నాడు నేడు పనుల్లో ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో పనుల సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో
పెన్ పవర్, ఆత్రేయపురం
ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన జరిగిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమావేశంలో అంగన్వాడి సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో జరిగిన తల్లుల కమిటీ సమావేశంలోను పాల్గొన్న ఎంపీడీవో పాఠశాలలో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నందున విద్యార్థుల తప్పనిసరిగా మాస్క్ లు ధరించేల చూడాలి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న మొదటి దశ నాడు-నేడు పనులు తుది దశలో ఉన్నందున వెంటనే అందరు ప్రధానోపాధ్యాయులు సంబంధిత బిల్లులు ఆన్లైన్లో పొందుపరచాలి.
ఎంపీడీవో నాతి బుజ్జి అన్నారు అలాగే మండలంలో ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో నూతనంగా మంజూరు అయిన నాడు నేడు పనులు ఏ విధంగా చేయాలనే విషయంలో తల్లుల కమిటీలకు శిక్షణ ఇచ్చారు పనులు పారదర్శకంగా నాణ్యతాగా చేయాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు తెలిపారు ఈ సమావేశంలో ఎం ఈ ఓ వరప్రసాద్ రావు, సూపర్వైజర్ కుమారి, నాగవేణి సుల్తానా బేగం, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అంగన్వాడి టీచర్లు తల్లులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment