ఎమ్మెల్సీ వాణి దేవి కి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్వి నాయకులు.
తార్నాక, పెన్ పవర్హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఘనవిజయం సాధించిన సురభి వాణి దేవి ని టీఆర్ఎస్వి నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన విజయానికి కృషి చేసిన టీఆర్ఎస్వి విద్యార్థి విభాగానికి వాణి దేవి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను శాలువాతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్, కాటం శివ, బొల్లు నాగరాజు యాదవ్, ప్రశాంత్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment