మా ఎంపి త్వరగా కోలుకొని ప్రజా సేవ చేయాలి
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు.
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ ఎం పి మాలోత్ కవిత శుక్రవారం కరోనా నిర్దారణ పరీక్ష చేసుకోగ ఆమెకుకరోనా పాజిటివ్ గా నిర్దారణ అయుంది. దీనితో ఆమె కరోనా నుండి త్వరగా కోలుకోవాలని మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం తారసింగ్ బావి తండాలో గల హనుమాన్ గుడిలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కవితక్క అభిమాని కొయ్యడి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, నిరంతరం ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడే మా ఎం పి మాలోత్ కవితక్క కరోనా నుండి త్వరగా కోలుకొని మహుబూబాబాద్ ప్రజలకు సేవ చేయాలని ఆంజనేయస్వామి ని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కొయ్యడి వెంకన్న గౌడ్, కవితక్క అభిమానులు, తండావాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment