Followers

గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

 గౌడవెల్లి లో అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగింది..

పెన్ పవర్,మేడ్చల్

మండల పరిధిలోని గౌడ వెల్లి గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణం, అగ్ని గుండాలు నిర్వహించారు. కొండపోచమ్మ కు యాదవ్ మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. జాతర సందర్భంగా ఎంపీపీ పద్మజగన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అప్పమ్మాగారి పద్మజగన్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రతియేటా వైభవోపేతంగా జాతరను నిర్వహిస్తున్న యాదవ సంఘం సభ్యులను ఎంపీపీ ప్రశంసించారు. స్వామివారు గ్రామస్తులు అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెంటమ్మ, టిఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి  లహరి రెడ్డి, యాదవ సంఘం నాయకులు యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, సింహాలు యాదవ్, వెంకటేష్ యాదవ్, యాదయ్య యాదవ్, ఐలయ్య యాదవ్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ కృష్ణ యాదవ్, మాజీ ఎంపిటిసి నవనీతా రాంరెడ్డి, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...