Followers

పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు


పోలీసు సిబ్బందికి ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన పి ఎస్ రాజు


             పరవాడ పెన్ పవర్

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కరోనా నుంచి ప్రజలను కాపాడటం కోసం మండలం పోలీస్  స్టేషన్ పరిధి లోని 76 మంది సిబ్బంది కి వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు కాకీ ఏకరూప దుస్తులను సోమవారం నాడు ఉచితంగా పంపిణీ చేశారు.స్టేషన్ సర్కిల్ ఇంస్పెక్టర్ రఘువీర్ విష్ణు కి ప్రథమంగా దుస్తులను రాజు అందజేశారు.అనంతరం సన్యాసి రాజు మాట్లాడుతూ కరోనా నుండి ప్రజలను కాపాడ టానికి నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది లో ప్రతివక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ప్రజలంతా కూడా పోలీసు సిబ్బంది చెప్పినట్లు వారి ఇళ్లనుంచి బయటకు రాకుండా కరోనా నివారణకు శహకరించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

బ‌హుముఖ‌ వ్యూహంతో ముంద‌డుగు


 



ప‌టిష్ట చ‌ర్య‌ల‌తో సుర‌క్షితంగా ఉన్న జిల్లా
క‌రోనాను అదుపు చేయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యం
34 మండలాల్లో  4587 ప‌డ‌క‌ల‌తో క్వారంటైన్ కేంద్రాలు
ప‌రీక్ష‌ల్లో 23 మందికి నెగిటివ్‌, 43 మందికి పెండింగ్‌
సంక్షేమ ఫ‌ధ‌కాల అమ‌ల్లోనూ ముందంజ‌




విజ‌య‌న‌గ‌రం, పెన్ పవర్ 


 


క‌రోనాకు మందులేదు, నివార‌ణే ఏకైక మార్గం. దీనిని దృష్టిలో పెట్టుకొని,  ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా జిల్లా యంత్రాంగం అలుపెర‌గ‌ని కృషి చేస్తోంది.  ఇత‌ర రాష్ట్రాల‌నుంచి, జిల్లాల నుంచి రాక‌పోక‌ల‌ను పూర్తిగా నియంత్రించడంతో పాటు లాక్‌డౌన్‌ను క‌ట్టుధిట్టంగా అమ‌లు చేస్తోంది. బ‌హుముఖ వ్యూహంతో అధికార యంత్రాంగం చేప‌ట్టిన చ‌ర్య‌ల ఫ‌లితంగా ఇప్ప‌టివ‌ర‌కూ  విజ‌య‌న‌గ‌రం జిల్లా సుర‌క్షితంగా ఉంది.



బ‌హుముఖవ్యూహంఅమ‌లు
         రాష్ట్రంలోని  దాదాపు  అన్ని జిల్లాలూ క‌రోనా కేసుల‌తో వ‌ణికిపోతుండ‌గా, విజ‌య‌న‌గ‌రం జిల్లా ప్ర‌జ‌లు మాత్రం ఈ రోజు వ‌ర‌కూ ధీమాగా ఉన్నారు. వారికి అధికార యంత్రాంగం ఇస్తున్న భ‌రోసాయే దీనికి కార‌ణం. క‌రోనాను ఎదుర్కొన‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగం వివిధ స్థాయిల్లో, అన్ని విధాలుగా స‌న్న‌ద్దంగా ఉంది.  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ మార్గ‌నిర్ధేశ‌క‌త్వంలో ప‌టిష్ట‌మై ప్ర‌ణాళిక‌, బ‌హుముఖ వ్యూహంతో అధికారులు చేప‌డుతున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌నిచ్చాయి.   మందుల్లేని క‌రోనా వ్యాధికి నివార‌ణే మాత్ర‌మే ఏకైక మార్గ‌మ‌న్న‌ది దృష్టిలో పెట్టుకొని, దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో అధికారులు ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా  గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు వేర్వేరు వ్యూహాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నారు. ముందుగా క‌రోనా నియంత్ర‌ణ‌లో నిమ‌గ్న‌మైన అన్ని శాఖ‌ల‌, అన్ని స్థాయిల్లోని అధికారుల‌కూ స‌మ‌గ్రంగా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ, నిఘాను ఏర్పాటు  చేయ‌డం ద్వారా  ప‌రిస్థితిని పూర్తిగా త‌మ అదుపులో ఉంచారు. జిల్లాలో పారిశుద్ద్యం మెరుగు పర్చేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


ప్ర‌త్యేకనిఘావ్య‌వ‌స్థ‌
         హైరిస్క్ ఉన్న వృద్దులు, చిన్న‌పిల్ల‌లు, దీర్ఘ‌కాలిక వ్యాధి గ్ర‌స్తుల‌ను గుర్తించ‌డం, వారి బాగోగుల‌ను తెలుసుకోవ‌డం జ‌రుగుతోంది. అలాగే  ఇత‌ర దేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల‌నుంచి జిల్లాకు వ‌చ్చిన వారిపై ప్ర‌త్యేక నిఘాను పెట్టి, నిరంత‌రం వారి ఆరోగ్యాన్ని వాక‌బు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.  దీని కోసం ఎఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్‌, అంగ‌న్‌వాడీ, వ‌లంటీర్ త‌దిత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ద్వారా స‌మాచారాన్ని తెలుసుకోవ‌డంతోపాటు, వైద్యాధికారుల‌తో సైతం మ‌రోసారి త‌నిఖీలు చేయించ‌డం ద్వారా వారి ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఖ‌చ్చిత‌మైన నిర్ధార‌ణ‌కు వ‌స్తున్నారు.  ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌దిత‌ర ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వారిని క్వారంటైన్‌ సెంట‌ర్‌కు త‌ర‌లించ‌డం, వ్యాధి నిర్ధార‌ణా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం చేస్తున్నారు. ఏ ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికీ కూడా విదేశాల‌నుంచి వ‌చ్చిన‌వారిని, ఢిల్లీ త‌దిత‌ర ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన వారికి కూడా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 66 మందికి వ్యాధి నిర్ధార‌ణా ప‌రీక్ష‌లు చేయ‌గా, 23 మందికి నెగిటివ్ వ‌చ్చింది.  మ‌రో 43 మంది ఫ‌లితాలు ఇంకా రావాల్సి ఉంది.


  మూడు స్థాయిల్లో ఆసుప‌త్రుల వ్య‌వ‌స్థ‌


       మూడు ద‌శ‌ల్లో ఆసుప‌త్రుల వ్య‌వ‌స్థ‌ను కూడా ఏర్పాటు చేసి, ఎటువంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉంది. క‌రోనా వ్యాధి నిర్ధార‌ణ అయిన‌ట్ల‌యితే, చికిత్స‌ను అందించేందుకు నెల్లిమ‌ర్ల‌లోని మిమ్స్ వైద్య క‌ళాశాల‌ను కోవిడ్‌-19 ఆసుప‌త్రిగా సిద్దం చేశారు.  ఇక్క‌డ అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వ జిల్లా కేంద్రాసుప‌త్రిని క‌రోనా  ప్రాధ‌మిక నిర్ధార‌ణ‌కోసం సిద్దం చేసి,  ఇక్క‌డికి వ‌చ్చిన రోగుల‌ను ముందుగా ప‌రీక్షించ‌డం జ‌రుగుతోంది.  అలాగే విదేశాల‌నుంచి, ఇత‌ర ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన‌వారిని, అనుమానితుల‌ను ఉంచేందుకు జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 4587 క్వారంటైన్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.  ముందుగా ఇక్క‌డ 14 రోజుల‌పాటు ఐసోలేష‌న్‌లో ఉంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఉండటానికి అన్నిర‌కాల వ‌స‌తుల‌ను అందుబాటులో ఏర్పాటు చేశారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కూ దాదాపు 500 మందిని క్వారంటైన్ సెంట‌ర్ల‌లో ఉంచి ప‌రీక్షించారు. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రంలో ఆరు ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌ను సైతం కూడా కోవిడ్ ఆసుప‌త్రులుగా సిద్దం చేశారు.

నిత్యావ‌స‌రాల‌పై నిఘా
           లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకున్నారు. దీనికోసం ప్ర‌త్యేకంగా కంట్రోలు రూమును ఏర్పాటు చేయ‌డంతోపాటు, నిరంత‌రం వివిధ స్థాయిల్లోని అధికారులు, వివిధ శాఖ‌లు త‌నిఖీలు చేయ‌డం ద్వారా ధ‌ర‌ల‌ను నియంత్రిస్తూ, స‌రుకులు బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లించ‌కుండా చర్య‌లు చేప‌ట్టారు. అదేవిధంగా సుమారు 15 సంస్థ‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను డోర్ డెలివ‌రీ చేసేందుకు అనుమ‌తినిచ్చారు. జిల్లాలోని 7 రైతు బ‌జార్ల‌ను 18 రైతు బ‌జార్లుగా వికేంద్రీక‌రించ‌డంతోపాటు, వార్డుల్లో సంచార వాహ‌నాల‌కు కూడా అనుమ‌తించడం జ‌రిగింద‌ని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రంలోని చేప‌ల్ మార్కెట్‌ను వేరే ప్రాంతానికి త‌ర‌లించారు. ముఖ్యంగా రైతు బ‌జారువ‌ద్ద‌గానీ, ఇత‌ర మార్కెట్ల వ‌ద్ద గానీ వ్య‌క్తుల‌మ‌ధ్య దూరాన్ని పాటించ‌డానికి ప్ర‌త్యేకంగా మార్కింగ్లు ఏర్పాటు చేశారు.
ప‌టిష్టంగా లాక్‌డౌన్ అమ‌లు


         క‌రోనా నియంత్ర‌ణ‌లో వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, భౌతిక దూరాన్ని పాటించ‌డ‌మే ఏకైక మార్గం. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్‌పి బి.రాజ‌కుమారి నేతృత్వంలో పోలీసు వ్య‌వ‌స్థ జిల్లాలో లాక్‌డౌన్ ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తోంది. రాష్ట్ర స‌రిహ‌ద్దులు, జిల్లా స‌రిహ‌ద్దుల‌ను మూసివేసి, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప జిల్లాలోకి ఎవ‌రీని అనుమ‌తించ‌డం లేదు. జ‌నం ఇష్టానుసారం తిర‌గ‌కుండా  నిరంత‌రం ప‌హారా కాస్తున్నారు. పోలీసులు సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌కు సామ‌ర‌స్య పూర్వ‌కంగా న‌చ్చ‌జెబుతూ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.


స‌హాయ కేంద్రాలు ఏర్పాటు


       లాక్ డౌన్ కార‌ణంగా పేద‌లు, వ‌ల‌స కూలీలు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. జిల్లాలోని దాదాపు అన్ని మండ‌లాల్లో వీరికోసం స‌హాయ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా వీరికి భోజ‌న స‌దుపాయం క‌ల్పించారు. ఎస్‌కోట‌, బొబ్బిలి, విజ‌య‌న‌గ‌రం త‌దిత‌ర కొన్నిచోట్ల ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స తెగ‌లు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. వీరికి అవ‌స‌ర‌మైన ఆహార ప‌దార్ధాల‌ను సైతం అంద‌జేస్తున్నారు.
సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు



        జిల్లాలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ భేషుగ్గా ప‌నిచేస్తోంది. క్షేత్ర స్థాయిలో వీరు అందిస్తున్న సేవ‌ల‌కు అన్ని వ‌ర్గాల‌నుంచీ ప్ర‌శంస‌లు అందుతున్నాయి. వీరి ద్వారా ఈ క‌ష్ట‌కాలంలో సైతం సంక్షేమ ఫ‌లాల‌ను స‌కాలంలో, స‌క్ర‌మంగా పేద‌ల‌కు అంద‌జేయ‌గ‌లుగుతున్నారు.  మొత్తం యంత్రాంగం కృషి ఫ‌లితంగా క‌రోనా సాయాన్ని కేవ‌లం రెండు రోజుల్లోనే ప్ర‌జ‌ల‌ద‌రికీ  అంద‌జేసి, రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది జిల్లా యంత్రాంగం. అలాగే ఉచిత రేష‌న్ స‌ర‌ఫ‌రాలో కూడా విజ‌య‌న‌గ‌రం జిల్లా త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలిపుకుంటూ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఈనెల 1వ తేదీనే సుమారు 93 శాతం మందికి అంటే దాదాపు 3 లక్ష‌ల మందికి తొలిరోజే సామాజిక పింఛ‌న్ల‌ను పంపిణీ చేసింది. ఇలా ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న అన్ని ర‌కాల సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంలో జిల్లా ముందంజ‌లో నిలుస్తోంది.

మ‌రికొద్ది రోజులు స‌హ‌క‌రించాలి ః జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌




        క‌రోనాను క‌ట్ట‌డి చేయడంలో మ‌న జిల్లా ఇప్ప‌టికే దాదాపు విజ‌యం సాధించింది. మ‌రికొద్దిరోజుల‌పాటు ప్ర‌జ‌లు ఇదే స్థాయిలో స‌హ‌క‌రించాలి. రానున్న ప‌ది రోజులూ అత్యంత కీల‌కం. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్దు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో వ‌చ్చిన‌ట్ల‌యితే వ్య‌క్తుల మ‌ధ్య భౌతిక దూరాన్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ముఖానికి మాస్కులు ధ‌రించాలి. త‌ర‌చూ స‌బ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు లాంటి లక్ష‌ణాలు క‌నిపిస్తే ఇంట్లో విడిగా ఉండ‌టంతోపాటు, స‌మీపంలోని వైద్యుల‌ను గానీ, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను గానీ సంప్ర‌దించాలి. క‌రోనాకు మందులేదు. దానిని నివారించ‌డ‌మే ఏకైక మార్గమ‌న్న‌ది ప్ర‌తీఒక్క‌రూ గుర్తించుకోవాలి.  అందుక‌ని ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా న‌డిచి, ప్ర‌భుత్వం చెబుతున్న నిబంధ‌న‌ల‌న్నిటినీ తూచ త‌ప్ప‌కుండా పాటించి జిల్లా యంత్రాంగానికి స‌హ‌కరించాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.


నిత్యవసర వస్తువులు వితరణ


నిత్యవసర వస్తువులు వితరణ


        పాయకరావుపేట,పెన్ పవర్ 

 

 దళితులకు అండాగా నేనున్నాను అంటూ దళిత నాయకురాలు పల్లా దేవి సోమవరం స్థానిక అంభేడ్కర్ కాలనీ వాసుల  కుటుంబంనకు ఐదు కేజీల రైసు,కూరగాయలను ఇంటికి పంపిణీ చేసారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ  కొరానా మహ్మారితో ప్రజలు అల్లాడి పోతున్నారు.లాక్ డౌన్ నేపద్యంలో పనులకు వెళ్ళక కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే డొక్కాడని కష్టజీవులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో  నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు.ఈకార్యక్రమంలో శివ.ఇంజరపు రాజు,మిరియాల రాంజీ,అల్లు నాగు,నందిక సోని,ఎస్ కె,జాను,ఎస్ కే నాగు,తదితరులు పాల్గొన్నారు.

  పేదలకు అహారపోట్లాలు పంపిణి 


 


             పాయకరావుపేట,పెన్ పవర్ 

 

 

 కరోనా  ప్రభావంతో ప్రభుత్వం  డౌన్  ప్రకటించిన నేపద్యంలో స్థానికులు పేదలకు  అండగా వుండిసహకరించుటకు ముందుకు వస్తున్నారు.ఈమేరకు       స్థానిక అంభేడ్కర్ కాలనీకి చెందిన ఇంజరపు శ్రీను  ఆర్థిక సహాయంతో కాలనీ యూత్ సభ్యుబు పట్టణంలో వున్న బిచ్చగాళ్ళకు,నిరుపేదలకు ,పాదచారులకు సుమారు 200 పులిహోర ,మజ్జిగ,వాటర్ ప్యాకెట్లను అందజేసారు.ఈకార్యక్రమంలో ఇంజరపు రాజు, మిరియాల రాంజీ,అల్లు నాగు,నందిక సోని తదితరులు పాల్గొన్నారు.

హిజ్రాల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ


హిజ్రాల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ

 

 అనకాపల్లి, పెన్ పవర్ 

 

 పరిసర ప్రాంతాల్లో పేదవాళ్లకు,  విధులు నిర్వహిస్తున్న అధికారి సిబ్బందికి హిజ్రాలు చేయూతనందించారు . జీవీఎంసీ కార్మికులకు,  పోలీస్ అధికారులకు, అన్నా క్యాంటీన్ లో నివసిస్తున్న బిక్ష వాళ్లకు, కటిక పేదవాళ్లకు, రోడ్డు పక్కన నివసిస్తున్న నిరుపేదలకు సత్యనారాయణపురంలో  నివసిస్తున్న నిరుపేదలకు సోమవారం ఆహారాన్ని పంపిణీ చేసారు . దుర్గ, అనిత , రజిని ఆధ్వర్యంలో 500  మందికి భోజనాలు సమకూర్చారు. కార్యక్రమంలో రంజిత, నందిని, మనీషా, కీర్తి, సంజన, చంటి, మధు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి


 




కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలి


ఎంపీ విజయసాయిరెడ్డి.

స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)

 

కరోనా వైరస్ నిర్మూలనకు  నగర ప్రజలు   సహకరించాలని  ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సోమవారం  బుచ్చి రాజుపాలెం లో  ప్రగతి భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా  మహమ్మారి  నగరంలో  పెరుగుతుందని  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  కోరారు. ప్రభుత్వం కరోనా పై  కఠినమైన చర్యలు  చేపట్టిందని  ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కానీ  ప్రజలు  సామాజిక భద్రత  వ్యక్తిగత దూరం  పాటించాలని కోరారు. అవసరాల నిమిత్తం వెసలుబాటు కల్పించిన  సమయాన్ని  కొందరు దుర్వినియోగం చేస్తున్నారని  అందువల్ల  వైరస్ పెరిగే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా  జిల్లాలో  పాజిటివ్ కేసులు  20కి చేరుకున్నాయని  వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా వైద్యాధికారులను సంప్రదించాలని  సూచించారు. కరోనా వైరస్  పరీక్ష కేంద్రాన్ని  కేజీహెచ్లో  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  ప్రగతి సెక్స్ భారతి పౌండేషన్ తరఫున  పారిశుద్ధ్య కార్మికులు ఇతర వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అరబిందో ఫార్మసీ 10 వేల లీటర్లు  ఫార్మా కంపెనీ 2000 లెటర్లు  హ్యాండ్ వాషర్స ఇచ్చారని  హ్యాండ్ వాషర్స్ ని  పారిశుధ్య కార్మికులు  సిబ్బందికి అందజేస్తామన్నారు. ప్రగతి భారతి పౌండేషన్  సేవలను  విజయనగరం శ్రీకాకుళం  జిల్లాలకు‌  విస్తరిస్తామని  విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాస్   ప్రగతి భారతి ఫౌండేషన్   ప్రతినిధులు  పాల్గొన్నారు.

 

 



 

మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తి తో ఎంవి.పీ యంగ్ స్టార్స్ యూత్









 

 

ఏం.వీ.పీ .కాలనీ, పెన్ పవర్ 

 

 

మానవసేవయే మాధవ సేవ స్ఫూర్తి తో ఎంవి.పీ యంగ్ స్టార్స్ యూత్  సెక్టర్ సిక్స్  వారు పేదలకు , నిరాశ్రయులకు, మధ్యతరగతి కుటుంబాలకు, రోడ్లపై ఉన్న యాచకులకు మీకు మేమున్నాము అని ముందు కొచ్చి 1 - 4 - 20 నుండి 14- 4- 20 20 వరకు  పేదలకు బ్రేడ్స్ ఆహారం మంచినీళ్ల ప్యాకెట్లు వారి సొంత ఖర్చులతో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది  వారి కార్యక్రమమునకు చేదోడుగా విశాఖ పోర్ట్ డాగ్ ఎంప్లాయిస్ అండ్  రెసిడెన్షియల్ సెక్టర్ సిక్స్ వారు మూడురోజుల భోజన సామగ్రిని యూత్ కి అందజేశారు ఇటువంటి సేవా కార్యక్రమం చేయుటలో యువకులను అభినందించటంతో పాటు మీకు ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియచేయటం జరిగింది కాలనీ వాసులు కూడా వారియెక్క సహాయ కార్యక్రమమును అభినందించి ప్రోత్సహాన్ని ఇవ్వటం జరిగింది వారు పేదలకు చేసే సహాయాన్ని గుర్తించి బిజెపి నాయకురాలు డి అరుణ కుమారి 5000 నగదును వారికి అందచేయటం  జరిగింది ఆమె మాట్లాడుతూ ఇటువంటి సేవ కార్యక్రములు చేయటం వల్ల భగవంతుడు  ఆశీస్సులు మీకు వెళ్ళ వేళలా ఉంటాయని కొనియాడారు అలాగే విశాఖ పోర్ట్ డాగ్ ఎంప్లాయిస్ అండ్ రెసిడెన్షియల్ సెక్టార్ సిక్స్ వారు కాలనీలోని ప్రతి నివాసితుల వద్దకు వెళ్లి కరోన పై అవగాహన కల్పిస్తూ మనిషి మనిషి కి మద్య దూరర్ని పాటించాలని ప్రతి ఒక్కరు మాస్కు లను దరించాలి అని అందరికీ ఉచిత మాస్కులు పంపిణీ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పరుశురాం, రాము,, లక్ష్మణ్ రావు, పి. అప్పలరాజు, సత్యం, నరసింహారావు, రజినీకాంత్, ధనరాజ్, అల్లా బక్షు, కాలనీ యువకులు పాల్గొనడం జరిగింది


 

 



 







 




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...