వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలి
మందమర్రి ఎస్సై భూమేష్
మందమర్రి, పెన్ పవర్కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒకరు సామాజిక దూరం పాటించాలని ఎస్సై భూమేష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మలిదశ కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒకరు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. అవసరం మేరకే బయటకు రావాలని, తప్పక మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్నామనే ధోరణితో ఇష్టా నుసారంగా సంచరించరాదని అన్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని తప్పక ఆరోగ్య సూత్రాలను పాటించాలని మీ నిర్లక్ష్యం ఎదుటి వారికి శాపంగా మారోధ్దని అన్నారు. జీవో 68 ప్రకారం మాస్క్ ధరించని వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
No comments:
Post a Comment