Followers

కరోనాతో ముంచుకొస్తున్న ముంపు

 కరోనాతో ముంచుకొస్తున్న ముంపు.. 

కరోనా టెస్టు,వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి..బాజాపా. 

మూడు కోతులకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపిన బీజేపి శ్రేణులు.. 

కరోన టెస్టులకు 11 కిలోమీటర్ల దూరంలోని దుండిగల్ కి వెళ్లాల్సిన పరిస్థితి.. 

మాస్కులు,సామాజిక దూరం పాటించకపోతె కరోన విలయతాండవానికి గురికాక తప్పదు.. 

ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుందని బాజాపా నాయకుల ఆరోపణలు..


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

కోతి బొమ్మలకు వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో బాజాపా నిరసన తెలియజేశారు.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత కరోనా టెస్ట్ సెంటర్లు మరియు వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ బాజాపా ఆధ్వర్యంలో మూడు కోతులు సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.. కోతుల బొమ్మలకు విజ్ఞాపన పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా కరోణ వ్యాధి రెండో దశ విజృంభిస్తున్న, మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు ,మేయర్, కమిషనర్ లు ఏ మాత్రం శ్రద్ధ వహించడం లేదని, కార్పొరేషన్ పరిధిలో కనీసం కరోణ టెస్టులు ఏర్పాటు చేయకపోవడం, గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచిత కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన, కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోక పోవడం సిగ్గుచేటని, కరోనా టెస్ట్ చేసుకోవడానికి, వ్యాక్సినేషన్ తీసుకోవడానికి నిజాంపేట కార్పొరేషన్ ప్రజలు 11 కిలోమీటర్ల దూరంలోని దుండిగల్ కి వెళ్లాల్సిన పరిస్థితి అని అన్నారు.. కావున తక్షణమే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు కరోనా టెస్ట్ సెంటర్స్, వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని పది రోజుల్లో ఏర్పాటు చేయాలని, లేనియెడల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ మోర్చా మహిళ ప్రముఖ ఆమల్లేశ్వరి మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు చిత్తశుద్ధి లేదని, ప్రజా ప్రతినిధులు ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి మోర్చా స్కాలర్షిప్ కన్వీనర్ దాస నాగరాజు, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శివ కోటేశ్వరరావు, సెక్రెటరీ అనిత, అధ్యక్షులు రవీంద్ర ,ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్, కార్యవర్గ సభ్యులు నవ్య, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్ ,హనుమంతురావు, సుధాకర్, కృష్ణ, సైదులు, సాయి తదితరులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...