సచివాలయ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ
ఇందిరగాంధీ మున్సిపాల్ స్టేడియం, 36వ వార్డ్ 6వ సచివాలయం (వాలంటీర్ ఆఫీస్)
పూర్ణా మార్కెట్, పెన్ పవర్ ప్రతినిధి : సతీష్ కుమార్
సామాజిక సేవలో బాగంగా, ప్రస్తుతం కరోనా మహమ్మారిని తరిమి కొట్టే ప్రయత్నములో లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో నిర్విరామంగా సేవాభావంతో పనిచేస్తున్న సచివాలయం సిబ్బందికి విళ్లురి భాస్కర్ (విఎంఆర్. ఫౌండేషన్) ద్వారా రేషన్ కిట్ల పంపిణీ.
విశాఖపట్నం వన్ టౌన్ . విల్లురీ భాస్కర్ (విఎం ఆర్. ఫౌండేషన్) ఆధ్వర్యంలో, ద్రోనం రాజు శ్రీనివాస్ (విఎం ఆర్ డి ఏ) చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి, 35వ వార్డు, 6వ సచివాలయములో వున్న, సెక్రెటరీ లకు , 45 మంది అడ్మిన్లకు,105 గురు ఉన్న సచివాలయ వాలంటీర్ సిబ్బందికి, బియ్యం, పప్పు, సబ్బులు మొదలగు వస్తువుల కిట్లని విల్లురి భాస్కర్(విఎం ఆర్ ఫౌండేషన్) సహాయముతో , విఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ చేతుల మీద అందజేయడం జరిగింది , ఈ కార్యక్రమములో బుజ్జి(రామకృష్ణ వీధి), మంగరాజు, నాయని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment