జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ లో భాగంగా దోమతెరలు పంపిణీ
గోకవరం,పెన్ పవర్గోకవరం మండలం, కామరాజుపేట గ్రామంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం లో భాగంగా గ్రామ సర్పంచ్ అడపా వెంకటరావు చేతుల మీదుగా ప్రజలకు దోమ తెరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిహెచ్. శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఎంతో ఖరిదైన, నాణ్యమైన మందుపూసిన దోమ తెరలు ప్రభుత్వం ద్వారా ఉచితంగా ప్రజలకు ఇస్తున్నాము అని, వాటిని ఎలా వాడుకోవాలో వివరించి చెప్పినారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ వార్డు సభ్యులు శ్రీమతి కటారి వీరమణి , కర్రి శ్రీను ప్రజా నాయకులు గోంతిన అర్జున జి. కొతపల్లి పి.హెచ్.సి ఎం పి హెచ్ వో వైస్ రాయుడు, సూపర్వైజర్ వై. అరుణమ్మ, రేఖ, హెల్త్ అసిస్టెంట్ లు అప్పారావు, శ్రీనివాస్, రాజు, మస్తాన్, ఏఎన్ఎం లు ఎస్ కె మణి, శాంతకుమారి, ఆశ లు, శివపార్వతి, జ్యోతి, బాపిలక్ష్మి, మీనాకుమారి మరియు ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment