మీడియాను సేవలను గుర్తించిన జనసేన బీజేపీ..
శానిటైజర్లు, మాస్కులు పంపిణీ
మండపేట, పెన్ పవర్
కరోనా మహమ్మారి పై యుద్ధం ప్రకటించిన ప్పటి నుండి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ముఖ్య పాత్ర వహిస్తూ సమాచారాన్ని క్షణాల్లో ప్రపంచానికి చేరవేస్తున్న మీడియా పాత్ర వెలకట్టలేనిదని బీజేపీ , జనసేన నాయకులు కోన సత్యనారాయణ , శెట్టి రవి లు పేర్కొన్నారు. శుక్రవారం జనసేన , బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో విలేఖరులకు మాస్క్ లు , శానిటైజర్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ ఆరంభం నుండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందిస్తున్న సేవలు ప్రతి పౌరుడు గుర్తించుకోవాలన్నారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం , రాజకీయ పార్టీలు , స్వచ్ఛంద సంస్థల తో పాటు ఇతరులు ఎవరైనా కానీ సమాజం కోసం చేస్తున్న సేవలను చిత్రీకరించి చక్కటి కథనాల రూపంలో ప్రపంచానికి తెలియజేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వానికి సహకరించడంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు పడుతున్న కష్టానికి గుర్తించి తాము సాయం చేసినట్లు తెలిపారు. అలాగే ప్రతి రోజూ మాదిరిగా పేదలకు ఆహార పొట్లాలను పంచిపెట్టారు. వాసిరెడ్డి అర్జున్ సమకూర్చిన భోజన ప్యాకెట్ లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కోనాల చంద్రబోస్, బొమ్మన సతీష్, సన్మాల ధనరాజ్, పువ్వల నాని, రమిశెట్టి చిన్న, బండెల ప్రసాద్, ముట్ట రామ్, వనపర్తి చిన్న, వెలగదుర్తి శ్రీను, శెట్టి అవినాష్ నాయుడు, కోనే వీరబాబు, జంగం రామ్ కుమార్, పైడిమళ్ల సతీష్, జక్కా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.