ గార్డులు ఉన్నారు..వారికి కూడా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఎంపీ విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ,
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేస్ కూడా రాకుండా అహర్నిశలు శ్రమించిన మంత్రులు, అధికారులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులు కి అభిననందలు తెలిపారు. కరోనా అంటు వ్యాధి అని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ప్రజల ముంగిటకు వెళ్లి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విదేశాల కన్నా భారత్ లో పారిశుద్ధ్యం సమస్య ఎక్కువ..మన ఇమ్యూనిటీ కూడా ఎక్కువ.. అయినా ఇక్కడ సమష్టిగా అందించే సేవలు వల్లే మనం కరోనా తీవ్రత నుంచి బయట పడ్డాం. పారిశుద్ధ్య కార్మికులు ఈ కిట్లు అంద చేస్తున్నాం..పోలీస్ శాఖ వారికి కూడా ఈ కిట్ లు అంద చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోలగట్ల వీర భద్ర స్వామి, బడుకొండ అప్పల నాయుడు, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి, వైసీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీని వాసురావు, మున్సిపల్ కమీషనర్ వర్మ, ప్రగతి భారత్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...