Followers
దయచేసి అందరూ ఇళ్లలోనే ఉండండి
కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి
కరోనా వైరస్ మహమ్మారి ని తరిమికొట్టాలి
ప్రజల కోసం వైసీపీ పార్టీ నిరంతరం పని చేస్తోంది
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నాము.
కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ కి అని చర్యలు పూర్తి.
నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా... చెడు చేస్తున్నారా..
నిత్యావసర వితరణ పేరుతో నాయకులు ప్రజలకు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా
ఒక సామాన్య మానవుడి మనో వేదన
విశాఖపట్నం/ పరవాడ, పెన్ పవర్
కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా గడగడ లాడుతూ స్వీయ నిర్బంధం లోకి వెళ్లి పోతే రాష్టం లో నాయకులు కరోనా ని వ్యాప్తి చేయడానికి రోడ్లెక్కారా అని సామాన్య మానవుడు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వo కరోనా నియంత్రణకు విధించిన స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) న్ని విధించి 17 రోజులు అయ్యింది. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్యులు, వారు ప్రభుత్వ నిర్ణయాల్ని గౌరవించి స్వీయ నిర్బంధం లో ఉండి అనేక సమస్యల తో సతమతమవుతున్నారు. ఒక ప్రక్క నిత్యావసర సరుకులకు దైర్యంగా వెళ్లలేని పరిస్థితి, ఒక వేళ వెళితే పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం ఎటుచూసినా సమస్యల సుడిగుండంలో చిక్కుకు పోయినా... సాయంకోసం చేతులు సాచి ఎదురు చూడవలిసిన పరిస్థితి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సామాన్య ప్రజలను మానవత్వం తో అదుకోవలిసిన పరిస్థితి ప్రభుత్వం మీద ఎంతో ఉంది. ప్రజలు స్వీయ నిర్బంధం లో ఉండి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కారణంగాను కొన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులు రాజకీయలబ్ది కోసమో లేక మానవత్వం తోనో ప్రభుత్వాల తో పాటు వారుకూడా తమ వ్యక్తిగత నిధులు వెచ్చించి స్థానికం గా ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరుకుల ను వితరణ చేయడo తో ప్రజలు ఆ నాయకుల పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ప్రజల అవసరాలకు సరుకులు ఇచ్చే తరుణంలో కరోనాని కానుకగా ఇచ్చే దిశగా వ్యవహరించడం విచారకరం అని సర్వతా సామాన్య జనులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకే కానీ నాయకులకు కరోనా నివారణకు సంభందించిన జాగ్రత్తలు వర్తించవా అనేది సామాన్యుడు వాదన. నిత్యావసర సరుకుల పేరుతో... పార్టీ ప్రచారాలకు వెళ్లినట్లు అధిక సంఖ్యలో జనాలను వేసుకు వెళ్లడం, సామాజిక దూరం పాటించక పోవడం, ఒకరిని ఒకరు అంటుకు ఉండేలా గ్రామాల్లో పర్యటించడం, కొందరు నాయకులు ప్రభుత్వ సహాయాన్ని అందించే కార్యక్రమాలను గుంపులుగా చేయడం లాంటివి చేస్తుంటే... సామాజిక బాధ్యత సమాన్యులకే కానీ వీరికి లేదా అని చెవులు కోరుక్కుoటున్నారు. మానవత్వం తో సహాయం చేయడం ఎంత అవసరమో అది సామాజిక భాద్యత వహించి స్పుహతో తగిన జాగ్రత్తలు పాటించి చేయడం కూడా అంత అవసరమే అనేది సామాన్య ప్రజలు నాయకులకు చేసుకుంటున్న విన్నపం. ఒక విపత్కర పరిస్థిని ఎదుక్కోవాలి అంటే అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే దానినుంచి విముక్తి పొందడం సాధ్యం. అలా కాదని కొందరు మాకేంటి అని బరితెగిస్తే అది వారిని వారి కుటుంబాన్ని సమాజాన్ని నాశనం చేయడానికి దోహదం చేస్తుంది అని గుర్తేరిగీ సత్ప్రవర్తనతో ప్రవర్తించడం సమాజ శ్రేయస్కరం.
కేవీపల్లి మండలం లో దారుణం..
కేవీపల్లి మండలం లో దారుణం..
చిత్తూరు, పెన్ పవర్
ఓ వ్యక్తిపై వాలంటీర్ కత్తితో దాడి
కేవీపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్-19 బాధితుల కోసం ప్రభుత్వం పంపిణీ చేపట్టిన వెయ్యి రూపాయలలో జరుగుతున్న అసమానతలకు పాల్పడుతున్న వాలంటీర్ను.. ఓ వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో తననే ప్రశ్నిస్తావా..? అని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వాలంటీర్.. ఆ వ్యక్తిపై కత్తితో దాడికి దిగాడు.
పూర్తి వివరాల్లోకెళితే.. కేవీ పల్లి మండలం బండ వడ్డిపల్లి వాలంటీర్ శ్రీనివాసులు రూ.1000 పంపిణీలో అసమానతలు పాటిస్తున్నాడు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్..? ప్రభుత్వం మీకు ఇలా చేయమని చెప్పిందా..? అని ఆ గ్రామానికి చెందిన విశ్వనాధ రాజు ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. దీంతో వాలంటీరు తీవ్ర ఆగ్రహంతో ఆ వ్యక్తిపై కత్తితో మెడను నరికి కడుపు పైన రెండు కత్తిపోట్లు పొడిచి తీవ్రంగా గాయపరచాడు. అప్రమత్తమైన కుటుంబీకులు, స్థానికులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
84 వ వార్డు లో స్టానికులకు కూరగాయల పంపిణీ చేసిన వైసిపి నాయకులు
నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి
నగర పరిధిలో గృహము క్షేత్ర పరిశీన నిరంతర ప్రక్రియగా చేపట్టాలి
` జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన
విశాఖపట్నం, పెన్ పవర్
కరోనా వైరస్ నియంత్రణ చేయుటలో అతిముఖ్యమైనవిధిగా రోజువారి గృహముల తనిఖీని క్షేత్రస్ధాయిలో ఏర్పాటు చేసిన బృందాలు తప్పనిసరిగా చేపట్టాని కమిషనర్ డా.జి.సృజన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అందరి జోనల్ కమిషనర్లను, జోనల్ ప్రత్యేకాధికారులను, వార్డు ప్రత్యేకాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారు సూచిస్తున్న, సర్వే కాని, గృహామును వెంటనే సర్వే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వే గూర్చి నిర్దేశించిన యాప్ నందు వివరాలు నమోదు చేయాలని, దీనివలన, ఏదైనా గృహాములో కరోనా వ్తాధిలక్షణాలు కలిగినట్లు కనిపెట్టినచో వీటిని సంబంధిత ఏరియాలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలలోగాని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రాధమిక పరీక్షలు నిర్వహించుటకు అవకాశము ఉంటుందన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులను ఆర్.ఆర్.టి బృందానికి అప్పజెప్పాలని వారు ఆ వ్యక్తిని వాహానం ద్వారా నగరంలో నిర్దేశించిన ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తారని వివరించారు. గృహములలో చేస్తున్న క్షేత్రస్ధాయి సర్వేను నిరంతర ప్రక్రియగా కొనసాగించాని, కరోనా వైరస్ నియంత్రణకు ఇది ముఖ్యసాధనంగా ప్రభుత్వం గుర్తించినందున, ఎటువంటి పరిస్ధితుల్లో సర్వేని ఆపివేయరాదని సూచించారు.
నగర పరిధిలోని ప్రజులు , గృహముల వద్దకు వచ్చిన క్షేత్రస్ధాయి సర్వే బృందాల కు ఎటువంటి దాపరికం లేకుండా వివరాలందించాని, ప్రభుత్వానికి సహకరించాలని, ముందుగానే తెలుసుకోవడం వలన, కరోనా కట్టడికి సాధ్యం అవుతుందని, కావున ప్రజులు జివిఎంసి అధికారులకు, సిబ్బందికి, వైద్యులకు సహకరించి నిజమైన వివరాలను తెలపాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
జివిఎంసి పరిధిలో తెలుపు లేదా బియ్యం కార్డుదారుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1000/` రు ఆర్దిక సహాయాన్ని ఇంకా మిగిలియున్న వారికి త్వరితగతిన అందించాని అందరు జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో జివిఎంసి అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, జివిఎంసి ముఖ్యవైద్యఆరోగ్యశాఖాధికారి కె.ఎస్.ఎన్.ఎల్.జి.శాస్త్రి, జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.తిరుపతిరావు, ఎఫ్.ఎస్.టి బృందసభ్యులు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం మరియు ప్రాధమిక ఆరోగ్య కేంద్రపు డాక్టర్లు, అందరు జోనల్ కమిషనర్లు, జోనల్ ప్రత్యేకాధికాయి, వార్డు ప్రత్యేకా అధికారులు తదితరులు పాల్గోన్నారు.
పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు
పేదల ఆకలి తీరుస్తున్న తొగటవీరక్షత్రియిలు
పెన్ పవర్;జమ్మలమడుగు
దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో రోజు కూలి పనులకు వెళ్లే వ్రృద్దులకు ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి విషమంగా ఉండటంతో తినడానికి కూడా తిండి దొరకని వారికి,అనాధలకు ,వికలాంగులకు జమ్మలమడుగు లోని తొగటవీరక్షత్రియసంఘం మరియు శ్రీ చౌడేశ్వరి దేవాలయం వారి ఆద్వర్యంలో పట్టణం లోని BC కాలని,చౌడమ్మ గుడి,మోరగుడి,గూడుమస్తాన్ దర్గా ,నారాపురం దేవాలయం పరిసరాల్లో ఉన్న పేదవారికి అన్నం,పప్పు,రసం,మంచి నీరు ప్యాకేట్ల పంపిణీ చేశారు, ఈ అన్నదానం ఏప్రిల్ 1నుండి లాక్ డౌన్ చివరి తేదీ అయిన ఏప్రిల్ 14 వరకు ప్రతి రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ అన్నదానం కి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఈ కార్యక్రమంలో బి. పాండులు,భాస్కర్ ,కవలా రామయ్య,పుణ్యమూర్తి,చంద్రగోవిందు, సీ జే పాండు, సీ జే కొండయ్య, గంజికుంట తిరుమలదాసు ,గొరిగె జ్యోతి ప్రసాద్, మోరగుడి గ్రామ వాలంటీరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...