దూలపల్లి అడవిలో భారీ అగ్ని ప్రమాదం
ఎగిసిపడిన మంటలు సుమారు 15 ఎకరాల అడవి దగ్ధం అయినట్టు అంచనాకాలీపోయిన వెదురు పొదలు రక్షణ చర్యలు చేపడతామన్న మేడ్చల్ జిల్లా డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు
కొంపల్లి మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్లతో నీటి సరపరా చేసి మంటలు ఆర్పారు
జీడిమెట్ల ఫైర్ ఇంజన్లతో సిబ్బంది సకాలంలో స్పందించారు డిఎఫ్ఓ
ఆకతాయిలు చేసి ఉంటారని భావిస్తున్న అటవీశాఖ అధికారులు
అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా సంభందిత ఫారెస్ట్
విచ్చల విడిగా ఖాళీ మద్యం బాటిళ్ళు అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం
ఇకమీదట అడవిలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు:ఎఫ్ఆర్ఓ శ్రీదేవి
కుత్బుల్లాపూర్,పెన్ పవర్
అసాంగీక కార్యకలాపాలకు ఆనవాళ్లు మధ్యం బాటిళ్లు అగ్ని ప్రమాదం సంభవించిన ఈప్రాంతంలో పెన్సింగ్ రక్షణ లేక పోవడంతోనే ఆకతాయిలకు ఈప్రదేశం అడ్డాగా మారిందని పలువురు అబిప్రాయం తెలియజేస్తున్నారు.ఈ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.. నగర శివారులోని అడవుల సుందరీకరణ, రక్షణ చర్యలలో భాగంగా ఇప్పటికే బహుదూర్ పల్లి, దూలపల్లి, బౌరంపేట వద్ద ఇనుప జాలి ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు.. అటవీ లోపల నడక మార్గాలను కూడా సుందరీకరణగా తీర్చి దిద్దుతున్నామని, ఈప్రాంతంలో విచ్చలవిడిగా మధ్యం సేవిస్తున్నట్లు మధ్యం బాటిళ్ళు పడేసి ఉన్నాయని, అధికారుల పర్యవేక్షణ రోజంతా ఉన్నప్పటికీ రాత్రి సమయంలో మధ్యం సేవిస్తున్నట్లు అటవీప్రాంతం ప్రమాద స్థలంలో ఉన్న ఆదారాలు చెపుతున్నాయి.. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటామని డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
వేసవి ప్రారంభం కావడంతో ఎండు ఆకులతో అటవీప్రాంతం నిండి ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించి చెట్లు దహనం అయ్యాయని..అటవీ సిబ్బంది సమాచారంతో సంఘటనా స్థలానికి కొంపల్లి మున్సిపల్ సిబ్బంది సకాలంలో స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేసి మంటలను అదుపులోకి తేవడంలో మున్సిపల్ సిబ్బంది తీవ్ర కృషి చేశారని అటవీ అధికారులు తెలిపారు.. పైర్ సిబ్బంది కూడా సహకరించారని, మంటలను అదుపులోకి తెచ్చారని అటవీ అధికారులు అన్నారు.
No comments:
Post a Comment