జనసైనికుల ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చలివేంద్రం
పెన్ పవర్,ఆలమూరుజనసేన పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేట 16వ వార్డులో రామాలయం వద్ద జనసైనికులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చలివేంద్రం సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వేగుళ్ళ లీలాకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ టంకాల చిన్ని, జనసేన అధికార ప్రతినిధిలు శెట్టి రవి, నామాల చందర్రావు, కొంతం నాగేంద్ర ప్రసాద్, సుంకర మణికంఠ (ఫ్రెండ్స్ సర్కిల్), చింత శ్రీను, గెడ్డపు కిరణ్, కనపర్తి వీర్రాజు, పొలమురి విజయ్, సత్తి శ్రీను, మామిడాల మనోకృష్ణ, బండారు సతీష్, పైడమళ్ళ సతీష్, వెలుపూరి ముత్తు, కొనే గణేష్, నిమ్మ రమేష్, పొన్నాడ శేఖర్, టంకాల సాయి, కొత్తపల్లి కళ్యాణ్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment