Followers

రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 


రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు 



- రాజానగరం ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా



కోరుకొండ, పెన్ పవర్



కరోనా విపత్కర పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని
రాజానగరం ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా అన్నారు. మంగళవారం కోరుకొండ పీఏసీఎస్ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని  రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు  చేయడం జరిగిందన్నారు. రైతులకు వెసులుబాటు కల్గించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
 రైతులను ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  రైతు పక్షపాతి అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభిస్తోందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
 కోరుకొండ గ్రామపంచాయతీ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే నూతన విద్యుత్ మోటార్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు.
 ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల శెట్టి సత్యనారాయణ, కోరుకొండ మండల వైసిపి కన్వీనర్ ఉల్లి బుజ్జి బాబు, కోరుకొండ సొసైటీ చైర్మన్  అరుబోలు రామలింగేశ్వరరావు (చినబాబు), కోరుకొండ సొసైటీ కార్యదర్శి జి వి ఎస్ వర్మ, సొసైటీ  మెంబర్స్ ఉల్లి శేషగిరిరావు,  అడబాల గొల్ల బాబు, కోరుకొండ వ్యవసాయ శాఖ ఏడిఏ బి కే మల్లికార్జున రావు, కోరుకొండ వ్యవసాయ శాఖ అధికారి  గౌరీదేవి తదితరులు పాల్గొన్నారు.


హెల్ప్ ది నీడి కు అన్యుహ స్పందన


హెల్ప్ ది నీడి కు అన్యుహ స్పందన


నెల్లూరు, పెన్ పవర్


నిరాశ్రయులకు అండగా నిలిచిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం తరపున  లాక్ డౌన్ సమయం లో నిరుపేదలకు చేయూత అందించటానికి చేపట్టిన హెల్ప్ ది నీడి (Help The Needy) కార్యక్రమమునకు మంచి  స్పందన వచ్చిందని రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణారెడ్డి గారు అన్నారు. మంగళవారం పెన్నానది వడ్డున నివసిస్తున్న 25 కుటుంబాలకు , ఒక్కొక్క కుటుంబానికి 10కేజీలు బియ్యం , 7 రకాల నిత్యావసర సరుకులు  మరియు 4 కేజీల వివిద రకాల కూరగాయలు అందించారు.  తదనంతరం కొండాయపాలెం, నవాబ్ పేట,  ఏ సీ నగర్  మరియు పొదలకూరు రోడ్ లో ఉంటున్న నిరుపేదలకు వస్తుసామాగ్రి అందించారు. ఈ సందర్భముగా డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ   ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి సూచనల మేరకు  రేషన్ కార్డు లేని నిరుపేదలకు విశ్వవిద్యాలయ  ఎన్. ఎస్.ఎస్. ఇటువంటి మంచి కార్యక్రమము చేపట్టటం ఎంతోసంతోషకరమని అన్నారు.  పనితీరును అలాగే కోవిడ్-19 నివారణకు చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వాధికారులందరు ప్రభుత్వానికి సహకరిస్తూ అత్యవసర పరిస్తుతులలో తమవంతు బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. విశ్వవిద్యాలయ  ఎన్. ఎస్.ఎస్. ప్రతి రోజు 60 మంది నిరాశ్రయులకు మరియు వృద్దులకు గడచిన 13 రోజుల నుంచి రాత్రిపూట భోజనమును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే   విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, వివిధ కళాశాలల యాజమాన్యం,ఎన్. ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్. ఎస్.ఎస్ స్టూడెంట్స్ స్వచ్చందంగా ముందుకు వచ్చి సుమారు 75,000/- (డెబ్భై ఐదు వేలు) రూపాయలు దాకా విరాళాలిచ్చారని. ఆ వచ్చిన విరాళాలతో 110 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందించామని అన్నారు.    ఎన్. ఎస్.ఎస్  రాష్ట్రాధికారి డా. రమేష్ రెడ్డి రాష్ట్రములో ఇతర ఏ విశ్వవిద్యాలయం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టలేదని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన  ఎన్. ఎస్.ఎస్   సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం  ను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్  మాట్లాడుతూ తమకు సహకరించి స్వచ్చందంగా ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్  బి. సుధారాణి గారు మాట్లాడుతూ NSS మరియు NCC విద్యార్థులు ఎంతో కష్టపడి తమవంతు బాధ్యతగా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలను చేపట్టటం వలన సమాజాభివృద్ధిలో భాగస్వాములైనట్లేనని అన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొనటం తనకు అదృష్టంగా భావిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమములో NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, సోషల్ వర్క్ అధ్యాపకుడు డా. బి వి సుబ్బారెడ్డి, NSS  ప్రోగ్రాం అధికారి డా. చెంచయ్య  కృష్ణ చైతన్య విద్యాసంస్థల డీన్ బి. సుధారాణి గారు, ప్రిన్సిపాల్ రాజేష్ గారు, NSS ప్రోగ్రాం అధికారి విజయ్ కుమార్ గారు  ఎన్. ఎస్.ఎస్  వాలంటీర్లు పార్ధసారధి, రాజేష్, అఖిల్, చైతన్య  మరియు  శివ తేజ పాల్గొన్నారు.


చికెన్ బిర్యానీ పంపిణీ


చికెన్ బిర్యానీ పంపిణీ


విజయనగరం, పెన్ పవర్



             కరోనా కష్టాల కొనసాగుతున్న దశలో విజయనగరంలోని వైసిపి నాయకులు సరికొత్త పంపిణీకి శ్రీకారం చుట్టారు. పలు పత్రికల ఏజెంట్ , వైసిపి నాయకుడు సుంకరి నారాయణరావు సారధ్యంలో సుంకర వీధికి చెందిన పలువురు నాయకులు చికెన్ దమ్ము బిర్యానీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ వైసిపి నేత పిల్లా విజయకుమార్ మూడులాంతర్ల కూడలి దగ్గర ప్రారంభించారు. విధి నిర్వహణలో నిద్రహారాలకు దూరంగా ఉంటున్న జర్నలిస్టులకు, పోలీసులకు, పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. అలాగే మూడు లాంతర్లు కూడలి సమీపంలో ఉన్న ఆసుపత్రుల్లో రోగుల బంధువులు, ఫుట్ పాత్ లపై జీవనం సాగించే నిరుపేదలతో పాటు, గంటస్థంబం, రైల్వేస్టేషన్, కలెక్టరేట్ కూడల్లలో ఉన్న పేదలకు మొత్తం 700 మందికి ఈ సహకారం అందించారు. దీంతో పలువురు నిరాశ్రయులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.


వందలాదిమందికి అన్నదానం


వందలాదిమందికి అన్నదానం


బిట్రగుంట, పెన్ పవర్


 చిత్తూరు జిల్లా బిట్రగుంట నియోజకవర్గ పరిధిలోని  బోగోలు బృందావన వీధికి చెందిన  పెనుగుల ప్రకాశం  వర్ధంతి సందర్భంగా వారి  కుటుంబ సభ్యులు, కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న విశ్వనాధరావు పేట పంచాయతీ గిరిజనులకు,బిట్రగుంట రైల్వే పనులపై వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన వలసకూలీల కుటుంబాలకు భోజనం పంపిణి చేశారు, ఈ కార్యక్రమంలో పి. ప్రకాశం కుటుంబసభ్యులు, లాయర్ సునీల్, ఏ కే సుందర్ రాజ్, లేళ్ళపల్లి మధుసూధనరావు ,బత్తల రవి, నిర్మల కుమార్, దివ్య తదితరులు పాల్గొన్నారు


అన్నవరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ


అన్నవరం గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ


భీమిలి, పెన్ పవర్


 


భీమిలీ నియోజకవర్గంలోని అన్నవరం గ్రామంలో దివిస్ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ ఆర్కే మినా, దివిస్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొని.. ఏడు వెల మందికి , 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు పలు రకాల వస్తువులను స్థానిక ప్రజలకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. మత్యకారులను ఆడుకుంటున్న ఏకైక  ప్రభుత్వం  వైస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని..మంత్రి వర్యులు తెలిపారు. దివిస్ వల్ల నష్టం పోయిన గ్రామాలకు దత్తత తీసుకొని న్యాయం చేయాలని మంత్రి వర్యులు చెప్పారు.


విశాఖ మన్యంలో  భారీగా వడగళ్ల వాన


విశాఖ మన్యంలో  భారీగా వడగళ్ల వాన.



 స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం (పెన్ పవర్)  


 


విశాఖ ఏజెన్సీలో  పలుచోట్ల  భారీగా వడగళ్ల వాన  కురిసింది. మంగళవారం  మధ్యాహ్నం  ఉరుములు మెరుపులతో  భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు  వడగళ్ళు  కుండపోతగా  కురిసాయి. పాడేరు   జి.మాడుగుల  అరకు  ప్రాంతాల్లో  వడగండ్ల వర్షం  విస్తారంగా కురిసింది. ఎండ తీవ్రత  ఉన్న సమయంలో  అకస్మాత్తుగా  భారీ  వడగళ్ల వాన  కురవడం  విస్మయం కలిగిస్తుంది. కరోనా లాక్ డాన్స్ సందర్భంగా  జన సంచారం అంతగా లేనప్పటికీ  వడగళ్ల వాన తీవ్రత  ఆందోళన  కలిగించింది. పూత  నేలరాలిన ట్లు  వడగళ్ళు  గుట్టలు గుట్టలుగా   నేలపై   కురవడం  వినోదం కలిగించింది.


హత్య కేసులో ముద్దాయి అరెస్ట్


హత్య కేసులో ముద్దాయి అరెస్ట్


మహిళ హత్య కేసులో ముద్దాయి ని అరెస్టు చేసిన జగ్గంపేట పోలీసులు ...


జగ్గంపేట, పెన్ పవర్


 


మార్చి 28 వ తేదీన మహిళను హత్య చేసిన కేసులో నిందితుడును సోమవారం పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ వై రాంబాబు మాట్లాడుతూ  జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలోని అత్తులూరి శ్రీనివాసరావు కు చెందిన జీడి మామిడి తోటలో  కాపలా దారులుగా పనిచేస్తున్న రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు, రంపచోడవరం మండలం సిరికిందలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి అను వీరిద్దరూ ఆ తోటలో కాపలాదారులు గా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి నెల 28వ తేదీ శనివారం నాడు  వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర ఉండాలని చెప్పడంతో అందుకు లక్ష్మి  అంగీకరించకపోవడంతో వెంకటేశులు ఒక్కసారిగా కోపోద్రిక్తుడై కర్రతో విచక్షణారహితంగా కొట్టడం జరిగింది దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె 29వ తేదీ నాడు మృతి చెందినట్లుగా గుర్తించిన  అతడు ఆమె మృతదేహాన్ని వారి స్వగ్రామం రంపచోడవరం మండలం సిరికింతలపాడు తీసుకుని వెళ్లగా మృతురాలి కుమారుడు దీనిని గ్రహించి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జగ్గంపేట సి ఐ వై రాంబాబు, ఎస్ ఐ టి రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,శవ పంచనామా నిర్వహించారు అయితే పరారీలో ఉన్న ముద్దాయిని ఈ నెల 6వ తేదీ ఆదివారం జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ విఆర్వో ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు దీనిపై ముద్దాయిని అరెస్టు చేసి  రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు కావడం జరిగిందని సిఐ రాంబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మంది సాక్షులను విచారించి,పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చార్జిషీట్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుడు గత 20 సంవత్సరాలుగా భార్యను విడిచి దూరంగా ఉండటంతో సిరికింతల పాడు గ్రామానికి చెందిన లక్ష్మి 40.అనే మహిళకు భర్త చనిపోవడంతో ఆమెతో పరిచయం ఏర్పర్చుకొని నిందితుడు వెంకటేశులు లక్ష్మి కలిసి సహజీవనం చేస్తున్న తరుణంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఈ సమావేశంలో జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ గండేపల్లి మండలం ఎస్సైై తిరుపతి రావు పోలీసు సిబ్బంది ఉన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...