రాష్ట్ర ముఖ్య మంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఉద్యోగులు...
బేలా, పెన్ పవర్మంగళవారం బేలా మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ లో ప్రభుత్వ ఉద్యోగులకు 30% పిఆర్సి పెంచినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణాలో పిఅర్సి ఇవ్వడం ఒక అద్భుతం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు తహసిల్దార్ బడల రాంరెడ్డి,ఎంపీడీఓ భగత్ రవీందర్, ఆంగన్వాడీ టీచర్లు పంచాయతీ సెక్రెటరీల తో పాటు పలు రంగాల ప్రభుత్వ ఉద్యోగులు, ఆడనేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి చంద్రశేఖర్,మండల తెరాస నాయకులు గంభీర్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment