Followers

దాతృత్వం చాటుకున్న సీఐ


ఎస్.కోట, పెన్ పవర్


విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడు శిఖర గ్రామం నుండి కొంత మంది గిరిజన మహిళలు విశాఖపట్నం వెళ్లేందుకు గాను చంటి పిల్లల తో రోడ్డు మార్గం గుండా తే. 03-04-2020 దిన ఎస్. కోట మీదుగా కాలి నడకన  వెళుతుండగా విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారికి ఎస్.కోట  సిఐ శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి, మాస్క్ లు అందించి, భోజన, వాహన సౌకర్యాలను కల్పించి, వారిని విశాఖపట్నంలో దింపేందుకుగాను వాహనాన్ని సమకూర్చి పంపారు.


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించండి :  ప్ర‌ధాని మోదీ


న్యూస్ డెస్క్, పెన్ పవర్


ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.  130 కోట్ల మంది ప్ర‌జ‌ల సామూహిక శ‌క్తి.. ప్ర‌తి ఒక్క‌రిలో క‌నిపించింద‌న్నారు. దేశ‌మంతా ఒక్క‌టై క‌రోనాపై పోరాటం చేసింద‌న్నారు.  ప్ర‌జ‌లు ఈశ్వ‌ర స్వ‌రూప మ‌న్నారు.  కోట్లాది మంది ప్ర‌జ‌లు ఇండ్ల‌ల్లో ఉన్నార‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన నిరాశ నుంచి ఆశ వైపు ప్ర‌జ‌ల్ని తీసుకువెళ్లాల‌న్నారు.  క‌రోనాతో ఏర్ప‌డిన అంధ‌కారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్ర‌స‌రింప‌చేయాల‌న్నారు.  ఏప్రిల్ 5వ తేదీన‌.. 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు.  దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాల‌న్నారు.  ఆ ప్ర‌కాశంతో అంధ‌కారాన్ని పార‌ద్రోలాల‌న్నారు.  మేం ఒంట‌రిగా లేమ‌న్న సందేశాన్ని వినిపించాల‌న్నారు.  ఎవ‌రూ కూడా రోడ్ల‌పై వెళ్ల‌కూడ‌ద‌న్నారు.  సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు. క‌రోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు.  5వ తేదీన ఒంట‌రిగా కూర్చుని మ‌హాభ‌ర‌తాన్ని గుర్తు చేసుకోండ‌న్నారు. 130 కోట్ల ప్ర‌జ‌ల సంక‌ల్పాన్ని ఆలోచించాల‌న్నారు.  గెల‌వాల‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకోవాల‌న్నారు.  మ‌న ఉత్సాహాన్ని మించిన శ‌క్తి ఏదీ లేద‌న్నారు. ఈ ప్ర‌పంచంలో మ‌న‌శ‌క్తితో జ‌యించ‌లేనిది ఏదీ లేద‌న్నారు.


ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి 


నెల్లూరు, పెన్ పవర్


               నెల్లూరు రూరల్ నియోజక ప్రజలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శానిటైజర్లు పంపిణీ చేసారు. బుధవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. కూరగాయల కొనుగోలుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అంతే కాకుండా వివిధ ప్రాంతాల్లో 5 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనవెంట AMC ఛైర్మెన్ ఎంబేటి ఏసు నాయుడు, మిద్దె మురళీ కృష్ణా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


నెల్లూరు జిల్లాలో కోరలు చాచిన కరోనా 


తాజాగా 17 పాజిటివ్ కేసులు నమోదు 


    నెల్లూరు, పెన్ పవర్                                 


నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ కోరలు చాస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇవాళ విడుదల చేసిన కరోనా పరీక్షల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 17 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ 17 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 20 కి చేరింది. 20 కేసుల్లో ఇటలీ నుండి వచ్చిన నెల్లూరు యువకుడు వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. మిగిలిన 19 మంది నెల్లూరు జీజీహెచ్ లోని ఐసోలేషన్ వార్డు లో చికిత్స పొందుతున్నారు. నిన్న వెలుగు చూసిన రెండు కేసులతో పాటూ తాజాగా వెలుగు చూసిన 17 కేసులకు సంబంధీన వారంతా డిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. 


ఇవాళ కేసులకు సంబంధించి నెల్లూరు నగరానికి చెందిన 10 మంది, నాయుడుపేటలో ముగ్గురు, కావలి లో ఇద్దరు, బుచ్చి, ఇందుకూరుపేట లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు. మరో వైపు ఒకే రోజు 17 కేసులు వెలుగు చూడటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ బాధిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకు కలెక్టర్ శేషగిరి బాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు నివాసం ఉండే ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేపడుతున్నారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే రెండు డివిజన్లలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన అధికారులు, మిగిలిన ప్రాంతాల్లో కూడా రెడ్ అలెర్ట్ ప్రకటించనున్నారు. పాజిటివ్ కేసుల బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అనే విషయాలపై ఆరా తీసే వారిని క్వారయింటెన్ సెంటర్లకు తరలిస్తున్నారు. జిల్లాకు సంబంధించి ఇంకా 213 మంది రిపోర్టులు రావల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చర్య‌లు తీసుకున్నాం


ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చర్య‌లు తీసుకున్నాం



క‌రోనాకు మందు లేదు...నివార‌ణే మార్గం



త‌ప్ప‌నిస‌రిగా వ్య‌క్తుల‌మ‌ధ్య దూరాన్ని పాటించాలి



4వ తేదీ నుంచి తెల్ల‌కార్డుదారుల‌కు రూ.వెయ్యి పంపిణీ



రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి


 (బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,  విజ‌య‌న‌గ‌రం)


 


లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు ఎటువంటి ఇబ్బందీ ప‌డ‌కుండా ప్ర‌భుత్వ ప‌రంగా అన్ని ర‌కాల చ‌ర్య‌లనూ తీసుకున్నామ‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి అన్నారు. రైతు బ‌జార్ల వికేంద్రీక‌ర‌ణలో భాగంగా  విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని రాజీవ్ స్టేడియంలో  ఏర్పాటు చేసిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఆమె శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లతో మాట్లాడి కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌పై వాకబు చేశారు. కూర‌గాయ‌ల విక్రేత‌ల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. స్థానికుల‌కు మాస్క్‌లు పంపిణీ చేశారు.


             అనంత‌రం ఉప ముఖ్య‌మంత్రి శ్రీ‌వాణి మీడియాతో మాట్లాడారు.  ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా జిల్లా యంత్రాంగం అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌నూ తీసుకుంద‌ని చెప్పారు. దీనిలో భాగంగానే ప‌ట్ట‌ణంలోని రైతు బ‌జార్ల‌ను వికేంద్రీక‌రించి, ర‌ద్దీ లేకుండా కూర‌గాయాల‌ను ప‌లు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామ‌న్నారు. అలాగే నిత్యం ధ‌ర‌ల‌ను స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేవిధంగా మార్కెట్ల‌లో కూడా వెదురు రింగుల‌తో త‌గిన  ఏర్పాటు చేశామ‌ని, అలాగే ర‌క్ష‌ణా చ‌ర్య‌ల‌ను కూడా తీసుకున్నామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు, విక్రేత‌లు ఇబ్బంది ప‌డ‌కుండా త్రాగునీటి సౌక‌ర్యాన్ని కూడా క‌ల్పించామ‌న్నారు.
         
                      త‌మ ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ముఖ్య‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన నేప‌థ్యంలో, పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా తెల్ల రేష‌న్‌ కార్డు క‌లిగిఉన్న ప్ర‌తీ కుటుంబానికి త‌మ ప్ర‌భుత్వం రూ.1000 అంద‌జేస్తుంద‌ని, ఈ నెల 4వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. ఉచితంగా రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని గ‌త‌నెల 29 నుంచీ ప్రారంభించామ‌ని, ఇప్ప‌టికే దాదాపు 65శాతానికి పైగా పంపిణీ పూర్త‌య్యింద‌ని తెలిపారు. అలాగే వ‌లంటీర్ల ద్వారా సామాజిక పింఛ‌న్లను ఇంటింటికీ పంపిణీ చేసే కార్య‌క్ర‌మం జిల్లాలో తొలిరోజే దాదాపు 93శాతం పూర్తి చేశామ‌ని చెప్పారు. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 3లక్ష‌ల‌, 26వేల మందికి దాదాపు రూ.77కోట్ల రూపాయ‌ల‌ను పింఛ‌న్ రూపంలో పంపిణీ చేసిన‌ట్లు మంత్రి వివ‌రించారు.


                   క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్రప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంద‌ని చెప్పారు. అయితే ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లివ‌చ్చిన వారి వ‌ల్లే రాష్ట్రంలో కూడా అనూహ్యంగా కేసుల సంఖ్య పెరిగింద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, వ్యాధి ఇత‌రుల‌కు వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌భుత్వం కృతనిశ్చ‌యంతో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా త‌మ‌వంతుగా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. క‌రోనాకు మందులేద‌ని, నివార‌ణే ఏకైక మార్గ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తుల‌మ‌ధ్య త‌ప్ప‌నిస‌రిగా దూరాన్ని పాటించాల‌ని, త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుగుకోవాల‌ని కోరారు. లాక్‌డౌన్ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని శ్రీ‌వాణి విజ్ఞ‌ప్తి చేశారు.


                     ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్‌కుమార్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ఎస్‌వ‌ర్మ‌, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, తాశీల్దార్ జిఎస్ఎన్‌మూర్తి, మార్కెటింగ్ ఎడి శ్యామ్‌కుమార్‌, వైకాపా రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, మార్కెట్‌క‌మిటీ ఛైర్మ‌న్ జ‌మ్ము శ్రీ‌నివాస‌రావు, ఇంకా కెవి సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.


నిత్యావసర సరుకులు పంపిణీ







 

 

రంపచోడవరం పెన్ పవర్

 

 ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిషాంత్ కుమార్  ఆద్వర్యంలో   రంపచోడవరం జిసిసి వారు అందజేసే నిత్యావసర సరుకులు వారు సమయానికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అందజేస్తున్నారా లేదా అని సోమవారం రంపచోడవరం మండలం సీతపల్లి గ్రామమునకు వెళ్లి తనిఖీలు నిర్వహించి, ప్రజలు ఎక్కువసమయం నిత్యావసర వస్తువులకోసం ఎదురు చూసే పరిస్థితులు రాకుండా వీలైనంత తొందరగా వారికి అందజేసి పంపించావలేనని జిసిసి డివిజనల్ మేనేజర్ కి ఆదేశాలు జారి చేసారు. అలాగే లోతట్టు ప్రాంతాలలో కూడా ఎవరి ఇబ్బందులు కలగకుండా సమయానికి అందజేయాలని ఆదేశించారు. డి.ఆర్. డిపోలకు వచ్చే ప్రజలు గుంపులుగా కాకుండా ఒక మీటరు దూరం లో నిలబడేలా మార్కింగ్ చెయ్యాలని సరుకులకోసం వచ్చిన వాళ్ళందరూ మాస్కులు దరించేల చూడాలని సూచనలిచ్చారు.  అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు వారి ఆదేశముల మేరకు రాజమండ్రి మరియు రంపచోడవరం డివిజనులకు కోవిడ్-19 (కరోన వైరస్) ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వారిని స్పెషల్ అధికారిగా నియమించినందున రెండు డివిజనులలో ఈ వైరస్ సోకకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికి అవగాహన కల్పించటంతో పాటు ఈ వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ప్రజలు వారి ఇళ్లలోనే ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులకు ఆదేశాలు జారిచేశారు. జి.ఎస్.ఎల్. రాజానగరం ఆసుపత్రికి స్పెషల్ అధికారిగా నియమించినందున అక్కడ అన్ని వసతులు అందుబాటులో వున్నయలేదా ఇంకేమేనైన అవసరలున్నాయా అని విజిట్ చేసి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కోవిడ్-19 (కరోన వైరస్) సోకిన రోగులకు అవసరమైన ఏర్పాట్లను చేయడంతో పాటు, ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం జరిగిందని, వారిని చికిత్స నిమిత్తం తీసుకొని వెళ్ళే మార్గమును కూడా చేయడం జరిగిందని తెలియజేసారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇలానే అందరు జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ నుండి విముక్తి పొందవచ్చునని తెలిపారు. ఇక్కడ పరిస్థితులను ఏరోజుకారోజు కమిషనరు వారికి అందజేస్తూ ఎక్కడ ఎలాంటి అత్యవసర సేవలు అసరమైన తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.


 




 

 


 



 



ధర్మకర్తల ఆధ్వర్యంలో సీతా రాముల కళ్యాణం


 

 

            రావులపాలెం , పెన్ పవర్          

 

 రాష్ట్ర వ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో  రాష్ట్ర ప్రభుత్వం లాక్ డోన్ ప్రకటించడంతో భక్తులెవరు లేకుండా  ఆలయ పూజారులు,  ధర్మకర్తల  ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.గురువారం రావులపాలెం గ్రామంలో ముసలి రామాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణం భక్తులు లేకుండా ఆలయ అర్చకులు జనార్దన కేశవమూర్తి భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఐతే లాక్ డోన్ వలన  మొట్టమొదటిసారి భక్తులు లేకుండా స్వామివారి కల్యాణం నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి తెలిపారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...