తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులును మర్యాదపూర్వకంగా కలిసిన గబ్బర్ సింగ్
పెన్ పవర్ ఆత్రేయపురం
ఆత్రేయపురం మండలం ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆత్రేయపురం మండలంలో ఉన్న 17 గ్రాముల గాను పంచాయతీ ఎన్నికలు జరగగా అందులో పది గ్రామపంచాయతీలో వైసీపీ కైవసం చేసుకుంది మిగతా 7 గ్రామపంచాయతీలో తెలుగుదేశం కైవసం చేసుకోగా మండలంలో ఆత్రేయపురం గ్రామపంచాయతీ హోరాహోరి జరిగిన ఎన్నికల్లో 14 వార్డ్ నెంబర్ గాను పది వార్డులను వైసిపి కైవసం చేసుకుంది తెలుగుదేశం మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట రాజు గబ్బర్ సింగ్ కేవలం నాలుగు వార్డుల్లో సత్తా చాటుకుని సర్పంచ్ అభ్యర్థిని గడ్డం సుధా 443 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది గబ్బర్ సింగ్ చేసిన కృషికి ఫలితముగా ఆత్రేయపురం గ్రామ ప్రజలు గబ్బర్ సింగ్ బలపరిచిన అభ్యర్థిని పంచాయతీ సర్పంచ్ గా గెలిపించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అమలాపురం పార్లమెంటు అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ల దగ్గర నుండి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగినది.
No comments:
Post a Comment