ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరి...
వృత్తి నిబద్ధతకు మారుపేరు రామలింగారెడ్డి..ఎమ్మెల్యే వివేకానంద..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ మేదిని రామలింగారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి శుక్రవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ వృత్తి నిబద్ధతకు మారుపేరు రామలింగారెడ్డి అని, ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పని సరని అన్నారు. 23 ఏళ్లుగా విద్యాపరంగా రామలింగారెడ్డి ఎన్నో సేవలు అందించారని, ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ప్రధానోపాధ్యాయులు ఖాజా పాశ, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, రామ్మోహన్ రెడ్డి, విజయ రాణి, దానయ్య, గోపాల్, శ్రీనివాస్, స్థానిక వార్డు సభ్యులు ఇందిర రెడ్డి, నాగ శేఖర్ గౌడ్, పెద్ది మల్లేశం, యేసు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment