Followers

సంప్ర‌దాయ‌బ‌ద్దంగా రామ‌తీర్ధం సీతారాముల క‌ల్యాణం



సంప్ర‌దాయ‌బ‌ద్దంగా సీతారాముల క‌ల్యాణం
ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎంఎల్ఏ బ‌డ్డుకొండ దంప‌తులు



రామ‌తీర్ధం (విజ‌య‌న‌గ‌రం), పెన్ పవర్ 


 నెల్లిమ‌ర్ల మండ‌లం రామ‌తీర్ధంలోని ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం  శ్రీ సీతారామ‌స్వామి ఆల‌యంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌లు క‌న్నుల పండువ‌గా జ‌రిగాయి. సంప్ర‌దాయబ‌ద్దంగా అభిజిత్ ల‌గ్నంలో  సీతారాముల క‌ల్యాణాన్ని చూడ‌ముచ్చ‌ట‌గా నిర్వ‌హించారు.  నెల్లిమ‌ర్ల ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు స‌తీస‌మేతంగా ఈ వేడుక‌ల్లో పాల్గొని, స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. కొద్దిమంది అధికారులు, ఆల‌య పూజారులు మిన‌హా, భ‌క్తుల‌ను వేడుక‌ల‌కు అనుమ‌తించ‌లేదు.


.        క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌టంతో అతికొద్ది మంది అతిధుల న‌డుమ రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను గురువారం నిరాడంబంరంగా నిర్వ‌హించారు. సంప్ర‌దాయ బ‌ద్దంగా ప్ర‌భుత్వం త‌ర‌పున ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు శ్రీ‌ సీతారామస్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను స‌మ‌ర్పించారు. అప్ప‌ల‌నాయుడు దంప‌తుల‌ను ఆల‌య పూజారులు ఆశీర్వ‌దించి, ప్ర‌సాదాన్ని అంద‌జేశారు.


        అనంత‌రం శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని కేవ‌లం ఆల‌య పూజారులు, దేవ‌స్థానం అధికారులు మాత్ర‌మే నిర్వ‌హించారు. స్వామివారికి ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ప‌ట్టువ‌స్త్రాల‌ను, ముత్యాల త‌లంబ్రాల‌ను అలంక‌రించి వైభ‌వంగా క‌ల్యాణాన్ని జ‌రిపించారు. అదేవిధంగా ఆన‌వాయితీ ప్ర‌కారం సింహాచ‌లం వ‌రాహ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం నుంచి కూడా సీతారామ‌స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలను దేవ‌స్థానం అధికారులు అంద‌జేశారు.  ఈ వేడుక‌ల‌ను తిల‌కించేందుకు సాధార‌ణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌న‌ప్ప‌టికీ, ఎప్ప‌టిలాగే శాస్త్రోక్తంగా, సంప్ర‌దాయానుసారం వైభ‌వంగా నిర్వ‌హించారు.


        క‌రోనామ‌హమ్మారినుంచి ప్ర‌పంచాన్ని ర‌క్షించాలి: బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, ఎంఎల్ఏ
మాన‌వాళిని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌పంచాన్ని ర‌క్షించాల‌ని ఆ శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని ప్రార్ధించిన‌ట్లు ఎంఎల్ఏ బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు చెప్పారు. ఆల‌యం వెలుప‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, క‌రోనాపై నిర్వ‌హిస్తున్న పోరాటంలో కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు సీతారాములు అండ‌గా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. ప్ర‌భుత్వ ఆదేశాను సారం, క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా ఈ ఏడాది అతికొద్ది మంది స‌మక్షంలో రామ‌తీర్ధంలో శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకొని భ‌క్తుల‌ను వేడుక‌ల‌కు అనుమ‌తించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, సంప్ర‌దాయానుసారం క‌ల్యాణాన్ని, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను హిందూ ధ‌ర్మాన్ని అనుస‌రించి ఆచార‌, సంప్ర‌దాయాల ప్ర‌కారం వైభ‌వంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని అన్నారు.


      ఈ కార్య‌క్ర‌మంలో సీతారామ‌స్వామివారి దేవ‌స్థానం ఇఓ కిషోర్‌కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన పూజారి సాయిరామాచార్యులు, ఇత‌ర ఆల‌య పూజారులు, సింహాచ‌లం దేవ‌స్థానం ఇఓ మారెళ్ల వెంక‌టేశ్వ‌ర్లు, ఆయ‌ల పూజారి గోపాల‌కృష్ణ‌మాచార్యులు, నెల్లిమ‌ర్ల ఎంపిడిఓ రాజ్‌కుమార్ తదిత‌రులు పాల్గొన్నారు.


జర్నలిస్టుల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ.





 

శ్రీకాకుళం, పెన్ పవర్ 

 

.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో అలుపెరుగని సేవలు అందిస్తున్న... పోలీసులకు...వైద్య ఆరోగ్య శాఖ మరియు మున్సిపల్ కార్మికులు... నిరుపేదలకు గురువారం శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుల ఐక్యవేధిక ఆధ్వర్యంలో ఆహారపోట్లాలు.. మంచినీరు.. మజ్జిగ అందించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లుగా పేరుగాంచిన ఏడురోడ్లు జంక్షన్, అరసవల్లి జంక్షన్.. డే అండ్ నైట్ జంక్షన్...పాతబస్ స్టాండ్ కూడళ్ళు వొద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మరియు పారిశుద్ధ్య కార్మికులు... నిరుపేదలకు చక్కని ఆహారాన్ని అందించారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా కరోనా విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు... సిబ్బందికి ఆహార కొరత లేకుండా చేయుటకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జర్నలిస్టుల ఐక్యవేధిక ప్రతినిధులు కొంఖ్యాన వేణుగోపాల్, శాసపు జోగినాయుడు లు చెప్పారు. ప్రతినిత్యం తాజా ఆహారాన్ని అందిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రౌతు సూర్యనారాయణ, సీపాన వెంకటరమణ, నేతల అప్పారావు, కొంఖ్యాన శంకర్, భేరి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

 

 



 

ప‌ట్టెడ‌న్నం అదింతే ప‌ట్ట‌నంత సంతోషం



రామ‌న్న అన్న‌దాన క్ర‌తువు లో ఐదో రోజు

యువ ఎంపీని అభినందిస్తున్న  తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు


శ్రీ‌కాకుళం , పెన్ పవర్


భ‌వానీ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ నేతృత్వాన చేప‌ట్టిన రామ‌న్న అన్న‌దాన క్ర‌తువు గురువారంతో నాల్గో రోజుకు చేరుకుం ది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర‌క‌టించినందున అన్నార్తుల‌కు, రిమ్స్ రోగుల‌కు ప‌ట్టెడ‌న్నం పె ట్టేందుకు యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్ణ‌యించారు. ముఖ్యంగా రిమ్స్ రోగులకు వారి స‌హాయ‌కుల‌కు అ న్నం అందక ఆక‌లితో అలమ‌టిస్తున్న వైనం పై ఎంపీ వెనువెంట‌నే స్పందించి క‌లెక్ట‌ర్ తో చ‌ర్చించి త‌న త‌ర‌ఫున వారిని ఆదుకు నేందుకు ఈ క్ర‌తువుకు శ్రీ‌కారం దిద్దారు. రామ‌సేన స‌భ్యులు, ప్ర‌జాసద‌న్ నిర్వాహ‌కుల స‌మ‌ష్టి కృషితో గ‌డిచిన మూడు రోజులూ వీరు అందిం చిన భోజ‌న‌మే వారి ఆక‌లి తీర్చింది. ముఖ్యంగా బుధ‌వారం నుంచి రాత్రి వేళల్లో కూడా భోజ‌నం అందించేందుకు ఎంపీ రామూ నిర్ణ యించ‌డంతో ఇంకాస్త స‌మ‌స్య ప‌రిష్కారం అయింది. దీంతో రోగులూ, అన్నార్తులూ ఆనందం వ్య‌క్తం చేశారు. తమ గోడు ఎవ్వ‌రికీ ప ట్ట‌ని నేప‌థ్యాన ఎంపీ రామూ ఆదుకోవ‌డం ఎంతో అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ రామూ మాట్లా డుతూ దేశ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోల వాతావర‌ణం  ఉన్నందున నిరాశ్ర‌యులకూ, అన్నార్తులకూ ఈ పండుగ వేళ పట్టెడ‌న్నం పెట్ట‌డం త‌న‌కెంతో ఆ నందంగా ఉంద‌ని చెప్పారు. అంద‌రికీ శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. 


 

 

కాళ్ల పోలీస్స్టేషన్లో  కరోనా కలకలం ...   


 

పెన్ పవర్, భీమవరం

 

 

భీమవరం రూరల్ పరిధిలోని కాళ్ల పోలీస్స్టేషన్లో కరోనా కలకలం రేగింది.  పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్  ఇటీవల ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి రావడంతో అతని కుమారునికి కరుణ పాజిటివ్  వచ్చింది.  దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.  స్టేషన్ లోని 19   మంది సిబ్బందిని  హోం  క్వారెంటైన్  కు పంపారు.  మొత్తం మీద ఢిల్లీ జమాతే   ప్రార్థనలు  జిల్లా ప్రజలను భయా భ్రాంతులకు గురి చేశాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు

ఢిల్లీ కరోనా కలకలం తో పరుగులు తీస్తున్న నాయకులు అధికారులు







                    పరవాడ, పెన్ పవర్

 

ఢిల్లీ జమాత్ కు వెళ్లి వచ్చిన రబ్బానీ అనే వ్యక్తి శుక్రవారం నాడు పరవాడ లో కల మసిద్ లో జమాత్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూడటం తో పరుగులు పెడుతున్న స్థానిక నాయకులు,అధికారులు. స్టీల్ ప్లాంట్ సెక్టార్-5 లో నివసిస్తున్న మహమ్మద్ రబ్బానీ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగిగా పనిచేస్తూ హాజరత్(బోధకుడు)గా జమాత్(ప్రవచం)చేస్తూ ఉంటారు ఈయన ఢిల్లీ లో నిజాముద్దీన్ లో జరిగిన జమాత్(మతప్రార్ధనలు)కు వెళ్ళివచ్చిన విషయం, స్పెషల్ బ్రాంచికి చెందిన అధికారులు సోమవారం అదుపులోకి తీసుకుని విశాఖ చెస్ట్ హాస్పటల్ కి తరలించారు.అక్కడ ఆయనకు కోవిడ్-19 తనికికి రక్త నమూనాను సేకరించి పంపించారు.రక్త పరీక్ష యొక్క రిజల్ట్ రావలిసి ఉన్నది.రబ్బానీ ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడ ఎక్కడ వెళ్లారు అని అడగగా పరవాడ మసిద్ లో జమాత్ కి వెళ్లినట్లు అధికారులకు తెలియ చేశారు.ఈ విషం మండల పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలియచేయడంతో ఎమ్మార్వో గంగాధర్ హుటా హుటిన మసీదు ప్రాంతానికి వచ్చి స్థానిక ముస్లిం సోదరులను విచారణ చేస్తుండటం తో పరవాడ గ్రామం ఒక్క సారిగా ఉలిక్కి పడింది.అధికారులు రిబ్బాని జమాత్(మత ప్రార్ధన)వెళ్లిన వారి నందరిని స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలి అని ఆదేశించారు.స్థానిక మత ప్రార్థనా మందిరాల్లో ఇటువంటివి జరగక కుండా నాయకులు అంతా అధికారుల మీద వదిలి వేయకుండా తాముకుడా పట్టించుకోవాలి అని గ్రామ ప్రజలు కొరితున్నారు.



 

 


 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పిలుపుతో దాతల ముందడుగు





 

సమకూరిన రూ.20 లక్షలు నగదుని చెక్ ల రూపంలో విశాఖ నగర సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీసు ) ఆర్.కే మీనాకు అందజేత

 

విశాఖపట్నం, పెన్ పవర్ 

 

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోన నియంత్రణకు పలువిధాలుగా తోడ్పాటు నందిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో కరోన కట్టడికి తనవంతు సహాయంగా  రూ. 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ అడుగు ముందుకు వేసి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోన నియంత్రణలో భాగంగా డాక్టర్లు, పారిశుధ్య కార్మికుల సేవలను పొగిడిన ఆయన , తాజాగా పోలీసులకు తోడ్పాటునందించారు. రాత్రనకా, పగలనకా పహారా కాస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడి, అటు కేంద్రం ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఆదేశాలను తూ.చా తప్పకుండా విధులు నిర్వహిస్తున్న రక్షక భటుల కై నడుంబిగించారు. తన పార్లమెంట్ పరిధితో పాటు పలువురిని ఈ విషయంపై జాగృతాపరుస్తూ పోలీసులకు నిధులు సమకూర్చారు. ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ లో విష్ణు కెమికల్స్ అధినేత సీ.హెచ్ కృష్ణమూర్తి రూ.10లక్షలు ,  వాల్తైర్  క్లబ్  రూ.5లక్షలు, చిరుకూరి ఎస్టేట్ అధినేత చిరుకూరి శ్రీనివాస్ రూ. 2లక్షలు, సాయనాస్ కన్స్ట్రక్షన్ నుంచి ఎల్. రామారావు , ఎస్. శ్రీనివాసులు రూ. 1లక్ష , రాక్ డేల్ హోటల్ , వెంగమాంబ స్టోన్ క్రషర్ నుంచి శ్రీనివాస్ , ఆదిశేషయ్యలు సంయుక్తం గా రూ.1 లక్ష ,హనీ గ్రూప్స్ అధినేత ముక్కా ఓబులరెడ్డి రూ.1లక్ష చొప్పున మొత్తం రూ.20 లక్షల రూపాయలను చెక్ రూపంలో  విశాఖ ఎంపీ సమక్షంలో విశాఖ నగర కమిషనర్ ఆర్.కే.మీనా కు, ఆయన కార్యాలయం లో అందజేశారు. ఈ మొత్తాన్ని పోలీసు అవసరాలకు వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎంవీవీ మాట్లాడుతూ పోలీసు లు విధినిర్వహణలో చూపుతున్న చొరవను అభినందించారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి , ఇతోధికంగా తోడ్పాటు నివ్వాలని పిలుపునిచ్చారు. నగర పరిధిలో సీపీ మీనా చేపడుతున్న కరోన నియంత్రణ చర్యలను అభినందించారు


 

 



 

గోవాడ షుగర్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి 


అనకాపల్లి, పెన్ పవర్ 

 

శారద నదిని కలుషితం చేసి వేలాది మంది ప్రజలు ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తూ గోవాడ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం పై జీవీఎంసీ వారు అంటువ్యాధుల నిరోధక చట్టం ద్వారా కేసు నమోదు చేయాలని జోనల్ కమిషనర్ ను  శాసనమండలి సభ్యులు   బుద్ధ నాగ జగదీశ్వరరావు కోరారు. ప్రస్తుతం శారదా నదిలో నీటి ప్రవాహం లేదని అక్కడక్కడ మాత్రమే నీరు ఉంటుందని ఇటువంటి తరుణంలో వేలాది  గ్యాలన్ ల నీరు,విషపూరిత వ్యర్ధ జలాలను ఫ్యాక్టరీ యాజమాన్యం నదిలోకి విడిచిపెట్టి నదీ  పరివాహక ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని నాగ జగదీష్ ఆగ్రహం వ్యక్తపరిచారు.

ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత ప్రజలను భయాందోళనకు రేకెతికిస్తున్న తరుణంలో ఫ్యాక్టరీ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు జీవీఎంసీ అధికారులు అలసత్వానికి నిదర్శనమని వ్యర్థ జలాలు తాగునీటి బోర్లు వద్దకు చేరి భూగర్భ జలాల్లో చేరి డయేరియా,కలరా వంటి వ్యాధులుతో పాటు అనేక చర్మ వ్యాధులకు గురి కాక తప్పదని నదీ గర్భంలో గల మత్స్య సంపద మొత్తం చనిపోయినందున చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు కొన్ని నెలలపాటు పస్తులు ఉండక తప్పదని తెలిపారు ప్రస్తుతం నదిలో కలిసిన వ్యర్ధ జలాల యొక్క తీవ్రత తగ్గాలంటే తక్షణమే రైవాడ రిజర్వాయర్ నందు గల నీరు సర్దార్ నదిలోకి విడిచిపెట్టి తాగునీటికి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు ఫ్యాక్టరీ యాజమాన్యం పై రాష్ట్ర కాలుష్య నిరోధక మండలి కేసులు నమోదుచేసి విచారణ కమిటీని వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు దీనిపై శాసన మండలి జరిగే సమయంలో చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...