ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ కల్పించిన మహానుభావుడు అంబేద్కర్
ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత
ఆదిలాబాద్ , పెన్ పవర్ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని నిలపడంలోను,అలాగే దేశ ప్రజలందరూ స్వేచ్చగా జీవించడానికి భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నిదర్శనమని ఏఐసీసీ సభ్యురాలు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్రత్ సుజాత అన్నారు.రాజ్యాంగ నిర్మాత,భారత రత్నడాక్టర్ బీ,ఆర్ అంబేద్కర్ 130వ జయంతి ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, కొండ గంగాధర్, వెంకట్ రెడ్డి, సామ రూపేష్ రెడ్డి, రాహుల్, గంగన్న, అశోక్, షకీల్, సమీర్, విట్ఠల్, జాబీర్, మోతీరాం, గణేష్, అబ్దుల్ గఫ్ఫార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment