Followers

గుట్కా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

 


          పరవాడ పెన్ పవర్

 

పరవాడ:పరవాడలో అక్రంగా తరలిస్తున్న గుట్కా వ్యాపారి పై టాస్క్ ఫోర్స్ అధికారి కొల్లి సతీష్ ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి మెరుపు దాడి చేశారు.పరవాడ కేంద్రంగా గుట్కా వ్యాపారం విరివిగా సాగుతోంది అన్న సమాచారం తో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటి నుంచో నిఘా వేసినట్లు తెలిపారు.గురువారం నాడు జగదీష్ అనే కిరాణా వ్యాపారి 4 లక్షల 30 వేల రూపాయల నిషేధిత గుట్కా లను ఆటోలో తరలిస్తుండ మారు వేషంలో వచ్చిన అదికారులు రైడ్ చేసి పట్టుకుని సరుకుని ఆటోని సీజ్ చేసి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

గ్రామ ముఖ్య కూడలిలో క్వారంటైన్‌ ఏర్పాటుపై ద్వజం



రావులపాలెం, పెన్ పవర్ 



 నియోజక వర్గ స్థాయిలో కరోనా బాదితులు  పెరుగుతుండడంతో ఇటీవల రావులపాలెంలో బాలుర ఉన్నత పాఠశాలలో క్వారంటైన్‌ నిమిత్తం బెడ్స్‌ ఏర్పాటు చేసారు.  ఇదిలా ఉండగా పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ రూమ్‌కు అరకొర వసతులతో అసంపూర్తిగా ఉండగా కొత్తపేటకు చెందిన కొందరు అనుమానితును తీసుకురాగా గ్రామస్తులు  అడ్డుకొని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.  ఈ సందర్భముగా గ్రామస్తులు   దగ్గరలో అనేక ఆసుపత్రులు ఉన్నాయని, నియోజక వర్గానికి కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి ఉండగా ఎటువంటి సౌకర్యాలు  కల్పించకుండా రావులపాలెం గవర్నమెంటు హై స్కూల్ లో క్వారంటైన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల వైరస్‌ అనుమానితును తీసుకురావద్దని, గ్రామానికి చెందిన వ్యక్తులకు ఎవరికైనా వైరస్‌ సోకితే అటువంటి వారిని చేర్చుకోడానికి దగ్గరగా ఉంటుందని, ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు తీసుకురావడంతో గ్రామస్తులు  ఒకింత భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.  దీంతో అధికారులు  వైరస్‌ అనుమానితును భట్లపాలెం బివిసి కాలేజికి తరలించారు.  ఈ నిరసనలో గ్రామస్తు గొలుగూరి మునిరెడ్డి, డీర్‌ సత్తిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, పడా పరమేశ్వరరెడ్డి, కొండేపూడి రామకృష్ణ, కోనా అంబేద్కర్‌, బొక్కా ప్రసాద్‌, అంబటి గోపి, అంబటి మణికంఠ, అధిక సంఖ్యలో గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.


కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పరిశీలన



 


 కరోనా పాజిటివ్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన జివిఎంసి అదనపు కమిషనర్


విశాఖపట్నం, పెన్ పవర్ 


 జివిఎంసి నాలుగవ జోన్ పరిధిలో గల వార్డు నెంబరు 32, 42 వార్డులలో వచ్చిన కరోనా పాజిటివ్ ప్రాంతాలలో అమలవుతున్న పారిశుద్ధ్య పనులను జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ముఖ్య ప్రజారోగ్య అధికారితో కలసి పరిశీలించారు. సంబంధిత నాలుగవ జోన్ అసిస్టెంటు మెడికల్ ఆఫీసరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్లతో చర్చిస్తూ, పారిశుద్ధ్యం పనులు పై పలు సూచనలు చేశారు. దగ్గరుండి ఆయా ప్రాంతాలలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని అగ్నిమాపక వాహానం ద్వారా స్ప్లే చేయించారు. రోడ్ల మార్జిన వద్ద గల చెత్త బిన్లు నుండి చెత్తను తీసివేసిన తర్వాత, కాలువలలో చెత్తను తొలగించి, ఎత్తివేసిన తర్వాత, బ్లీచింగ్ తో కలిపిన లైమ్ పౌడరును జల్లాలని, పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతం నుండి సుమారు 5 కిలో మీటర్ల వరకు, రసాయన ద్రావణాలను రోడ్లపై వాహానంతోను, ఇరుకు ప్రాంతాలలో ట్యాంకుల ద్వారా జల్లించాలని, బ్లీచింగ్ పౌడరును తప్పనిసరిగా వేయాలని, ఆయా ప్రాంతాలలో ఏమైనా కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు గల గృహములను గుర్తించినచో వెంటనే జోనల్ ఆధికారులకు తెలియపరచాలని, ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ, నోటికి మాస్కులు, చేతికి చొజులు వేసుకొని చాలా అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే తగు కఠినచర్యలు చేపడతామని వారికి హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో క్రమశిక్షణతో పనిచేసి, జివిఎంసి కమిషనర్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాలని, పారిశుద్ధ్య విభాగపు జోనల్ స్థాయి అధికారులను, సిబ్బందిని, కార్మికులను ఆయన కోరారు. ఈ పర్యటనలో సిఎంఓహెచ్ కెఎస్ఎన్ఎ శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ రాజేష్, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, వార్డు ప్రత్యేక ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.


క్వరెంటైన్ కేంద్రంలో మత్స్యకారులను పరామర్సించిన  జే.సి  



 


   జే.ఎన్..టి యు  క్వరెంటైన్ కేంద్రంలో  మత్స్యకారులను పరామర్సించిన  జే.సి   


                    దుప్పట్లు పళ్ళు, సానిటైసర్లు  పంపిణి చేసిన వై.సి.పి నేత మజ్జి శ్రినివాస రావు


విజయనగరం, పెన్ పవర్ 


కర్ణాటక నుండి వచ్చిన  విజయనగరం జిల్లకు చెండిన మత్స్యకారులను సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్  కుమార్   బుధవారం పరామర్శించారు.  వేట నిమితం వెళ్ళిన 85 మంది మత్స్యకారులు సోమవారం రాత్రి జిల్లాకు రాగ వారికీ ప్రాధమికంగా పరీక్షలు నిర్వహించి కారోనా లక్షణాలు లేనప్పటికీ బయట నుండి వచ్చినందున  వారిని 14 రోజుల పటు  క్వరెంటైన్ లో  ఉంచడం జరిగింది.    బుధవారం జే.సి కిషోర్ కుమార్, వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు, అర్ .డి.ఓ  హేమలత  క్వరెంటైన్ లో నున్న వారిని కలిసి మాట్లాడారు.


          జే.సి మాట్లాడుతూ  ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ   ప్రభుత్వ నిబంధనల ననుసరించి నిర్బంధం లో ఉన్హడం జరిగిందని, ఈ నిర్బంధం మీ కోసం, మీ కుటుంభాల కోసం, సమాజం కోసమేనని  హితవు పలికారు.   మీరు ఆరోగ్యంగా మీ గ్రామాలకు వెళ్తే మిమ్మల్ని అందరు గౌరవిస్తారని, లేకుంటే అనుమనంగా చూస్తారని, 14 రోజులు ఉంది వ్యాధిని జయైంచిన గర్వంతో స్వంత వుల్లకు వెళ్ళాలని అన్నారు.


వై.సి.ఫై నేత మజ్జి శ్రీనివాస రావు బాధితులకు దుప్పట్లు, తువ్వాళ్ళు, మాస్క్ లు, శానిటైసర్లు, పళ్ళు  అందించారు.  అనంతరం అయన మాట్లాడుతూ ఏ ఏ గ్రామాలకు చాందిన వారని అడిగారు.  మత్స్యకారులు మాట్లాడుతూ  చింతపల్లి, కొనడ, తిప్పలవలస, ముక్కం గ్రామాలకు చెందినవారమని చెప్పారు.  మీకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని, మాతో సహకరించాలని శ్రీనివాసరావు  కోరారు.  అధికారులంత నిత్యం అందుబాటులో ఉంటూ మిమ్మల్ని   బంధువుల్లా చూసుకుంటారని అన్నారు.  ఎలాంటి అవసరలున్న, వైద్య సహకారం కావాలన్నా తనకు ఒక్క ఫోన్ చేస్తే అన్ని ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు.  వారి వినోదం కోసం పెద్ద టెలివిషన్ ను ఏర్పాటు చేయాలనీ జే.ఎన్.టి.యు యాజమాన్యం తో  చెప్పారు.  అలాగే  నిత్యం పారిశుధ్య పనులు జరగాలని, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు.


ఈ కార్యక్రమం లో  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాల త్రిపుర సుందరి, తహసిల్దార్  సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


మానవ సేవే,,, మాధవ "సేవా"" స్ఫూర్తిగా


ఆరిలోవ . పెన్ పవర్.


తూర్పు నియోజకవర్గం 12వ వార్డు. సేవా స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, మధ్యాహ్న భోజనం అవసరం ఉన్న నిరుపేదలకు. విధి నిరవహణలో విధులను నిర్వహిస్తున్న వారికి, అవసరం మేరకు నిత్యం సుమారు మూడు వందల నుండీ నాలుగు వందల  వరకు . ఆహారం సిద్దం చేస్తున్నారు. 9,10.11.12.13.  వార్డ్ లలో,  విశాలాక్షి నగర్. హనుమంతువాక. ఇందిరా నగర్ .రవీంద్ర నగర్ పెద్దగదిలి.ఆరిలోవ. పైనాపిల్ కాలనీ .అడవివరం. వరకు గల ప్రాంతాలలో సేవా స్ఫూర్తి సభ్యులు ఆహారాన్ని అందజేస్తున్నారు. ఈనెల 28 న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కి స్థానికంగా ఉన్నటువంటి  ఓం సాయిరాం క్యాటరింగ్. అధినేత కె రాజు. పూర్తి సహాయ సహకారాలను  అందజేస్తున్నారు అని. ఆహారం కావలసినవారు ముందుగా, 9703456727. మరియు 7981631404. ఫోన్ నెంబర్లకు  సంప్రదించవచ్చని. ఈ సేవా కార్యక్రమం ప్రభుత్వం ఎత్తివేసే వరకు ఉంటుందని. సేవా స్పూర్తి సంస్థ  అధ్యక్షులు ఒమ్మి అప్పలరాజు తెలియజేశారు.

 

                 

 


 


లాక్ డౌన్ కు సహకరించిన పలువురు యువకులు


 





 

 

సీతానగరం పెన్ పవర్  

 

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా పోలీస్ వారికి సహకారంగా ముదునూరి సురేష్ రాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సీతానగరం సెంటర్ నందు నిత్యావసర సరుకుల కోసం మాత్రమే రావాలని పలు జాగ్రత్తలు పాటించాలని, ఇంటికే పరిమితమై ఉండాలని అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు తిరగకుండా కాపలా కాస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు పలివెల వీరబాబు,ఈలి శ్రీను, చిట్టి సురేష్, వాసు, హేమంత్, మేడిశెట్టి సతీష్ , దుర్గాప్రసాద్, సుంకర నాని, డి వెంకటేష్, మట్ట చిట్టబ్బాయి, ఖాతా శ్రీను తదితరులు పాల్గొన్నారు.


 

 



 

జిల్లాను గజాగజా వణికిస్తున్న కరోనా గుబులు.


జిల్లాను గజాగజా వణికిస్తున్న కరోనా గుబులు.



నిజాముద్దీన్  యాత్రికులు  రాకతో మొదలైన హైటెన్షన్.



నగరంలో 11కు చేరిన కరోనా  పాజిటివ్  కేసులు.



అనుమానితులను ఐసోలేషన్  కేంద్రాలకు తరలింపు.



  స్టాఫ్ రిపోర్టర్   విశాఖపట్నం (పెన్ పవర్)


 


జిల్లాలో కరోనా వైరస్ కేసులు  పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం  అప్రమత్తమైంది. మంగళవారం ఒక్కరోజే  నాలుగు పాజిటివ్ కేసులు   నమోదు కావడంతో  జిల్లా ఉలిక్కిపడింది. ఆరు కేసులు కే పరిమితమైన కరోనా మహమ్మారి  ఒక్కరోజులోనే  11కు  చేరడంతో కోవిడ్ 19 గుబులు వెంటాడుతుంది. ఈనెల 19న  నిజాముద్దీన్ లో  జరిగిన తల్లిక్  జమాత్  మత సదస్సులో  పాల్గొన్న  41 మంది విశాఖ చేరుకున్న విషయం  తెలిసిందే. జమాత్ లొ  పాల్గొన్న  వారికి  కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో  అధికార యంత్రాంగం అప్రమత్తమై  మత యాత్రికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.  పలువురు ఆచూకీ  లభించినప్పటికీ   మిగిలిన వారి కోసం  గాలింపు చర్యలు జరుగుతున్నాయి. జమాత్   లో  పాల్గొన్న   వారు నిజాముద్దీన్ ట్రైన్ లో ప్రయాణం  చేశారు. వారితో పాటు  ప్రయాణం చేసిన  మరికొందరిని కూడా  విశాఖ ఐసొలేషన్ కు  తరలించారు. మాడుగుల జెడి పేట నుంచి  యువకుడిని  మంగళవారం రాత్రి  విశాఖ తరలించారు.  నర్సీపట్నం మంచి ఒక వ్యక్తిని  చెట్టు పల్లి నుంచి మరో ముగ్గురిని తుమ్మపాల నుంచి ఒకర్ని ఐసొలేషన్   హోమ్ కు  తరలించారు. మత సదస్సులో పాల్గొన్న వారిలో  కరొనా కేసులు  నమోదు కావడంతో  వారితో ప్రయాణించిన  ఇతర ప్రయాణికులను కూడా అనుమానిత కేసులుగా  నమోదు చేస్తున్నారు. నిజాముద్దీన్ మత సదస్స యాత్రికులు  జిల్లాలో ఎక్కడెక్కడ తిరిగారు  ఎవరితో కలిశారు  అన్నది  మిస్టరీగా మారింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా మహమ్మరి   నివురుగప్పిన  నిప్పులా మారింది. ఎక్కడ ఎలా  కాల్ టు కేసులు  బయట పడతాయో అన్న  భయం  ప్రజలను వెంటాడుతోంది.  అధికారులు  ప్రభుత్వం   కరోనా నియంత్రణకు  ప్రత్యేక చర్యలు  చేపడుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి   కరోనా తీవ్రతను  ఎదుర్కోటానికి  అధికారులు ప్రజాప్రతినిధులతో  సమావేశాలు  నిర్వహిస్తున్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...