గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సి ఐ
సాలూరు:
మండలంలో గిరిశిఖర గ్రామాలైన నేరెళ్ల వలస , దళా యి వలస, దూ లి భద్ర ,కుంభి మడ, మువ్వల తాడి వలస, గంజాయి భద్ర, గాలి పాడు, గొట్టిపాడు ,గన్నేరు, గొయ్యి కాగు, రూడి, సంపంగి పాడు ,బట్టి వలస, దండి గాo, ప ను కు లోవ,తదితర గిరిజన గ్రామాల కు కరోనా రక్కసి కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారి ఆకలి దప్పిక లు తీర్చడానికి పట్టణానికి చెందిన కామాక్షి అమ్మవారి ఆలయం పీఠాధిపతి అయిన శ్రీ ముద్దు సత్యనారాయణ మూర్తి సౌజన్యం తో బుధవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు, రూరల్ ఎస్ .ఐ. దినకర్ ఆధ్వర్యంలో గిరిశిఖర గ్రామాల పేద గిరిజనులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులైన బియ్యం, ఆయిల్ ,సబ్బులు, పప్పులు ,ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మిల్ మేకర్, పసుపు కారం, మసాలా వస్తువులతో కూడిన దాదాపు 900 రూపాయలు విలువచేసే ఫ్యామిలీ ప్యాక్ ఒక్కో కుటుంబానికి చెప్పు నా దాదాపు 500 గిరిజన పేద కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శారదా సత్సంగ ఆశ్రమ సేవకులు బి అప్పలరాజు రమణ స్వామి పలివెల మంగరాజు మోహన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment