Followers

ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

 ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలి

విజయనగరం,పెన్ పవర్

 నగరంలో ఆస్తిపన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చాంబర్లో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ  పెండింగ్ లో ఉన్న బకాయిలను,మొండి బకాయిలను యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ప్రతిరోజు సిబ్బంది నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితంగా పన్ను వసూలు చేయాలని అన్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆయా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు  తీసుకోవాలని చెప్పారు. లేనియెడల సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సాయి, తదితరులతోపాటు  వార్డు కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...