Followers

ప్రజా సేవ లో "ప్రధమం"గా ముందుకు పోతున్న  ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ.


ప్రజా సేవ లో "ప్రధమం"గా ముందుకు పోతున్న  ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ.

 

అరిలోవ. పెన్ పవర్.

 

 

విశాఖపట్నంలో లో ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో లో బాధితుల సహాయార్థం మరియు  తమ నిస్వార్థ సేవలందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, ఏఎంజి వెల్ఫేర్ సొసైటీ, తరఫున రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసే వరకు రోజు ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ పి ఆర్ ఓ కిరణ్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నగరంలో 1,2,3,4,5, స్టేషన్లు మరియు గోపాలపట్నం.పెందుర్తి.అరిలోవ. వారిలో స్టేషన్లకు సుమారు రెండు వేల మాస్కులు.సుమారు 200 లు హ్యాండ్ సనిటైజర్ బాటిల్స్. ఒ అర్ స్.మరియు వాటర్ బాటిల్స్. స్వయంగా ఆయా స్టేషన్ ల లో అందజేశారు. కార్యక్రమంలో ఎంజి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.

కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 


కరోనా సాయం, నియంత్రణలో  సక్సెస్ 

 

-- విస్తృత సేవల్లో అనకాపల్లి వైసిపి నాయకులు  

 

-- ఎమ్మెల్యే సహా పలువురి ప్రశంసలు 

 

అనకాపల్లి , పెన్ పవర్  

 

అనకాపల్లిలో కరోనా  సాయం నియంత్రణ అంశాల్లో వైసిపి నాయకులు ముందంజలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. కరోనా  నేపథ్యంలో విదించిన లాక్డౌన్ అమలులో వైసీపీ నాయకుల  పాత్రను కొట్టిపారేయలేం. ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత జగన్మోహన్  రెడ్డి  ఇచ్చిన పిలుపును ఎమ్మెల్యే అమరనాథ్ ఆదేశాలను పక్కాగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.  అనకాపల్లిలో  ఇప్పటి వరకు కరోనా సమస్య కూడా తలెత్తకపోవడం దీనికి అదనపు బలంగా చెప్పుకోవచ్చు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోందనెది అందరికీ తెలిసిందే. ఇటు రాష్ట్రం జిల్లాల్లో  సమస్య అక్కడక్కడ ఆందోళనకు గురి చేసేలా చేస్తుంది.  అనకాపల్లిలో అలాంటి ప్రభావం కానరాకపోవడం చెప్పుకోదగినదిగా కొందరు కితాబిస్తున్నారు. వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలుచేయడంలో పోలీసులదే కీలకపాత్ర. అటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు  చేస్తున్న సేవలు వర్ణనాతీతం.  ఎవరెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అనుకున్న ఫలితం కనిపించకపోతే అటు ప్రభుత్వం పార్టీపైనే ముద్ర పడుతుందన్నది వాస్తవం. దీనిలో  భాగంగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ పార్టీ నేతలకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

        అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే అమర్నాథ్ ఇచ్చిన ఆదేశాలను  క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో వైసిపి నేతలు సఫలమయ్యారనే చెప్పొచ్చు. రెేషన్ డిపోల వద్ద లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సొంత నిధులతో సౌకర్యాలను ఏర్పాటు చేయడం ఇందులో ఒకటి. ప్రధానంగా సామాజిక దూరాన్ని పాటించేలా ప్రజల్లోనే ఉంటూ అవగాహన కల్పించడం చెప్పుకోదగినది. పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ఆదుకోవడంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.   ఆహారం కాయగూరలు వంటివి పంపిణీ చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ కు మంచి పేరు తీసుకొస్తున్నారు. పట్టణ అధ్యక్షులుగా మందపాటి జానకిరామరాజు చేస్తున్న సేవలు ఎక్కువే. అటు పలకా రవి, జాజుల రమేష్ ,కాండ్రేగుల భాస్కర్,  పీలా  రాంబాబులు, గొర్లె సూరిబాబు  తమతమ స్థాయిలో పేదలను ఆదుకోవడంలో ముందుంటున్నారు. వీరికి తోడు అనేకమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు  విస్తృత సేవలు అందిస్తుండటంతో ఇప్పటికైతే కరోనా సమస్య ఇక్కడ కానరాకపోవడం గమనార్హం. 
 

 


 


పేదలకు  సహాయపడాలి 





పేదలకు  సహాయపడాలి 

-ఎమ్మెల్సీ జగదీష్ 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

 

కసింకోట మండలం జమాధులపాలెం గ్రామంలో ఒమ్మి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో 1000 ప్యాకెట్లు కాయకూరలును  ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ చేతులమీదుగా పంపిణీ చేశారు. కరోనా  వైరస్ మూలంగా  లాక్ డౌన్ విధించడం వల్ల పనులకు వెళ్ళలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజల ఇబ్బందులను గుర్తించి సేవా దృక్పథంతో తమకు తోచిన సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి కూరగాయలును పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఇటువంటి విపత్కర సమయములో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఒమ్మి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిన రమణమూర్తి, కనకరాజు ,మొల్లి  రమణ మొల్లి శివ ,వియ్యపు రమణ తదితరులు  పాల్గొన్నారు.


 

 



 

ఎమ్మెల్యే  అమర్ నాథ్  చేయూత 


ఎమ్మెల్యే  అమర్ నాథ్  చేయూత 


 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ జర్నలిస్టులకు చేయూతనందించారు. లాక్డౌన్ నేపధ్యంలో ఆర్థిక ఇబ్బందులును ఎదుర్కొంటున్న  జర్నలిస్టులకు  సోమవారం సహాయం అందించారు. బియ్యం పప్పులు వంటి సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు ఆదుకోవడంలో ముందుంటారన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు లాక్ డౌన్ లో ఎవరు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ప్రయత్నంగా చెప్పారు.  కరోనా  నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ప్రతినిధులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాను సాయం చేయాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పట్టణ అధ్యక్షులు మందపాటి జానకీ రామరాజు, మండల అధ్యక్షులు గొర్లె సూరిబాబు,   యువజన రాష్ట్ర కార్యదర్శి పలకా రవి ,యువజన కార్యదర్శి జాజుల రమేష్, దంతులూరి దిలీప్ కుమార్, మళ్ల బుల్లిబాబు, బీశెట్టి జగన్ , కొణతాల మురళీ తదితరులు పాల్గొన్నారు. 

పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు : ఎమ్మెల్యే అధీప్ రాజు


కరోనా అంతానికి అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బందికి భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు


             పరవాడ పెన్ పవర్

 

పరవాడ:మండలం లోని పోలీస్ స్టేషన్ పరిధిలో కల 100 మంది పోలీసులకు స్వీయ నిర్బంధం(లాక్ డవున్)నిబంధనలు ఉన్న ఏప్రిల్ 14 వరకు మధ్యాన్నం భోజన సదుపాయం ఏర్పాటు చేసిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అధీప్ రాజు.శనివారం నాడు పరవాడ లో ఏర్పాటు చేసిన కార్యక్రంలో పోలీసు సిబ్బంది కి భోజనం పేకెట్లను సర్కిల్ ఇనిస్పెక్టర్ రఘువీర్ విష్ణు కి అందచేశారు.ఎమ్మెల్యే అధీప్ రాజు తన సొంత నిధులతో ఏప్రిల్ 14 వరకు పోలీసు సిబ్బందికి మధ్యాన్నం భోజన సదుపాయం చేస్తున్నట్లు తెలియ చేశారు.కరోనా కారణంగా రాత్రిoభవళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న మండు టెండలో కూడా విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖ సిబ్బందిని అభినoదిస్తూ    ప్రజలందరి తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,వైసిపి   పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల వైసిపి అధ్యక్షుడు సీరిపురపు అప్పలనాయుడు,ఎఫ్ సి ఐ మెంబర్ పయిల సన్యాసి రాజు,స్కూల్ తల్లిదండ్రుల చైర్మన్ పయిల హరీష్,మండల యువజన విభాగం అధ్యక్షుడు పెద్దిసేట్టి శేఖర్,పోలీస్ సిబ్బంది,ట్రాఫిక్ పోలీసు సిబ్బంది,     కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటికి  వెయ్యి రూ నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు


 



కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికి  వెయ్యి రూపాయల  నగదును పంపిణీ చేసిన ఎమ్మెల్యే అధీప్ రాజు


            పరవాడ పెన్ పవర్

 

పరవాడ:మండల కేద్రం సంతబయలు లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డ్ కలిగిన ఇంటికి వెయ్యి రూపాయలు నగదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం విధించిన స్వీయ నిర్బందాన్ని ప్రజలందరూ శహకరించి వారి ఇళ్లలోనే ఉండి కరోనాని సమూలంగా నివారించేందుకు ప్రభుత్వానికి,పోలీసు సిబ్బందికి శహకరించాలి అని కోరారు.ఈ నగదు కోసం ఎవ్వరు బయటికి రావద్దు అని మీ వాలంటీర్లు మీ ఇళ్లకే తీసుకు వచ్చి ఇస్తారు అని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, పెందుర్తి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ అన్నం రెడ్డి అజయ్ రాజ్,జిల్లా వైసిపి కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల వైసీపీ అధ్యక్షుడు సీరిపురపు అప్పలనాయుడు, ఎఫ్ సి ఐ మెంబర్ పయిల సన్యాసి రాజు,పయిల హరీష్,పెద్దిసేట్టి శేఖర్,లబ్ధిదారులు,వాలంటీర్లు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ప్రారంభించిన నగదు పంపిణీ కార్యకమాని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు వలంటీర్ల తో ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డోక్రా సి ఏ చుక్క లక్ష్మీ,యంగ్ మేన్స్ అసోసియేషన్ సభ్యులు పోతల అప్పలనాయుడు,గండి ఈశ్వరావు,గండి సన్యాసి రావు,రొంగలి అప్పాలనాయుడు,గండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 


బొద్ధపు వాని పాలెం లో 350 కుటుంబాలకు కురాగాయలు వితరణ


 


బొద్ధపు వాని పాలెం లో 350 కుటుంబాలకు కురాగాయలు వితరణ చేసిన అట్టా సన్యాసి అప్పారావు,బొద్ధపు శ్రీను


            పరవాడ, పెన్ పవర్

 

మండలం లోని బొద్ధపు వాని పాలెం లోని 350 కుటుంబాలకు 6 రకాల కూరగాయలు 4 కోడిగుడ్లు లను బొద్ధపు శ్రీను తన సొంత నిధులు తో మాజీ సర్పంచ్ అట్టా సన్యాసి అప్పారావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మెడిసెట్టి అప్పారావు,బొద్ధపు లక్షమణ రావు , బొద్ధపు రామకృష్ణ,టిడిపి,జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...