Followers

డోంకరాయిలో భారీగా గంజాయి పట్టివేత

 డోంకరాయిలో భారీగా గంజాయి పట్టివేత

మోతుగూడెం,పెన్ పవర్

వైరామవరం మండలం డోంకరాయి పోలీస్ స్టేషన్ దగ్గర గురువారం రెండు వేల కేజీల గంజాయి పట్టుబడినది డోంకరాయి ఎసై జి వెంకటేశ్వరరావు తెలియజేసిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ జి వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయుచుండగా సీలేరు వైపు నుండి హైదరాబాద్ వైపువెలుతున్న ఎంపి17సిసి4413 అను నంబర్ గల వెటెరో కారు ఆపి విచారిస్తుండగా దాని వెనుకనే ఎపి22ఎక్స్2609 అను నంబర్ గల హైచర్ వాహనం ఆపి తనిఖీ చేయగా వాహనంలో రెండు వేల కేజీల గంజాయి గుర్తించమని దాని విలువ సుమారు ఆరవై లక్షల రూపాయలు ఉంటుందని నిందితులను విచారించగా ముందు వచ్చిన కారు కూడా వీరిదే అని మొత్తం రెండు వాహనాల్లో ఏడుగురు వ్యక్తులను గుర్తించమని వారు మన్జీత్ డాలి,అమిత్ సింగ్, సుమంత్ మండల్, రవీంద్రనాథ్ మిస్త్రీ,సుజిత్ మండల్ విరు ఒరిస్సా రాష్ట్రంలోని కలిమెలకు చెందిన వారు పవన్ మనోహర్ దుంబ్లి, కర్నాటక రాష్ట్రంలోని జిమ్ కాండి మరియు మహ్మద్ జిలాని హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారని ఈ గంజాయిని సీలేరు నుండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కు తీసుకొని వెళుతున్నట్లు నిందితులు తెలిపారని రెండు వేల కేజీల గంజాయిని మరియు వాహనలను స్వాధీనపరచుకొని నిందితులను అదుపులోకి తీసుకుని రంపచోడవరం కోర్టులో హాజరు పరుస్తామని డోంకరాయి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...