ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేసుకోవాలి
వైద్యాధికారి డాక్టర్ రవి
చిన్నగూడూరు, పెన్ పవర్చిన్న గూడూరు మండలంలోని గుండారాజుపల్లి గ్రామంలో శనివారం నాడు ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గుగులోత్ రవి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ... గుండం రాజు పల్లి గ్రామంలో 25 మందికి కరోనా పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్ రావడం జరిగిందన్నారు. అదేవిధంగా విస్సంపల్లి గ్రామంలో ముగ్గురికి చిన్నగూడూరు గ్రామంలో ఇద్దరికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని అన్నారు. చిన్నగూడూరు మండలంలో మొత్తం 16 పాజిటివ్ కేసులు వచ్చినట్లు డాక్టర్ రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కరోనా రెస్పాన్ టీమ్ ,ఎంపీడీవో, తహసిల్దార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment