మేయర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సచివాలయ ఉద్యోగులు
మహారాణి పేట, పెన్ పవర్
జి.వి.ఎమ్.సి,నూతన మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి ని విశాఖపట్నం జిల్లా గ్రామ వార్డ్ సచివాలయాల ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలనన్నారు. సచివాలయ ఉద్యోగులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ పీజే గణేష్ , వైస్ ప్రెసిడెంట్ పి.వి. కిరణ్ కుమార్ యాదవ్ ,జాయింట్ సెక్రటరీ పవన్ ,శ్యాం, మహిళ కార్యదర్శి భారతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment