బస్సును ఢీకొన్న స్కూటీ
ఇరువురికి స్వల్ప గాయాలు
విశాఖ పొలిటికల్, పెన్ పవర్
బుధవారం రాత్రి గం. 9.30 ని. సమయంలో సింహాచలం డిపో నుండి ముడసర్లోవ రోడ్డు మీదుగా బీచ్ కు వెళుతున్న AP 11 Z 6656 నంబరు గల 65 K ఆర్.టి.సి..బస్సును ఎదురుగా వస్తున్న హీరో హోండా ఆక్టివా AP 31 DD 9459 నెంబర్ గల స్కూటీ బస్సుకు కుడివైపు గుద్దింది. ఈ సంఘటన పెడగదిలి కూడలి దగ్గరలో సంభవించింది. అయితే అక్కడికక్కడే స్కూటీ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు కింద పడిపోయారు. వారికి స్వల్ప గాయలయ్యయి. హుటాహుటిన 108 కు ఫోన్ చేసి క్షతగాత్రులను అపోలో ఆసుపత్రి కి తరలించారు. ఈ నేపథ్యంలో బస్సు బంపర్ దెబ్బతింది. స్కూటీ ముందు భాగం బాగా నుజ్జయింది. ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్న కొల్లి ఉమా దేవి మరియు బొప్ప సత్యవతిలు పైనాపిల్ కాలనీ లోని తమ బంధువుల పెళ్లికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.గాయ పడ్డ వారిని ఆర్.టి.సి. అధికారులు పరామర్శించారు.
No comments:
Post a Comment