అట్టాడ అప్పలనాయుడు కి పతంజలి పురస్కారం భీశెట్టి
విజయనగరం,పెన్ పవర్సీనియర్ పాత్రికేయుడు ఆధునిక తెలుగు సాహితీరంగాన్ని మెరిపించి,మురిపించిన స్వర్గీయ కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి(కే.ఎన్. వై.పతంజలి) 69వ జయంతి సందర్భంగా ఈ నెల 29 న జామి మండలం అట్టాడ బి.ఎన్. ఆర్.అశ్రమం లో నిర్వహించే సభలో ప్రముఖ రచయిత, పాత్రికేయుడు అట్టాడ అప్పలనాయుడు కి పతంజలి పేరున పురస్కారం అందచెయ్యడం జరుగుతుందని కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ప్రకటించారు శుక్రవారం గురజాడ అప్పారావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ తమ సంస్థ ప్రతి సంవత్సరం పతంజలి పేరుతో ప్రముఖులకు పురస్కారం అందచేస్తుందని గత సంవత్సరం కరోనా వలన పురస్కారం అందించ లేకపోయామని ఈ సంవత్సరం విజయనగరం జిల్లా వాసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచిరచయతగా పేరుతెచ్చుకున్న అభ్యుదయ రచయిత అనేక కథలు,నవలలు రాస్తూ సమకాలీన సమస్యలు పై ఎప్పటికప్పుడు పత్రికల్లో స్పందించే అట్టాడ అప్పలనాయుడు ని కమిటీ ఎంపిక చేసిందని భీశెట్టి తెలిపారు గతంలో పతంజలి పేరున దేవిప్రియ,మోహన్,జి.ఆర్.మహర్షి,సతీష్ చందర్,చింతికింది శ్రీనివాస్ లకు పురస్కారాలు అందించామని 29 సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో సాహిత్య అభిమానులు, పతంజలి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు,ఈ సమావేశంలో పతంజలి సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఎన్.కె.బాబు,ప్రతినిధులు బండ్లమూడి నాగేంద్రప్రసాద్,వాడ్రేవు శ్రీనివాసరావు(కోరుకొండ బుజ్జి) తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment