Followers

పల్లా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న యువ నాయకుడు.

 పల్లా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న యువ నాయకుడు.


నెల్లికుదురు /పెన్ పవర్,



మహుబుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి వరంగల్ ఖమ్మం, నల్గొండ, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండల లోని ఆలేరు,చిన్నముప్పారం, రాజులకొత్తపెల్లి, శ్రీరామగిరి గ్రామాలలో పర్యటించారు.ఈ సందర్బంగా వారు గ్రాడ్యుయేట్స్ ఉద్యోగఓటర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పేదప్రజల బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మరియు రైతన్నల అభివృద్ధికై రైతుభీమా, రైతుబందు లాంటి పాలసీలు తీసుకువచ్చి రైతులకు మనోదైర్యం కల్పించిన ప్రభుత్వం అని వివరించారు. కావున తెరాస పార్టీ బలపర్చిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కి మొదటిప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ముప్పారం సర్పంచ్ చీకటి ప్రవీణ్ గౌడ్, ఎంపీటీసీ కదిరే జగన్ గౌడ్, శ్రీరామగిరి పి ఏ సి స్ చైర్మన్ గుండా వెంకన్న, ఆలేరు సర్పంచ్ కాలేరు శ్రీవాణి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎస్కె షరీఫ్, మండలయువనాయకులు పోరండ్ల గణేష్, మద్దెల రాజేష్ గౌడ్,గంగాధర్, శ్రీరామగిరి పార్టీ అధ్యక్షులు డొనికెని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు డొనికెని అశోక్ గౌడ్, ఆదూరి కళాధర్రాజు, పోరండ్ల సోమయ్య, గండి శ్రీనివాస్ గౌడ్, ఎస్కే మధార్, ఉప్పలయ్య,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...