మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు దంపతులు...
బేలా, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లోని కరంజీ గ్రామంలో చరణ్ రెడ్డి, బేల మండలంలోని సాంగిడి గ్రామంలో ఉపేందర్ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను శుక్రవారం ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా పవన్ రావు మండల టిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాంగిడి ఎం పి టి సి రాకేష్, టిఆర్ఎస్ కార్యకర్తలు వసంత్, ఎస్కే మహమ్మద్, అయూబ్, పవన్ రావు, టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment