విశాఖ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో మరో మైలు రాయి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
104- ఏరియా ఎల్ సి 493 రైల్వే గేట్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. సుదీర్ఘకాలంగా వేచి ఉన్నా ఈ అండర్ పాత్ పనులు ఈ రోజు తిరిగి ప్రారంభించారు , ఒక్కరోజు కట్ అండ్ కవర్ పద్ధతిలో కేవలం తొమ్మిది గంటల్లో ఆరు మీటర్ల ఎత్తు 11 మీటర్ల వెడల్పుతో పూర్తి చేశారు. ఈ పనులను గనబాబు పర్యవేక్షించారు. ఈ అండర్ పాత్ వల్ల ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు.ముఖ్యంగా దేశవానిపాలెం, అశోక పార్క్, ఎన్ఏడి కోటర్స్, మేఘాద్రి పేట ఏరియా లో నివసించే వారికి మరియు ఎస్ బి సి డాక్ యార్డ్ ఎంప్లాయిస్ , డిఫెన్స్ ఎంప్లాయిస్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో రైల్వే గేట్ సమస్య తీరింది అని తెలియజేశారు.ఇది నియోజకవర్గంలో రామ్మూర్తి పంతులు పేట పాత్ లా మరో మైలురాయి అని గుర్తు చేసుకున్నారు.
No comments:
Post a Comment