కరోనా వ్యాక్సిన్ వేగవంతం
పెన్ పవర్, ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో 45 సంవత్సరాల వయసు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులుగా గుర్తించారు దేశంలో పలు రాష్ట్రాలలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పవచ్చు ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శనివారం కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రారంభించారు ఈ రోజు 45 సంవత్సరాలు దాటిన వారు 50 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు డాక్టర్ దుర్గ భవాని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని జనంలో అపోహ తొలగిపోవాలని డా. భవాని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ భాగ్యలక్ష్మి అన్నపూర్ణ పాల్గొన్నారు.
No comments:
Post a Comment