Followers

అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి

 అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి  స్వాత్మానందేంద్ర సరస్వతి

విశాఖ ఉత్తరం, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ 48 వ వార్డు బర్మా క్యాంప్ జైభారత్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం లో జరుగుతున్న కొత్త అమావాస్య ఉత్సవాలు సందర్బంగా అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో స్వామి వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జై భారత్ నగర్ గ్రామ అధ్యక్షుడు డాక్టర్ బొగ్గు శ్రీను, ఆలయ కమిటీ ప్రతినిధులు,బొగ్గు శ్రీను మిత్రమ మండలి సభ్యులు, శ్రీరామ్ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు పిల్లి రాజు,పుక్కళ్ళ ప్రసాద్, మరియు అధిక సంఖ్యలో యువత, మహిళలు భక్తులు, తదితరులు పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి బొగ్గు శ్రీను కుటుంబ సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి స్వాత్మానందేంద్ర స్వామి వారు బొగ్గు శ్రీను దంపతులను ఆశీర్వదించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాదరావు,ఆలయ ప్రధాన అర్చకులు బుచ్చిబాబు శర్మ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...