భాజపా బలోపేతానికి దళిత మోర్చా కృషి
అనకాపల్లి పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ బలపడేందుకు దళిత మోర్చా క్షేత్రస్థాయిలో కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. భాజపా కార్యాలయంలో దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి దళిత నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుంది అన్నారు. పార్టీ విజయంలో దళిత పాత్ర కీలకం కానుందన్నారు. సమావేశానికి ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండబాబు మాస్టర్ అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment