కేంద్రంలో బిజెపి పరిపాలన ...మోడీ వల్ల దేశానికే తిరని నష్టం.. శాంత కుమారి
అరకు, పెన్ పవర్
మోడీ తిరు దేశనికే నష్టం అని పి సి సి ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి అన్నారు. శుక్రవారం భారత్ బంద్ సందర్భంగా రైతుల ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతులు గత వంద రోజులుగా నిరసనలు చేస్తున్నారని. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడంతో గత నెలలో ఒకసారి భారత్ బంద్ ను నిర్వహించారని.కాగా, నేడు రెండోసారి భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కి సహకరిస్తున్నారని అత్యవసర సర్వీసులు మినహా అన్నీ మూతపడ్డాయని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు దేశంలో ఇంతమంది మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని అన్నారు బంద్ కు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ఎస్పీ, ఆప్ తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు, సాగు చట్టాలను కేంద్రం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం రైతు సంఘాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉదృతం చేస్తామని రైతుల భారత్ బంద్ కు దేశవ్యాప్తంగానూ, ఇతర దేశాలలోని భారతీయుల నుండి విపరీతమైన మద్దతు లభిస్తుందని. ఇప్పటికే బంద్ కు మద్దతు ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ పార్టీలు రైతుల కోసం ఆందోళన బాట పట్టాయి.
No comments:
Post a Comment