రోకలి బండతో భర్త ను కడతేర్చిన భార్య..
ద్వారం వీధిలో దారుణంకుటుంబ కలహాలే హత్యకు కారణం అంటున్న పోలీసులు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వన్ టౌన్ ఎస్ ఐ
పెన్ పవర్, విశాఖపట్నం
కట్టుకున్న భార్య యే రోకలిబండతో భర్త తలను పగులగొట్టి హత్య చేసిన సంఘటన నగరంలో సంచలనం లేపింది. వన్ టౌన్ పోలీసులు అందించిన వివరాలు ఎలా ఉన్నాయి. నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ద్వారం వారి వీధిలో గురువారం రాత్రి భర్త తలపై భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసింది. ద్వారం వీధిలో నివాసం ఉంటున్న పూసర్ల పుండరీకాక్షయ్య అతని భార్య సాయిరాం అలియాస్ పుణ్యవతి తరచూ ఘర్షణలు వాడుతుండేవారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇరువురు ఘర్షణపడ్డారు. ఘర్షణ తారస్థాయికి చేరడంతో పుణ్యవతి రోకలి బండ తెచ్చి భర్త తలపై బలంగా మోగింది. ఈ సంఘటనలో పుండరీకాక్షయ్య తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు సమాచారం అందడంతో వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. స్థానికులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పుణ్యవతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ హత్య వెనుక కారణాలు వెలుగు చూడాల్సి ఉంది. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
No comments:
Post a Comment